tag:blogger.com,1999:blog-50888785546533033552024-03-13T15:27:52.948-07:00Na Hrudhaya SpandhanaTelugu Poetry, jokes, కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.comBlogger255125tag:blogger.com,1999:blog-5088878554653303355.post-88818222453946075782020-09-01T07:10:00.001-07:002020-09-01T07:10:42.410-07:00కోతి ఉపవాసం <div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://lh3.googleusercontent.com/-VGjjSBJ0wG4/X05WXheqiLI/AAAAAAABPqg/7B--fQ_BZFcH7YwvlTeqZE_ixlVvH3zKgCLcBGAsYHQ/s1600/1598969395889436-0.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;">
<img border="0" src="https://lh3.googleusercontent.com/-VGjjSBJ0wG4/X05WXheqiLI/AAAAAAABPqg/7B--fQ_BZFcH7YwvlTeqZE_ixlVvH3zKgCLcBGAsYHQ/s1600/1598969395889436-0.png" width="400">
</a>
</div>* కొతి ఉపవాసం *ఒక కొతి ఉన్నట్టుండి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చోని తాను పండ్ల తోటల మీద దాడి చేసి అనేక మంది రైతులను నష్ట పరచినందుకు పశ్చాత్తాపం కలిగి ఉపవాస ప్రార్థన చేసుకోవాలని ఆశ పడింది.ఉపవాసం మొదలు పెట్టాక దానికో ఆలోచనపుట్టింది. ఒక వేళ ఉపవాసానంతరం కదల్లేనంత నీరసం వస్తేప్రాణాపాయం కదా అని భయ పడి ' నాలుగు రకాల పండ్లు కోసుకొచ్చు కొని దగ్గర పెట్టుకుని ఉపవాసం కొనసాగించిందికాసేపటికి పండు నమల లేనంత నీరసం వస్తే ఎలా ? అని భయ పడి ఓ పండును నోట కరచు కొని ఉపవాసం సాగించింది .దాని పళ్ళు పండును నొక్కుకోవడం వల్ల ఊరిన ఊటను ఆవుకొ లేక ఆ పండును తినేసింది . ఒకటి ఎటూ తిన్నా ను గదా అని సమర్ధిం చుకొని ' మరొక పండును ' ఇంకొక పండును మొత్రం తినేసింది ఉపవాసం అయ్యే పోయింది.పాపం కొందరి ఉపవాసం ... ఉప్మా వాసం ! మామూలు బోజన బిల్లు కంటే పాలు పలహారాల బిల్లే ఎక్కువై పోతుందట !కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-70451402940973403572020-09-01T07:08:00.001-07:002020-09-01T07:08:23.631-07:00మహాలయ పక్షాలు అంటే.... *మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి ?మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.2-9-2020 నుంచి 17.9.2020 వరకు మహాలయ పక్షాలు. భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.*పితృదేవతలకు.... ఆకలా...?*అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.*అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః**యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః*అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి , తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి , శుక్ల కణముగా రూపొంది , స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి , శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే... పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..*తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?*అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమి ? వారి గతి అధోగతేనా ? అంటే కాదు. అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర , సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ , శిక్షల ద్వారా కానీ , ఆత్మహత్యల ద్వారాకానీ , ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు , వరదలు)ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాల వారికి (తండ్రి , తాత , ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు , పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో , పిండప్రదానం ఇచ్చే అర్హత , అధికారం ఉంది. దీనినే *సర్వకారుణ్య తర్పణ విధి* అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి , తద్దినం , పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .... పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు.*మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?*సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ... వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి.క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి , పసుపు , కుంకుమ , గాజులు , పూవులు , చీర , పెట్టి సత్కరించి పంపాలి.చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి.ఇక ప్రమాదాలలో కానీ , ఉరిశిక్ష వల్ల కానీ , ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థినాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://lh3.googleusercontent.com/-PRLTd7lTuu0/X05V0mo_VSI/AAAAAAABPqU/ukCl4dYYAZYTkvYHyjEX3tSLkZ861pQdgCLcBGAsYHQ/s1600/1598969270109863-0.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;">
