Wednesday, December 28, 2016

ఇవి చదవండి

1. జీవితంలో ఎప్పుడైనా
       ఎవరి నైనా పనికి రాని వారిగా
         పరిగణించవద్దు ఎందుకంటే
           చెడిపోయిన గడియారం
             కూడ రోజుకు రెండు సార్లు
               సరైన సమయం
                  సూచిస్తుంది

2. ఎప్పుడూ ఇతరుల తప్పులను
      అన్వేషించే వ్యక్తి అందమైన
         పుష్పాల పరిమళాలను
           వదలి పుండు మీద వాలే
             ఈగ లాంటి వాడు

3. పేదరికం ధరిచేరినప్పుడు
      ఆప్తమిత్రులు కూడ
        దూరమైతారు అదే
          ధనవంతులైనప్పుడు
            తెలియని వారు కూడ
               మిత్రులవుతారు

4. ఒక్క సారి నవ్వుతూ చూడు
      ప్రపంచంలో ఉండే అందాలన్ని
        నీ సొంతమవ్వుతాయి కానీ
          తడిసిన కనురెప్పలతో
             చూసే అద్దంకూడ మసక
                బారి పోతుంది

5. తొందరగా దొరికేది ఏదైనా
       ఎక్కువకాలం మన్నికరాదు
         ఎక్కువకాలం మన్నిక
           వచ్చేది అంతతొందరగా
              దొరకదు

6. జీవితంలో వచ్చే చెడు రోజులు
      కూడా మన మంచి కొరకే
        అనుకోవాలి అప్పుడే
          తెలుస్తుంది నిజమైన
            స్నేహితులు ఎవరైనది

7. మనిషికి రోగాలు కుందేలు లాగా
      వస్తాయి తాబేలు లాగా
        వెళ్లుతాయి కానీ డబ్బులు
          తాబేలు లాగ వస్తాయి
             కుందేలు లాగా
                వెళ్లుతాయి

8. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని
       వెతకటం అలవాటు
         చేసుకోవాలి ఎందుకంటే
           పెద్ద పెద్ద మాటలు
             జీవితంలో చాలా
                అరుదుగా చోటు
                   చేసుకుంటాయి

9. ఈశ్వరుని ప్రార్ధించినప్పుడు
      నాకు ఏమి ఇవ్వలేదని
        బాధపడకు ఎందుకంటే
          నీకు అక్కడ ఇవ్వక
            పోయినా నీకు నచ్చిన
              చోట నీకు ఈశ్వరుడు
                నచ్చినవిధంగా ఇస్తాడు

10. నిత్యము ఎదురయ్యే
        అపజయాలను చూసి
          నిరాశ చెందకు కానీ
            ఒక్కోసారి తాళంచెవి
              గుచ్చంలో ఉండే ఆఖరి
                తాళంచెవి కూడ తాళం
                   తెరుస్తుందని
                      గమనించు

11. ఈ సమాజంలో నేను ఒక్కడిని
         ఎంచేయగలననీ ప్రతి మనిషి
           నిరాశ చెందుతుంటాడు
             కానీ ఒక్క సారి తలపైకెత్తి
               చూడు ప్రపంచానికి
                వెలుగునిచ్చే సూర్యుడు
                   కూడ ఒక్కడేనని 

12. బంధవులు ఎంత చెడ్డ వారైనా
         సరే వదులుకోవద్దు
           ఎందుకంటే మురికి నీరు
             దప్పిక తీర్చలేక పోయిన
               కనీసం అగ్గి మంటలు
                 ఆర్పటానికి పనికి
                    వస్తాయి

13. నమ్మక ద్రోహి స్నేహితునికన్నా
        దురాశపరుడు సన్నిహితుడు
          మిన్న మట్టితో చేసిన
            మనుషులు కాగితాలకు
               అమ్ముడు పోతారు

14. మనిషి గా మాట్లాడుట
         రాక పోయినా కనీసం
           పశువుల మౌనంగా
             ఉండటమే ఉత్తమం

15. మనకు మాటలు రాక ముందు
       మనముఎంచెప్పబోతున్నామో
         అమ్మకు అర్థమయ్యేది కాని
           మనము మాటలు అన్ని
             నేర్చిన తరువాత ఇప్పుడు
                మాటమాటకు ప్రతిసారి
                   అమ్మా నీకు అర్థం
                      కాదులే అంటాం

16. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు
          దూరమైనారని బాధపడకు
            ఎందుకంటే నీవు ఒక్కనివే
               జయించగలవని వారు
                 నమ్మినందుకు నీవు
                     సంతోషించు

17. సిగ్గు మర్యాద లేని
        ధనవంతు కన్నా
          మంచి మానవత్వం ఉన్న
            పేదరికం మిన్న

18. జీవితంలో హెచ్చుతగ్గులు
         రావటంకూడ మనమంచి
           కోసమే అనుకోవాలి
             ఎందుకంటే ECG లొ
               వచ్చే సరళరేఖా కూడ
                  మృత్యువును
                     సూచిస్తుంది

19. ఈ రోజుల్లో సంబంధాలు
         రొట్టె తొ సమానమైనవి
           ఎందుకంటే కొద్దిగా మంట
             ఎక్కవైందొలెదో రొట్టె
               మాడిమసి కావటం
                   ఖాయం

20. జీవితంలో మంచి వారి కోసం అన్వేషించ వద్దు ముందు నీవు మంచిగా మారు బహుశా నిన్ను కలిసిన వ్యక్తికి మంచి మనిషి అన్వేషణ పూర్తి
కావచ్చు నేమో🙏

Tuesday, December 27, 2016

రైతులకు భరోసా నిధి ఎందుకు లేదు

✍🏻 *రైతుల భరోసా నిధి ఎందుకు లేదు ?.విపత్తులకు నష్ట పరిహారం అందక ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగుతున్న రైతన్న ప్రభుత్వాలు మారినా మారని రైతుల దుస్థితి*
✍🏻భారత దేశం రైతు బాంధవ దేశం
*జై కిసాన్ అని* అన్నారు. వరదలు తుఫానులు, నకిలీ విత్తనాలు, డేట్ అయ్యిన ఎరువులు, పురుగు మందులు, సొకిన వైరస్ లు ,అధిక వ్యయం,సరైన మద్దతు ధర లేక ,గిట్టు బాటు ధర లేక చేసిన అప్పులు తీర్చ లేక పిల్లల్ని చదివించలేక పెళ్లిళ్లు చేయలేక ఏడాదికి సుమారు 20 వేల చని పోతున్నారు.
✍🏻ప్రాధమిక రంగం అని 70%మంది ప్రజలు వ్యవసాయం మీదే ఆధార పడినా దానికి ఒక ప్రత్యేక బడ్జెట్ లేక పోవడం పాలకుల చేతగాని తనమే .
✍🏻విదేశాలలో ఏ రంగం అభివృద్ధి చెందుతుందో దానికి మరిన్ని రాయితీలు యిచ్చి ముందుకు నడిపిస్తారు.కానీ దేశం రవాణా ,ఆదాయం ,కార్మికులు,రాబడి, తిండి అన్ని ఒకే రంగం మీద ఉన్నా నిధులు సూన్యం