<img border="0" src="https://lh3.googleusercontent.com/-PRLTd7lTuu0/X05V0mo_VSI/AAAAAAABPqU/ukCl4dYYAZYTkvYHyjEX3tSLkZ861pQdgCLcBGAsYHQ/s1600/1598969270109863-0.png" width="400">
</a>
</div><div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://lh3.googleusercontent.com/-qPDX0hRo_uQ/X05Vtb01CCI/AAAAAAABPqQ/ySUIBuOid5MVs53FpfIfL727R_wubzQTQCLcBGAsYHQ/s1600/1598969256030242-1.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;">
<img border="0" src="https://lh3.googleusercontent.com/-qPDX0hRo_uQ/X05Vtb01CCI/AAAAAAABPqQ/ySUIBuOid5MVs53FpfIfL727R_wubzQTQCLcBGAsYHQ/s1600/1598969256030242-1.png" width="400">
</a>
</div>కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-38744279401952226422020-09-01T07:05:00.001-07:002020-09-01T07:05:30.421-07:00ఎలా చదివినా అవే పదాలుమూడింటిని నిలువుగాను, అడ్డంగాను చదివి చూడండి. ఎట్లా చదివినా అవే పదాలు వస్తున్నాయి చూడండి! ఇలా మీరూ తయారు చేస్తారా మరి? మా పిల్లలకి పంపిస్తాను - మీ రాధ మండువస మ తమ జ్జి గత గ ముకం చ ముచ క్కె రము ర ళిక్షీ ర ముర వ్వ లుము లు కుకా ను పును వ్వు లుపు లు లుకా ర ముర గ డము డ తస మ తమ ర లత ల పుత మ కంమ ర్యా దకం ద కంపొ ల ముల లి తము త కధ న మున వ్య తము త కవ ర సర వి కస క లంహి మ జమ న ముజ ము నక వి తవి న లత ల కకో వె లవె న్నె లల ల నమ న సున య నంసు నం దది న మున గ రిము రి కిటో క రాక వ్వ మురా ము డుచ దు వుదు ర దవు ద కంప్ర వే శంవే ది కశం క రంకావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-10567413489483520202020-09-01T07:03:00.001-07:002020-09-01T07:03:01.165-07:00స్నేహమంటే ఇలా ఉండాలిఒక సెలవు రోజున సరదాగా షికారుకెళ్లిన ఇద్దరు స్నేహితులకు ఏదో విషయంపై మాట తేడా వచ్చింది. వాదన పెరిగింది. దీంతో మొదటి స్నేహితుడు, రెండోవాడ్ని చెంపపై కొట్టాడు. దెబ్బతిన్న స్నేహితుడు అక్కడే వున్న ఇసుకపై "ఈరోజు నా స్నేహితుడు నా చెంపపై కొట్టాడు'"అని రాశాడు. మరికొంత దూరం వెళ్లిన తర్వాత, ఇద్దరికీ దాహం వేసి ఓ మడుగు దగ్గర ఆగారు. చెంప దెబ్బ తిన్న వాడు ముందుగా నీళ్ల లోకి దిగాడు. అక్కడ ఊబి వుండడంతో అందులో కూరుకుపోతుండగా, మొదటి మిత్రుడు తన ప్యాంటు విప్పి, ఊబిలో కూరుకుపోతున్న స్నేహితునికి అందించి బయటికి లాగాడు.ప్రాణాపాయం నుండి బయటపడ్డ రెండో స్నేహితుడు- "ఈరోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు.." అని ఓ బండరాయిపై చెక్కాడు.మొదటి విషయాన్ని ఇసుకపై, రెండోదాన్ని రాతిపై ఎందుకు రాశావని మొదటి మిత్రుడు అడిగాడు. ఇసుక మీద రాసింది గాలి వీస్తే చెరిగిపోతుంది. స్నేహితుల పొరపాట్లు కూడా అలాంటివే. వాటిని మనసులో నిలుపుకోకూడదు. అలాగే... సహాయం చేసినపుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. అందుకే రాయిపై రాశాను. ఈ అక్షరాలు ఎప్పటికీ వుంటాయి అన్నాడట. స్నేహితుల మధ్య వచ్చే తప్పిదాలు ఇసుక మీద రాతల్లాంటివి.ఎవరు తప్పు చేసినా క్షమించి మర్చిపోవాలి. రాతిపై రాసిన రాతలా స్నేహితుడి సహాయాన్ని కలకాలం గుర్తుంచుకోవాలి. అందుకే పెద్దలు అంటారు."ఇచ్చింది మర్చిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం" అని. *స్నేహమనేది ఒకరోజు కాలక్షేపం కాదు... స్వచ్ఛమైన అనుబంధానికి చిరునామా.*కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-9273492172267156412020-09-01T06:52:00.001-07:002020-09-01T06:52:12.907-07:00ఏదో వెలితి <div>చిన్నప్పటి నుంచి <br></div><div>ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న </div><div>స్నేహితులంతా ఓ చోట కలిశారు👩👩👧👧</div><div><br></div><div>అందరికీ వేలల్లో జీతం వస్తోంది ...