✍🏻మన రాష్ట్రము లో 5సంవత్సరములలో హెలిన్ ,ఫైలిన్ ,నీలం ,హుద్ హుద్, కెంప్ లాంటి బారి తుపాన్ లు వచ్చినా కేంద్ర సహాయం అని కూర్చున్నాము తప్ప రైతుకు ఇచ్చింది సూన్యం రికార్డ్స్ లో ఇస్తున్నాము అని ప్రచారం .
✍🏻సెపరేట్ బడ్జెట్ పెట్టి నిధులు ఎందుకు ఇవ్వడం లేదు. ఆర్ధిక బడ్జెట్ కాకుండా రైతు భరోసా నిధి అని కేంద్ర ఆగంతుక నిధిని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు.
✍🏻విపత్తు నిర్వహణ అధికారులు రైతు పేరిట చేతి వాటం  చూపించి కోట్లు సంపాదించారు.ఇప్పటికి నష్ట పరిహారం అందక తుపాను బాధితులు ఉన్నారు రికార్డ్స్ లో ఇచ్చామని బాధితుల సొమ్ము తిన్నారు.
✍🏻రైతు భరోసా నిధి ఏర్పాటు చేయాలి ప్రత్యేక బడ్జెట్ ఉండాలి. నష్ట అంచనా అనుభవం ఉన్న టీం చేత చేయించాలి.
✍🏻నష్ట నివారణ చేసిన్నప్పుడు అధికార బలం చూపి దొంగ లెక్కలు చూపించే అధికారుల్ని తొలగించాలి.
✍🏻నష్ట పరిహారం రైతు అకౌంట్స్ లోకి మాత్రమే జమ చేయాలి.అనుభవం ఉన్న వ్యవసాయ నిపుణులు చేత అంత రించి పోతున్న వైరస్ సోకుతున్న పంటలకు మార్గదర్శికాలు వెతకాలి .
✍🏻నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మితే చట్టం చేసి కఠినంగా శిక్షించాలి. గవెర్నమెంట్ అనుబంధ సంస్థల్లో మాత్రమే అమ్మే ఏర్పాటు చేయాలి. దీని వలన ఉద్యోగాల సృష్టి జరిగి ఉపాధి పెరుగుతుంది
✍🏻గిట్టు బాటు ధర మద్దతు ధర పంట వేయక ముందే ప్రకటించి ,ప్రతి మండలానికి ఓక రైతుమార్కెట్స్ పెట్టి షెడ్లు నిర్మించాలి.
✍🏻వరదలు సంభవించే నది పరివాహక ప్రాంతాల్లో ఆయకట్లు బలం గా తయారు  చేయాలి. నివారణ కొరకు మాoగ్రు పంటలు ఏర్పాటు చేయాలి.
✍🏻రైతు ఆత్మహత్యలు నివారించి నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
✍🏻ఆదునిక ప్రపంపంచం లో ఇప్పటికైనా రైతుని అడుకోకపోతే పంటలు కొరత వచ్చి పండించే నాధుడే లేకుండా పోతాడు.
✍🏻విపత్తులు వచ్చినప్పుడు కంటి తుడుపు చర్యలు చేసి చేతులు దులుపుకుని మీడియా ముందు సొల్లు చెప్పి *అబద్ధపు హామీలు ఇచ్చి*రైతు నడ్డివిరిచే నాయకులకు తగిన శాస్తి తప్పదు

తులసి - దురదగుంట చెట్లు

ఆడవారు తులసి చెట్టు వంటివారు.😍

మగవారు దురదగుంట చెట్టు వంటివారు.😏

చాలా బాగా చెప్పారు బీర్బల్ గారు....

మా విలువ తెలుసుకోండయా!!??

బీర్బల్ కౌంటర్ కేక 😎

"బీర్బల్ ... దర్బారుకు ఆలస్యంగా ఎందుకు వచ్చావు?"
"ఆలంపనాహ్... జహా పనాహ్....  ఈ రోజు మా తులసీ మాత పూజ ప్రభూ....!! అమ్మకి పూజచేయడంలో ఆలస్యం అయిపోయింది."
అక్బర్ కి నవ్వొచ్చింది.
"తులసి... మాత....హ హ హ హ ... ఈ చిన్న మొక్క మీకు తల్లా?" అంటూ వికటాట్టహాసం చేశాడు.
"ఎవరక్కడ... ఒక తులసి చెట్టును తెప్పించండి"
పాదుషా తలచుకుంటే మొక్కలకు కొదవా?
సభలో అందరి ముందే తులసి మొక్కను చింపి పోగులు పోశాడు అక్బర్.
"చూశావా... నీ మాతను ఏం చేశానో..."
బీర్బల్ ఏమీ అనలేదు. "చిత్తం జహాపనాహ్" అన్నాడు.
మరుసటి రోజూ బీర్బల్ ఆలస్యంగా వచ్చాడు.
"ఈ రోజేమిటి బీర్బల్... మళ్లీ ఎందుకాలస్యం?"
"ప్రభూ నిన్న మా తల్లిగారి పూజ అయింది. ఇవాళ్ల తండ్రిగారి పూజ ప్రభూ..."
"మీ తండ్రి కూడా ఒక మొక్కేనా..."
"అవును ప్రభూ...."
"ఆ మొక్కని తీసుకురండి"
ఆ మొక్కని దర్బారులో పెట్టారు.
అక్బర్ "మీ అమ్మ పని పట్టాను. ఇక మీ అబ్బ పని పడ్తాను చూసుకో..." అంటూ ఆ మొక్కను చింపి పోగులు పోశాడు.
కాసేపటికి అక్బర్ కి దురద మొదలైంది. ముందు మర్యాదగా కనీ కనిపించనట్టు గోక్కున్నాడు.
తరువాత బరబరా గోక్కున్నాడు. బట్టలువిప్పి మరీ నేలపై పొర్లుతూ గోక్కోవడం మొదలుపెట్టడు.
"అమ్మోయ్... బాబోయ్... నాకేమైంది బీర్బల్ ...." అంటూ గావుకేకలు పెట్టాడు.
బీర్బల్ నెమ్మదిగా, తెచ్చిపెట్టుకున్న వినయంతో "జహాపనాహ్... మా తల్లి శాంత స్వభావురాలు. ఏమీచేయదు. కానీ మా తండ్రి అలాంటివాడు కాదు. ఆయనకు ముక్కుమీదే కోపం."
"ఎవరయ్యా ఈ తండ్రి... బాధ భరించలేకపోతున్నాను."
"ప్రభూ... తులసి మాకు తల్లి. దూలగొండి మాకు తండ్రి. దూలగొండిని కెలుక్కున్నారు మరి...." అన్నాడు బీర్బల్.
"ఏం చేయాలయ్యా... ఎలా తగ్గుతుందయ్యా ఈ దురద....?" అక్బర్ గారు నేలమీద పడి దొర్లుతున్నాడు.
"ప్రభూ దీనికి ఒకటే మార్గం. మా తండ్రి గారి కోపాన్ని మా తల్లి మాత్రమే శాంతింపచేయగలదు. కాబట్టి ఆమెకు మొక్కండి. తులసి ఆకుల రసాన్ని పూసుకొండి. దురద తగ్గుతుంది." అన్నాడు బీర్బల్.
అక్బర్ ఓ చేత్తో గోక్కుంటూనే రెండో చేత్తో తులసమ్మకు దణ్ణం పెట్టాడు.

Shivaji statue technical highlights

This is a public information service message...Share it with everyone.!!!

Many are cribbing about the cost of the *Shivaji statue* 
What they do not know is this statue is a masterstroke by our PM  Modiwhich will pay for itself many times over.

The statue is made of Amorphous Silicon, Cadmium Telluride & Copper Indium Gallium Selenide. This is exactly the same material used to make solar cells. Our government consulted with Dr. Immonen Kirsi, Senior Solar Scientist at
VTT Research, Finland to develop technology to mould these materials into a statue form. This research took 2.5 years & on December 3rd, Dr. Kirsi sent a private email to Modi Sir that it's now ready for mainstream use. The statue will generate enough electricity to power all government offices in Mumbai.

The statue also has Radial Uniform Projection And Ranging(RUPAR) technology to track boats in the Arabian Sea to prevent a repeat of the 2008 Mumbai attack where the terrorists entered India through the sea. RUPAR is the next generation of SONAR technology and has been developed at the Indian Institute of Science.

Congratulations to   all Scientists...

*'ఓం'తో అలసట మాయం..శాస్త్రీయంగా నిరూపించిన బాలిక*

ఓం శబ్దంతో శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలుగేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది. పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్‌లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్తలను అకట్టుకుంది. కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది. 

ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్‌పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది. అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు. 

అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన:పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి...ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియజేసింది. అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది. 

గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు. కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని అన్వేష నిరూపించిందని ఆయన తెలిపారు. 

ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు. ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్‌షాప్‌నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు. వర్క్‌షాప్‌లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్‌లో పర్యటించినపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్‌కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది. 

అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది. దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది. దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది. ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌన:పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది. 

17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది. ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష తెలిపింది. 