</div><div>బాగా సెటిల్ అయ్యారు </div><div>కానీ జీవితంలో ఏదో మిస్ అవుతున్నామనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది🧎</div><div><br></div><div>ఇదే విషయం గురించి చర్చించారు...</div><div>కానీ ఏదో మిస్ అవుతున్నామని </div><div>అందరూ ఒప్పుకున్నారు.....!🤔</div><div><br></div><div>మాటల్లో మాటగా ఎవరో చిన్నప్పుడు వాళ్లకు పాఠం చెప్పిన ఓ మాస్టారూని గుర్తుచేశారు😍</div><div><br></div><div>ఆ మాస్టారూ పేరు </div><div>గుర్తుకు రాగానే అందరి మోహాల్లో </div><div>ఒక సంతోషం...!😍</div><div><br></div><div>ఎప్పుడూ సంతోషంగా ఉండే </div><div>ఆ మాస్టారూ అంటే అందరికీ </div><div>ఎంతో ఇష్టం....</div><div>అతనొక స్పూర్తి !</div><div>అంతా ఒక అండస్టాండింగ్కు వచ్చారు...</div><div><br></div><div>ఆ మాస్టారూ ఎప్పుడూ </div><div>అంత ఆనందంగా ఎలా ఉండేవాడో కనుక్కుందామని ఆయన </div><div>దగ్గరకు బయలు దేరారు....!🏃🏿♂️🏃🏿🏃♀️</div><div><br></div><div>ఆ మాస్టారూ దగ్గరకు వెళ్ళి, తామిప్పుడు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారో అందరూ గొప్పగా చెప్పుకున్నారు..!💃🏿🕺</div><div><br></div><div>ఆయన చెప్పిన పాఠాల మూలంగానే </div><div>ఇంత గొప్పవాళ్లమయ్యామని గుర్తుచేశారు...! </div><div><br></div><div>పనిలోపనిగా ఇప్పుడు జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు,</div><div>సవాళ్లను కూడా ఏకరువూ పెట్టారు.🤦🏿♂️</div><div><br></div><div>ఎంతెంతో పెద్ద పెద్ద హోదాలో వున్నా..</div><div>.వేలకు వేల జీతాలు సంపాధిస్తున్నా ఏదో అశాంతికి గురవుతున్నామని చెప్పుకున్నారు.....!🤦🏾</div><div><br></div><div>ఇదంతా విన్న ఆ గురువు </div><div>కాసేపు కూర్చోండని చెప్పి లోపలికెళ్ళాడు.</div><div><br></div><div>కొద్ది సేపటికి గురువుగారి భార్య </div><div>వంటగదిలో నుండి వేడి వేడి టీ ని ఓ కేటిల్లో తీసుకుని వచ్చింది.</div><div><br></div><div>ఓ ప్లేట్లో రకరకాల కప్పులను </div><div>(పింగాణి, స్టీల్, మట్టి, రకరకాల పూలతో ఆకర్షణీయంగా డిజైన్ చేసినవి) తీసుకొచ్చి, వారి ముందుపెట్టి టీ తాగమని చెప్పి లోపలికెళ్ళింది.💁♂️</div><div><br></div><div>వాళ్లంతా మోహమాట పడుతూనే....తమకు నచ్చిన కప్పును తీసుకొని టీ తాగడం మొదలెట్టారు...!💪💪</div><div><br></div><div>వాళ్లంతా టీ తాగడం అయిపోగానే ఆ మాస్టారూ వాళ్లందరిని ఉద్దేశించి..😚</div><div><br></div><div>‘‘మీరంతా గమనించారా...</div><div>టీ మీ ముందుకు రాగానే , ఏ కప్పు తీసుకోవాలని కాసేపు అలోచించి మీరంతా మీకు నచ్చిన కప్పును ఎన్నుకుని టీ తాగారు..ఫలితం... </div><div>ఇక్కడున్న వాటిలో normal కప్పులే మిగిలిపోయాయి....!😩😩😩</div><div><br></div><div>అందరూ *తాగే టీ </div><div>ఒకటేఅయినా... తాగుతూ.. </div><div>ఇతరుల టీ కప్పు, </div><div>దాని డిజైన్ తమ కప్పు కంటే ఎంత బాగున్నాయే అని మధన పడుతూ తాగుతున్నారు ...*</div><div> ఫలితం...తాగే</div><div>* "టీ"ని అస్వాధించడం" మరిచిపోయారు.*.🏃♀️🏃♀️🏃♀️</div><div><br></div><div>అదే సకల సమస్యలకు మూలం....🙏🙏</div><div><br></div><div>ఈ ప్రపంచంలో మనకు ఆకర్షణీయంగా చాలా కనిపిస్తుంటాయి... </div><div>వాటి వెంట పరిగెడితే ఇక అంతే...! 🏃🏿🏃🏿</div><div><br></div><div>*మీరంతా అదే పొరపాటు చేస్తున్నారు...!*</div><div><br></div><div>ఎదుటి వాళ్లు ఎంత సంపాదిస్తున్నారో, </div><div>ఎంత రిచ్గా ఉన్నారో...</div><div>ఏ హోదాలో ఉన్నారో, </div><div>ఏం కొంటున్నారో </div><div>అని పొల్చుకొని...</div><div>మధన పడుతూ...</div><div>వాళ్లలా ఉండటానికి ప్రయత్నిస్తూ </div><div>మీ ఇష్టాఇష్టాలను, </div><div>మీ అభిరుచులను </div><div>అన్నీ అన్నీ మర్చిపోతున్నారు...</div><div><br></div><div>మీ జీవితం టీ అయితే.....</div><div>మీ ఉద్యోగం, డబ్బు, పరపతి అన్నీ కూడా </div><div>టీ కప్పులాంటివి...no limit for them.</div><div><br></div><div>కప్పు మీ జీవితాన్ని శాసించనీయకండి...కప్పులోని టీ ని ఆస్వాధించటం నేర్చుకొండి. అప్పుడే "ఆనందంగా" ఉంటారు.</div><div><br></div><div> అదే జీవిత సత్యం...</div>కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-10395842316058404512016-12-28T08:39:00.001-08:002016-12-28T08:39:05.737-08:00ఇవి చదవండి <p dir="ltr">1. జీవితంలో ఎప్పుడైనా <br>
ఎవరి నైనా పనికి రాని వారిగా <br>
పరిగణించవద్దు ఎందుకంటే <br>
చెడిపోయిన గడియారం<br>
కూడ రోజుకు రెండు సార్లు<br>
సరైన సమయం<br>
సూచిస్తుంది</p>
<p dir="ltr">2. ఎప్పుడూ ఇతరుల తప్పులను<br>
అన్వేషించే వ్యక్తి అందమైన<br>
పుష్పాల పరిమళాలను<br>
వదలి పుండు మీద వాలే<br>
ఈగ లాంటి వాడు</p>
<p dir="ltr">3. పేదరికం ధరిచేరినప్పుడు <br>
ఆప్తమిత్రులు కూడ<br>
దూరమైతారు అదే<br>
ధనవంతులైనప్పుడు<br>
తెలియని వారు కూడ<br>
మిత్రులవుతారు</p>
<p dir="ltr">4. ఒక్క సారి నవ్వుతూ చూడు<br>
ప్రపంచంలో ఉండే అందాలన్ని<br>
నీ సొంతమవ్వుతాయి కానీ<br>
తడిసిన కనురెప్పలతో<br>
చూసే అద్దంకూడ మసక<br>
బారి పోతుంది </p>
<p dir="ltr">5. తొందరగా దొరికేది ఏదైనా<br>
ఎక్కువకాలం మన్నికరాదు<br>
ఎక్కువకాలం మన్నిక<br>
వచ్చేది అంతతొందరగా<br>
దొరకదు</p>
<p dir="ltr">6. జీవితంలో వచ్చే చెడు రోజులు<br>
కూడా మన మంచి కొరకే<br>
అనుకోవాలి అప్పుడే<br>
తెలుస్తుంది నిజమైన<br>
స్నేహితులు ఎవరైనది</p>
<p dir="ltr">7. మనిషికి రోగాలు కుందేలు లాగా<br>
వస్తాయి తాబేలు లాగా<br>
వెళ్లుతాయి కానీ డబ్బులు<br>
తాబేలు లాగ వస్తాయి <br>
కుందేలు లాగా<br>
వెళ్లుతాయి </p>
<p dir="ltr">8. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని <br>
వెతకటం అలవాటు <br>
చేసుకోవాలి ఎందుకంటే<br>
పెద్ద పెద్ద మాటలు<br>
జీవితంలో చాలా <br>
అరుదుగా చోటు<br>
చేసుకుంటాయి</p>
<p dir="ltr">9. ఈశ్వరుని ప్రార్ధించినప్పుడు<br>
నాకు ఏమి ఇవ్వలేదని<br>
బాధపడకు ఎందుకంటే <br>
నీకు అక్కడ ఇవ్వక<br>
పోయినా నీకు నచ్చిన<br>
చోట నీకు ఈశ్వరుడు <br>
నచ్చినవిధంగా ఇస్తాడు</p>
<p dir="ltr">10. నిత్యము ఎదురయ్యే <br>
అపజయాలను చూసి<br>
నిరాశ చెందకు కానీ <br>
ఒక్కోసారి తాళంచెవి<br>
గుచ్చంలో ఉండే ఆఖరి<br>
తాళంచెవి కూడ తాళం <br>
తెరుస్తుందని<br>
గమనించు</p>
<p dir="ltr">11. ఈ సమాజంలో నేను ఒక్కడిని<br>
ఎంచేయగలననీ ప్రతి మనిషి <br>
నిరాశ చెందుతుంటాడు<br>
కానీ ఒక్క సారి తలపైకెత్తి<br>
చూడు ప్రపంచానికి<br>
వెలుగునిచ్చే సూర్యుడు<br>
కూడ ఒక్కడేనని </p>
<p dir="ltr">12. బంధవులు ఎంత చెడ్డ వారైనా<br>
సరే వదులుకోవద్దు<br>
ఎందుకంటే మురికి నీరు <br>
దప్పిక తీర్చలేక పోయిన<br>
కనీసం అగ్గి మంటలు <br>
ఆర్పటానికి పనికి <br>
వస్తాయి </p>
<p dir="ltr">13. నమ్మక ద్రోహి స్నేహితునికన్నా<br>
దురాశపరుడు సన్నిహితుడు<br>
మిన్న మట్టితో చేసిన <br>
మనుషులు కాగితాలకు<br>
అమ్ముడు పోతారు</p>
<p dir="ltr">14. మనిషి గా మాట్లాడుట<br>
రాక పోయినా కనీసం<br>
పశువుల మౌనంగా <br>
ఉండటమే ఉత్తమం</p>
<p dir="ltr">15. మనకు మాటలు రాక ముందు <br>
మనముఎంచెప్పబోతున్నామో<br>
అమ్మకు అర్థమయ్యేది కాని<br>
మనము మాటలు అన్ని<br>
నేర్చిన తరువాత ఇప్పుడు<br>
మాటమాటకు ప్రతిసారి<br>
అమ్మా నీకు అర్థం<br>
కాదులే అంటాం</p>
<p dir="ltr">16. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు <br>
దూరమైనారని బాధపడకు<br>
ఎందుకంటే నీవు ఒక్కనివే<br>
జయించగలవని వారు<br>
నమ్మినందుకు నీవు <br>
సంతోషించు </p>
<p dir="ltr">17. సిగ్గు మర్యాద లేని <br>
ధనవంతు కన్నా<br>
మంచి మానవత్వం ఉన్న <br>
పేదరికం మిన్న</p>
<p dir="ltr">18. జీవితంలో హెచ్చుతగ్గులు<br>
రావటంకూడ మనమంచి<br>
కోసమే అనుకోవాలి<br>
ఎందుకంటే ECG లొ <br>
వచ్చే సరళరేఖా కూడ<br>
మృత్యువును<br>
సూచిస్తుంది</p>
<p dir="ltr">19. ఈ రోజుల్లో సంబంధాలు<br>
రొట్టె తొ సమానమైనవి<br>
ఎందుకంటే కొద్దిగా మంట<br>
ఎక్కవైందొలెదో రొట్టె <br>
మాడిమసి కావటం<br>
ఖాయం</p>
<p dir="ltr">20. జీవితంలో మంచి వారి కోసం అన్వేషించ వద్దు ముందు నీవు మంచిగా మారు బహుశా నిన్ను కలిసిన వ్యక్తికి మంచి మనిషి అన్వేషణ పూర్తి <br>
కావచ్చు నేమో🙏</p>
కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-52929566595286532752016-12-27T18:29:00.001-08:002016-12-27T18:29:48.536-08:00రైతులకు భరోసా నిధి ఎందుకు లేదు <p dir="ltr">✍🏻 *రైతుల భరోసా నిధి ఎందుకు లేదు ?.విపత్తులకు నష్ట పరిహారం అందక ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగుతున్న రైతన్న ప్రభుత్వాలు మారినా మారని రైతుల దుస్థితి*<br>