*జర్నలిజం ఓ సాలేగూడు.. అందులో చిక్కుకుంటే...*

*(జర్నలిజంలో చేరాలనుకునేవారికి... మొదటి ప్రమాద హెచ్చరిక..)*

జర్నలిజం దేశాన్నేం ఉద్దరించదు.
*జర్నలిస్టులేం సంఘ సంస్కర్తలు కాదు.. నిజాలు రాసే కలాలు మాత్రమే...* జర్నలిస్టులు కూడా సాధారణ మానవులే.. వారు మానవతీత శక్తులేమీ కాదు...
ప్రజల గోడు వినే యాజమాన్యాలు..  ఎప్పుడో చరిత్రలో కలిసిపోయాయి..
ఇప్పుడంతా బిబినెస్.. సెటిల్మెంట్.. కులాల మీద నడిసేవే..
*జర్నలిస్ట్ అనేవాడు జస్ట్ పెయిడ్ వర్కింగ్ టూల్..* ఉపయోగపడినంత కాలం ఉపయోగపడుతుంది.. దాని పనైపోయాక పక్కకు పడేస్తాం.. అలాగే
వాళ్ల పనైపోయినా.. మనతో వాళ్లు పనైపోయినా..
జస్ట్ .. గెట్ ఔట్ అంటారంతే... దయచేసి దొబ్బేయండి అంటారంతే.... (కొన్ని చోట్ల మరీ ఇంత మర్యాదగా చెప్పరులేండి).... 

సో.. ఓ ఆవేశపడిపోయి..
ప్రపంచాన్ని మార్చేద్దామన్న పిచ్చి ఆలోచనలు ఉంటే మరోసారి ఆలోచించండి... 
అదో ఉద్యోగం.. నువ్వు ముందు నీకోసం, నీ కుంటుంబం కోసం కష్టపడుతున్నావ్.. అంతే..
నీకు జీతం కావాలి.. వాడికి చెప్పింది చేసే పనోడు కావాలి...
ఇది మైండ్లో పెట్టుకోండి..
మరే చిన్న ప్రత్యామ్నాయమున్నా.. జర్నలిజం ఆప్షన్ ను జస్ట్ డిలీట్ చేయండి.

ఎందుకంటే.... ఇది సినిమా రంగాన్ని మించిన సాలేగూడు... ఒక్కసారి చిక్కుకుంటే...
గింజుకుచావాల్సిందే... లేదా నువ్వూ సాలీడుగా మారాల్సిందే. అసలు జర్నలిజంలోనే 24X7 అని ఉంటుంది... అంటే 24 గంటలలో నువ్వు పనిచేయాల్సి ఉండొచ్చు... ఎప్పుడు ఏం అవసరమొస్తుందో తెలియదు... మీరేమి ప్లాన్ చేసుకుందామనుకున్నా... ప్లాన్ చేసుకున్నా... ప్లాప్ అవ్వొచ్చు... అన్నీ మీరనుకున్నట్లు జరగవు.... యంగ్ జర్నలిస్టులు,  ట్రైనీలు, జూనియర్ జర్నలిస్టులు ఐతే .. చెప్పనవసరం లేదు....  సీనియర్ జర్నలిస్టులకైతే కొంత వెసులుబాటు వారి అనుభవం రావొచ్చు.. దేశంలో కొన్ని సర్వేలు జర్నలిజం గురించి ఏమి చెప్పాయో.. సీనియర్ జర్నలిస్టలను అడిగితే చెబుతారు.. *కొన్నిచోట్ల జర్నలిస్టులకు పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి కూడా భయపడతారట...* అవును మరి యంగ్ జర్నలిస్టుగా జాయిన్ అయ్యేటప్పుడు నువ్వేకడివే.. ఆ తర్వాత.. ఆ పైన.. ఒకటి రెండు అవుతుంది.. రెండు మూడు అవుతుంది.. అప్పుడు నీలో మొదట్లో ఉండే ‘ఫైర్’ ఉండదు.. ఆవేశం, పొగరు ఉండదు, బరితెగింపు ఉండదు.. ఎందుకంటే నీ మీద ఆధారపడి కుంటుంబం ఉందన్న విషయం గుర్తురావొచ్చు.. అప్పుడు ఏంచేద్దామా అని వెనక్కి తిరిగి ఆలోచిస్తే చేయడానికీ ఏమీ ఉండదు... అందుకే ఇప్పుడే ఆలోచించుకో.. ఇది అందరికీ వర్తించకపోవచ్చును.. కొందరికి పెద్దల సపోర్ట్ ఉండోచ్చు, ఆదృష్టం ఉండొచ్చు.. యాజమాన్యం అండదండలు ఉండొచ్చు.. ఆఖరికి కులం పేరుతో కూడా నీకు అండ, దండ ఉండోచ్చు.. అదే నీకు వ్యతిరేకం కావొచ్చును... ఇవన్నీ ఆలో’చించి‘తే నువ్వు ఏమీ చేయలేవనిపిస్తోంది... ఆలోచించకుండా పోతే ఏమైనా ఆద్బుతాలు కూడా చేయచ్చు.. లేదు *ఎన్ని బంధాలు, బంధనాలు ఏర్పడినా నాలో ఫైర్ తగ్గదు అని నీకు కాన్ఫిడెంట్ ఉంటే వెంటనే దూకేయ్.....*  BUT కాదనుకుంటే *జస్ట్ నీ మైండ్ నుంచి జర్నలిజం అనే మాటను తుడిచేయ్.. చెరిపెయ్..*