✍🏻భారత దేశం రైతు బాంధవ దేశం <br>
*జై కిసాన్ అని* అన్నారు. వరదలు తుఫానులు, నకిలీ విత్తనాలు, డేట్ అయ్యిన ఎరువులు, పురుగు మందులు, సొకిన వైరస్ లు ,అధిక వ్యయం,సరైన మద్దతు ధర లేక ,గిట్టు బాటు ధర లేక చేసిన అప్పులు తీర్చ లేక పిల్లల్ని చదివించలేక పెళ్లిళ్లు చేయలేక ఏడాదికి సుమారు 20 వేల చని పోతున్నారు. <br>
✍🏻ప్రాధమిక రంగం అని 70%మంది ప్రజలు వ్యవసాయం మీదే ఆధార పడినా దానికి ఒక ప్రత్యేక బడ్జెట్ లేక పోవడం పాలకుల చేతగాని తనమే .<br>
✍🏻విదేశాలలో ఏ రంగం అభివృద్ధి చెందుతుందో దానికి మరిన్ని రాయితీలు యిచ్చి ముందుకు నడిపిస్తారు.కానీ దేశం రవాణా ,ఆదాయం ,కార్మికులు,రాబడి, తిండి అన్ని ఒకే రంగం మీద ఉన్నా నిధులు సూన్యం<br>
✍🏻మన రాష్ట్రము లో 5సంవత్సరములలో హెలిన్ ,ఫైలిన్ ,నీలం ,హుద్ హుద్, కెంప్ లాంటి బారి తుపాన్ లు వచ్చినా కేంద్ర సహాయం అని కూర్చున్నాము తప్ప రైతుకు ఇచ్చింది సూన్యం రికార్డ్స్ లో ఇస్తున్నాము అని ప్రచారం .<br>
✍🏻సెపరేట్ బడ్జెట్ పెట్టి నిధులు ఎందుకు ఇవ్వడం లేదు. ఆర్ధిక బడ్జెట్ కాకుండా రైతు భరోసా నిధి అని కేంద్ర ఆగంతుక నిధిని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు.<br>
✍🏻విపత్తు నిర్వహణ అధికారులు రైతు పేరిట చేతి వాటం చూపించి కోట్లు సంపాదించారు.ఇప్పటికి నష్ట పరిహారం అందక తుపాను బాధితులు ఉన్నారు రికార్డ్స్ లో ఇచ్చామని బాధితుల సొమ్ము తిన్నారు.<br>
✍🏻రైతు భరోసా నిధి ఏర్పాటు చేయాలి ప్రత్యేక బడ్జెట్ ఉండాలి. నష్ట అంచనా అనుభవం ఉన్న టీం చేత చేయించాలి.<br>
✍🏻నష్ట నివారణ చేసిన్నప్పుడు అధికార బలం చూపి దొంగ లెక్కలు చూపించే అధికారుల్ని తొలగించాలి.<br>
✍🏻నష్ట పరిహారం రైతు అకౌంట్స్ లోకి మాత్రమే జమ చేయాలి.అనుభవం ఉన్న వ్యవసాయ నిపుణులు చేత అంత రించి పోతున్న వైరస్ సోకుతున్న పంటలకు మార్గదర్శికాలు వెతకాలి .<br>
✍🏻నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మితే చట్టం చేసి కఠినంగా శిక్షించాలి. గవెర్నమెంట్ అనుబంధ సంస్థల్లో మాత్రమే అమ్మే ఏర్పాటు చేయాలి. దీని వలన ఉద్యోగాల సృష్టి జరిగి ఉపాధి పెరుగుతుంది<br>
✍🏻గిట్టు బాటు ధర మద్దతు ధర పంట వేయక ముందే ప్రకటించి ,ప్రతి మండలానికి ఓక రైతుమార్కెట్స్ పెట్టి షెడ్లు నిర్మించాలి.<br>
✍🏻వరదలు సంభవించే నది పరివాహక ప్రాంతాల్లో ఆయకట్లు బలం గా తయారు చేయాలి. నివారణ కొరకు మాoగ్రు పంటలు ఏర్పాటు చేయాలి.<br>
✍🏻రైతు ఆత్మహత్యలు నివారించి నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. <br>
✍🏻ఆదునిక ప్రపంపంచం లో ఇప్పటికైనా రైతుని అడుకోకపోతే పంటలు కొరత వచ్చి పండించే నాధుడే లేకుండా పోతాడు.<br>
✍🏻విపత్తులు వచ్చినప్పుడు కంటి తుడుపు చర్యలు చేసి చేతులు దులుపుకుని మీడియా ముందు సొల్లు చెప్పి *అబద్ధపు హామీలు ఇచ్చి*రైతు నడ్డివిరిచే నాయకులకు తగిన శాస్తి తప్పదు<br>
</p>
కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-76115418266556400482016-12-27T18:28:00.001-08:002016-12-27T18:28:05.724-08:00తులసి - దురదగుంట చెట్లు <p dir="ltr">ఆడవారు తులసి చెట్టు వంటివారు.😍 </p>
<p dir="ltr">మగవారు దురదగుంట చెట్టు వంటివారు.😏 </p>
<p dir="ltr">చాలా బాగా చెప్పారు బీర్బల్ గారు....</p>
<p dir="ltr">మా విలువ తెలుసుకోండయా!!??</p>
<p dir="ltr">బీర్బల్ కౌంటర్ కేక 😎</p>
<p dir="ltr">"బీర్బల్ ... దర్బారుకు ఆలస్యంగా ఎందుకు వచ్చావు?"<br>
"ఆలంపనాహ్... జహా పనాహ్.... ఈ రోజు మా తులసీ మాత పూజ ప్రభూ....!! అమ్మకి పూజచేయడంలో ఆలస్యం అయిపోయింది."<br>
అక్బర్ కి నవ్వొచ్చింది. <br>
"తులసి... మాత....హ హ హ హ ... ఈ చిన్న మొక్క మీకు తల్లా?" అంటూ వికటాట్టహాసం చేశాడు. <br>
"ఎవరక్కడ... ఒక తులసి చెట్టును తెప్పించండి"<br>
పాదుషా తలచుకుంటే మొక్కలకు కొదవా? <br>
సభలో అందరి ముందే తులసి మొక్కను చింపి పోగులు పోశాడు అక్బర్.<br>
"చూశావా... నీ మాతను ఏం చేశానో..."<br>
బీర్బల్ ఏమీ అనలేదు. "చిత్తం జహాపనాహ్" అన్నాడు. <br>
మరుసటి రోజూ బీర్బల్ ఆలస్యంగా వచ్చాడు.<br>
"ఈ రోజేమిటి బీర్బల్... మళ్లీ ఎందుకాలస్యం?" <br>
"ప్రభూ నిన్న మా తల్లిగారి పూజ అయింది. ఇవాళ్ల తండ్రిగారి పూజ ప్రభూ..."<br>
"మీ తండ్రి కూడా ఒక మొక్కేనా..."<br>
"అవును ప్రభూ...."<br>
"ఆ మొక్కని తీసుకురండి" <br>
ఆ మొక్కని దర్బారులో పెట్టారు. <br>
అక్బర్ "మీ అమ్మ పని పట్టాను. ఇక మీ అబ్బ పని పడ్తాను చూసుకో..." అంటూ ఆ మొక్కను చింపి పోగులు పోశాడు. <br>
కాసేపటికి అక్బర్ కి దురద మొదలైంది. ముందు మర్యాదగా కనీ కనిపించనట్టు గోక్కున్నాడు.<br>
తరువాత బరబరా గోక్కున్నాడు. బట్టలువిప్పి మరీ నేలపై పొర్లుతూ గోక్కోవడం మొదలుపెట్టడు. <br>
"అమ్మోయ్... బాబోయ్... నాకేమైంది బీర్బల్ ...." అంటూ గావుకేకలు పెట్టాడు.<br>
బీర్బల్ నెమ్మదిగా, తెచ్చిపెట్టుకున్న వినయంతో "జహాపనాహ్... మా తల్లి శాంత స్వభావురాలు. ఏమీచేయదు. కానీ మా తండ్రి అలాంటివాడు కాదు. ఆయనకు ముక్కుమీదే కోపం."<br>
"ఎవరయ్యా ఈ తండ్రి... బాధ భరించలేకపోతున్నాను."<br>
"ప్రభూ... తులసి మాకు తల్లి. దూలగొండి మాకు తండ్రి. దూలగొండిని కెలుక్కున్నారు మరి...." అన్నాడు బీర్బల్.<br>
"ఏం చేయాలయ్యా... ఎలా తగ్గుతుందయ్యా ఈ దురద....?" అక్బర్ గారు నేలమీద పడి దొర్లుతున్నాడు. <br>
"ప్రభూ దీనికి ఒకటే మార్గం. మా తండ్రి గారి కోపాన్ని మా తల్లి మాత్రమే శాంతింపచేయగలదు. కాబట్టి ఆమెకు మొక్కండి. తులసి ఆకుల రసాన్ని పూసుకొండి. దురద తగ్గుతుంది." అన్నాడు బీర్బల్.<br>
అక్బర్ ఓ చేత్తో గోక్కుంటూనే రెండో చేత్తో తులసమ్మకు దణ్ణం పెట్టాడు.<br></p>
కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-55789708912273516082016-12-27T18:12:00.001-08:002016-12-27T18:12:39.889-08:00Shivaji statue technical highlights <p dir="ltr">This is a public information service message...Share it with everyone.!!!</p>
<p dir="ltr">Many are cribbing about the cost of the *Shivaji statue* <br>
What they do not know is this statue is a masterstroke by our PM Modiwhich will pay for itself many times over.</p>
<p dir="ltr">The statue is made of Amorphous Silicon, Cadmium Telluride & Copper Indium Gallium Selenide. This is exactly the same material used to make solar cells. Our government consulted with Dr. Immonen Kirsi, Senior Solar Scientist at<br>
VTT Research, Finland to develop technology to mould these materials into a statue form. This research took 2.5 years & on December 3rd, Dr. Kirsi sent a private email to Modi Sir that it's now ready for mainstream use. The statue will generate enough electricity to power all government offices in Mumbai.</p>
<p dir="ltr">The statue also has Radial Uniform Projection And Ranging(RUPAR) technology to track boats in the Arabian Sea to prevent a repeat of the 2008 Mumbai attack where the terrorists entered India through the sea. RUPAR is the next generation of SONAR technology and has been developed at the Indian Institute of Science. <br></p>
<p dir="ltr">Congratulations to all Scientists...</p>
కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-57895890024392402452016-12-27T09:48:00.001-08:002016-12-27T09:48:57.223-08:00*'ఓం'తో అలసట మాయం..శాస్త్రీయంగా నిరూపించిన బాలిక*<p dir="ltr">ఓం శబ్దంతో శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలుగేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది. పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్‌లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్తలను అకట్టుకుంది. కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది. </p>
<p dir="ltr">ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్‌పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది. అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు. </p>
<p dir="ltr">అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన:పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి...ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియజేసింది. అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది. </p>