సో.. బీవేర్ ఫ్రెండ్స్... జర్నలిజంలో చేరాలనుకునేవారికి  ఈ లోకం పోకడ తెలియని, జర్నలిజంలో అ ఆ లు మాత్రమే నేర్చుకున్న సాధాసీదా జర్నలిస్టు చేస్తున్న మొదటి ప్రమాద హెచ్చరిక... *ఇట్స్ జస్ట్ ఫస్ట్ అలెర్ట్... నాట్ ఎన్ అర్డర్..*

*చట్టానికీ* *న్యాయానికి* *ధర్మానికీ తేడా!

ఒక వ్యక్తి నువ్వు అడగ్గానే లక్ష రూపాయలు ఎలాంటి
ప్రామిసరీ నోట్లు, గ్యారంటీలు లేకుండా ఇచ్చి నిన్ను నిలబెట్టాడు.

బాగుపడ్డావు.

ఈలోపు తను దెబ్బతిని చివరకు తనే పోయాడు... ఆయన
భార్యాపిల్లలు బజార్నపడ్డారు...

*ఏ కాగితాలూ లేనందున ఆ డబ్బు తిరిగి చెల్లించాల్సిన*
*అవసరం లేదు*
... *అదీ చట్టం*

*తప్పకుండా ఆ డబ్బు వడ్డీతో సహా చెల్లించాలి*
........ *అదీ న్యాయం*

*డబ్బు, వడ్డీ ఇచ్చి ఆ కుటుంబం నిలదొక్కుకునేదాకా*
*మద్దతుగా నిలబడాలి*
....... *అదీ ధర్మం*

Monday, December 26, 2016

ఒక మంచి విషయం

*ఈ రోజు ఒక మంచి విషయము తెలుసుకున్నాను*

నేను ద్రాక్ష (అంగూర్) పండ్లను కొంటానికి మార్కెట్కు వెళ్ళాను ।

నేను   :    బాబు కిలో ఎంత...?
అతను :  *"కిలో 80 సర్।"*
పక్కనే విడి విడిగా ఉన్న ద్రాక్ష పండ్లను చూసాను.... ।
నేను అడిగాను :  *" మరి వీటి ఖరీదెంత?"*
పండ్లతను : *"30 రూపాయలకు కిలో సర్"*
నేను అడిగా : "ఇంత తక్కువగాన..?
పండ్లతను   :    "సర్, అవి కూడా మంచివే..!!
కాని... *కాని అవి గుత్తి నుండి విడి పోయాయి ...అందుకే అంత తక్కువ రేటు।"*
అప్పుడు నాకు అర్థమైంది... *సమాజము,సంఘము*మరియు *కుటుంబము*నుండి వీడి పోతే .....మన జీవితము కూడా సగానికన్న తక్కువకు పడిపోతుంది।

దయ చేసి మీ *కుటుంబము *సమాజము మరియు *మిత్రులతో*ఎప్పుడు టచ్ లో ఉండండి......