<p dir="ltr">గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు. కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని అన్వేష నిరూపించిందని ఆయన తెలిపారు. </p>
<p dir="ltr">ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు. ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్‌షాప్‌నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు. వర్క్‌షాప్‌లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్‌లో పర్యటించినపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్‌కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది. </p>
<p dir="ltr">అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది. దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది. దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది. ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌన:పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది. </p>
<p dir="ltr">17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది. ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష తెలిపింది. </p>
కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-60040578158904160292016-12-27T09:43:00.001-08:002016-12-27T09:43:01.921-08:00*జర్నలిజం ఓ సాలేగూడు.. అందులో చిక్కుకుంటే...*<p dir="ltr">*(జర్నలిజంలో చేరాలనుకునేవారికి... మొదటి ప్రమాద హెచ్చరిక..)*</p>
<p dir="ltr">జర్నలిజం దేశాన్నేం ఉద్దరించదు. <br>
*జర్నలిస్టులేం సంఘ సంస్కర్తలు కాదు.. నిజాలు రాసే కలాలు మాత్రమే...* జర్నలిస్టులు కూడా సాధారణ మానవులే.. వారు మానవతీత శక్తులేమీ కాదు... <br>
ప్రజల గోడు వినే యాజమాన్యాలు..  ఎప్పుడో చరిత్రలో కలిసిపోయాయి..<br>
ఇప్పుడంతా బిబినెస్.. సెటిల్మెంట్.. కులాల మీద నడిసేవే.. <br>
*జర్నలిస్ట్ అనేవాడు జస్ట్ పెయిడ్ వర్కింగ్ టూల్..* ఉపయోగపడినంత కాలం ఉపయోగపడుతుంది.. దాని పనైపోయాక పక్కకు పడేస్తాం.. అలాగే <br>
వాళ్ల పనైపోయినా.. మనతో వాళ్లు పనైపోయినా.. <br>
జస్ట్ .. గెట్ ఔట్ అంటారంతే... దయచేసి దొబ్బేయండి అంటారంతే.... (కొన్ని చోట్ల మరీ ఇంత మర్యాదగా చెప్పరులేండి)....  </p>
<p dir="ltr">సో.. ఓ ఆవేశపడిపోయి.. <br>
ప్రపంచాన్ని మార్చేద్దామన్న పిచ్చి ఆలోచనలు ఉంటే మరోసారి ఆలోచించండి...  <br>
అదో ఉద్యోగం.. నువ్వు ముందు నీకోసం, నీ కుంటుంబం కోసం కష్టపడుతున్నావ్.. అంతే.. <br>
నీకు జీతం కావాలి.. వాడికి చెప్పింది చేసే పనోడు కావాలి...<br>
ఇది మైండ్లో పెట్టుకోండి.. <br>
మరే చిన్న ప్రత్యామ్నాయమున్నా.. జర్నలిజం ఆప్షన్ ను జస్ట్ డిలీట్ చేయండి.</p>
<p dir="ltr">ఎందుకంటే.... ఇది సినిమా రంగాన్ని మించిన సాలేగూడు... ఒక్కసారి చిక్కుకుంటే... <br>
గింజుకుచావాల్సిందే... లేదా నువ్వూ సాలీడుగా మారాల్సిందే. అసలు జర్నలిజంలోనే 24X7 అని ఉంటుంది... అంటే 24 గంటలలో నువ్వు పనిచేయాల్సి ఉండొచ్చు... ఎప్పుడు ఏం అవసరమొస్తుందో తెలియదు... మీరేమి ప్లాన్ చేసుకుందామనుకున్నా... ప్లాన్ చేసుకున్నా... ప్లాప్ అవ్వొచ్చు... అన్నీ మీరనుకున్నట్లు జరగవు.... యంగ్ జర్నలిస్టులు,  ట్రైనీలు, జూనియర్ జర్నలిస్టులు ఐతే .. చెప్పనవసరం లేదు....  సీనియర్ జర్నలిస్టులకైతే కొంత వెసులుబాటు వారి అనుభవం రావొచ్చు.. దేశంలో కొన్ని సర్వేలు జర్నలిజం గురించి ఏమి చెప్పాయో.. సీనియర్ జర్నలిస్టలను అడిగితే చెబుతారు.. *కొన్నిచోట్ల జర్నలిస్టులకు పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి కూడా భయపడతారట...* అవును మరి యంగ్ జర్నలిస్టుగా జాయిన్ అయ్యేటప్పుడు నువ్వేకడివే.. ఆ తర్వాత.. ఆ పైన.. ఒకటి రెండు అవుతుంది.. రెండు మూడు అవుతుంది.. అప్పుడు నీలో మొదట్లో ఉండే ‘ఫైర్’ ఉండదు.. ఆవేశం, పొగరు ఉండదు, బరితెగింపు ఉండదు.. ఎందుకంటే నీ మీద ఆధారపడి కుంటుంబం ఉందన్న విషయం గుర్తురావొచ్చు.. అప్పుడు ఏంచేద్దామా అని వెనక్కి తిరిగి ఆలోచిస్తే చేయడానికీ ఏమీ ఉండదు... అందుకే ఇప్పుడే ఆలోచించుకో.. ఇది అందరికీ వర్తించకపోవచ్చును.. కొందరికి పెద్దల సపోర్ట్ ఉండోచ్చు, ఆదృష్టం ఉండొచ్చు.. యాజమాన్యం అండదండలు ఉండొచ్చు.. ఆఖరికి కులం పేరుతో కూడా నీకు అండ, దండ ఉండోచ్చు.. అదే నీకు వ్యతిరేకం కావొచ్చును... ఇవన్నీ ఆలో’చించి‘తే నువ్వు ఏమీ చేయలేవనిపిస్తోంది... ఆలోచించకుండా పోతే ఏమైనా ఆద్బుతాలు కూడా చేయచ్చు.. లేదు *ఎన్ని బంధాలు, బంధనాలు ఏర్పడినా నాలో ఫైర్ తగ్గదు అని నీకు కాన్ఫిడెంట్ ఉంటే వెంటనే దూకేయ్.....*  BUT కాదనుకుంటే *జస్ట్ నీ మైండ్ నుంచి జర్నలిజం అనే మాటను తుడిచేయ్.. చెరిపెయ్..*</p>