'' సత్యమేవ జయతే''కు అసలైన అర్థం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి.🌼🌻🌺🌴
అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు  
🌹ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు.
"రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె.
మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు.
🌻ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను.
"రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నాడు ఆ దివ్య పురుషుడు.
"సంతోషంగా వెళ్లండి" అని సాగనంపాడు మహారాజు.
🌻అంతలోనే మరొక దేవతామూర్తి బయటికి పోతూ కనబడింది ఆయనకు. "తల్లీ! నువ్వెవ్వరు? ఎందుకు నన్ను వదిలి పోతున్నావు?" అడిగాడు రాజు.
"రాజా! నేను కీర్తికాంతను. ధన సంపత్తీ, దాన సంపదా లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను. నన్ను వెళ్లనివ్వు" అన్నది ఆ దేవతామూర్తి.
"సరేనమ్మా! నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు." అన్నాడు రాజు.

🌼ఇంకొంతసేపటికి మరొక దివ్య మూర్తి బయటి దారి పట్టింది. రాజుగారు అడిగారు "స్వామీ! మీరెవ్వరు?" అని.
"రాజా! నేను శుభాన్ని. సంపదా, దానం, కీర్తీ లేని ఈ రాజ్యంలో నేను ఉండీ ప్రయోజనం లేదు. అందువల్ల నేను వారిని అనుసరించి పోవటమే మంచిది. నన్ను క్షమించి, పోనివ్వు" అన్నాడా దివ్యమూర్తి. రాజుగారు శుభాన్నీ సాగనంపారు.
🌴'ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోనని రాజుగారు విచార పడుతుండగానే మరో దేవతా మూర్తి బయటికి పోతూ కనబడ్డది. "తల్లీ! నువ్వెవ్వరు?" అని అడిగాడు సత్యవ్రతుడు.
"రాజా, నేను '' సత్యలక్ష్మి''ని. ధనలక్ష్మీ, దాన లక్ష్మీ, యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరం ఉండదని, నేనూ పోనెంచాను. నాకూ అనుమతినివ్వు" అన్నది సత్యం.🌼రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి " తల్లీ! నీకు ఆ అవసరం ఏమున్నది? వేరే ఏ సంపదనూ నేను కోరలేదు- వారంతట వారువచ్చారు; వారంతట వారు వెళ్ళారు. కానీ తల్లీ, నేను నీ పూజారిని. సత్యాన్ని కోరి, సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్లటం నీకు భావ్యం కాదు. నన్ను వదిలి వెళ్ళకు!" అన్నాడు.
🌹సత్యం సంతోషపడింది. సరేలెమ్మన్నది. తిరిగి రాజ్యంలోకి వెళ్లిపోయింది.
రాజుగారు నిట్టూర్చారు. సూర్యోదయం కాబోతున్నది. రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి పోబోతున్నారు- అంతలోనే ఒక దివ్యమూర్తి- ఈమారు ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోనికి ప్రవేశిస్తూ కనబడింది; చూడగా, ఆమె ధనలక్ష్మి! "ఏం తల్లీ! మళ్ళీ వస్తున్నావు?" అడిగారు రాజుగారు.
"అవును సత్య వ్రతా! సత్యం లేనిచోట నేనూ ఉండలేను. అందుకే తిరిగి వస్తున్నాను" అన్నది ధనలక్ష్మి.
అంతలోనే దానలక్ష్మీ, ఆపైన యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ ఒకరి తరువాత ఒకరు తిరిగి వచ్చారు రాజ్యానికి.
మళ్లీ రాజ్యం కళకళలాడింది.

ఉపనిషత్తులలోని ఈ కథ, సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తున్నది. అన్ని విషయాల్లోనూ సత్యం ఆచరిస్తూ(నటిస్తూ కాదు) జీవించగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద. ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యమేలుతున్నట్లు, మోసకారి తనమే గెలుస్తున్నట్టు అనిపిస్తుంది కానీ, అంతిమంగా గెలిచేది, నిలిచేది సత్యమే, సందేహం లేదు. సత్యాన్ని జీవితంలోకి ఆహ్వానించి, అడుగడుగునా నిజం చెబుదాం; వాస్తవంగాబ్రతుకుదాం!  .......