<p dir="ltr">సో.. బీవేర్ ఫ్రెండ్స్... జర్నలిజంలో చేరాలనుకునేవారికి  ఈ లోకం పోకడ తెలియని, జర్నలిజంలో అ ఆ లు మాత్రమే నేర్చుకున్న సాధాసీదా జర్నలిస్టు చేస్తున్న మొదటి ప్రమాద హెచ్చరిక... *ఇట్స్ జస్ట్ ఫస్ట్ అలెర్ట్... నాట్ ఎన్ అర్డర్..*</p>
కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-28771582099296667652016-12-27T09:14:00.001-08:002016-12-27T09:14:12.320-08:00 *చట్టానికీ* *న్యాయానికి*
*ధర్మానికీ తేడా!<p dir="ltr">ఒక వ్యక్తి నువ్వు అడగ్గానే లక్ష రూపాయలు ఎలాంటి<br>
ప్రామిసరీ నోట్లు, గ్యారంటీలు లేకుండా ఇచ్చి నిన్ను నిలబెట్టాడు.</p>
<p dir="ltr">బాగుపడ్డావు.</p>
<p dir="ltr">ఈలోపు తను దెబ్బతిని చివరకు తనే పోయాడు... ఆయన<br>
భార్యాపిల్లలు బజార్నపడ్డారు...</p>
<p dir="ltr">*ఏ కాగితాలూ లేనందున ఆ డబ్బు తిరిగి చెల్లించాల్సిన*<br>
*అవసరం లేదు*<br>
... *అదీ చట్టం*</p>
<p dir="ltr">*తప్పకుండా ఆ డబ్బు వడ్డీతో సహా చెల్లించాలి*<br>
........ *అదీ న్యాయం*</p>
<p dir="ltr">*డబ్బు, వడ్డీ ఇచ్చి ఆ కుటుంబం నిలదొక్కుకునేదాకా*<br>
*మద్దతుగా నిలబడాలి*<br>
....... *అదీ ధర్మం*</p>
కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-81679272829727342032016-12-26T09:33:00.001-08:002016-12-26T09:33:55.676-08:00ఒక మంచి విషయం <p dir="ltr">*ఈ రోజు ఒక మంచి విషయము తెలుసుకున్నాను*</p>
<p dir="ltr">నేను ద్రాక్ష (అంగూర్) పండ్లను కొంటానికి మార్కెట్కు వెళ్ళాను ।</p>
<p dir="ltr">నేను : బాబు కిలో ఎంత...?<br>
అతను : *"కిలో 80 సర్।"*<br>
పక్కనే విడి విడిగా ఉన్న ద్రాక్ష పండ్లను చూసాను.... ।<br>
నేను అడిగాను : *" మరి వీటి ఖరీదెంత?"*<br>
పండ్లతను : *"30 రూపాయలకు కిలో సర్"*<br>
నేను అడిగా : "ఇంత తక్కువగాన..? <br>
పండ్లతను : "సర్, అవి కూడా మంచివే..!! <br>
కాని... *కాని అవి గుత్తి నుండి విడి పోయాయి ...అందుకే అంత తక్కువ రేటు।"*<br>
అప్పుడు నాకు అర్థమైంది... *సమాజము,సంఘము*మరియు *కుటుంబము*నుండి వీడి పోతే .....మన జీవితము కూడా సగానికన్న తక్కువకు పడిపోతుంది।</p>
<p dir="ltr">దయ చేసి మీ *కుటుంబము *సమాజము మరియు *మిత్రులతో*ఎప్పుడు టచ్ లో ఉండండి......</p>
కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-80289632556141724792016-12-26T09:32:00.001-08:002016-12-26T09:32:17.450-08:00'' సత్యమేవ జయతే''కు అసలైన అర్థం<p dir="ltr">🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹<br>
కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి.🌼🌻🌺🌴<br>
అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు   <br>
🌹ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు.<br>
"రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె.<br>
మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు.<br>
🌻ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను.<br>
"రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నాడు ఆ దివ్య పురుషుడు.<br>
"సంతోషంగా వెళ్లండి" అని సాగనంపాడు మహారాజు.<br>
🌻అంతలోనే మరొక దేవతామూర్తి బయటికి పోతూ కనబడింది ఆయనకు. "తల్లీ! నువ్వెవ్వరు? ఎందుకు నన్ను వదిలి పోతున్నావు?" అడిగాడు రాజు.<br>
"రాజా! నేను కీర్తికాంతను. ధన సంపత్తీ, దాన సంపదా లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను. నన్ను వెళ్లనివ్వు" అన్నది ఆ దేవతామూర్తి.<br>
"సరేనమ్మా! నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు." అన్నాడు రాజు.</p>
<p dir="ltr">🌼ఇంకొంతసేపటికి మరొక దివ్య మూర్తి బయటి దారి పట్టింది. రాజుగారు అడిగారు "స్వామీ! మీరెవ్వరు?" అని.<br>
"రాజా! నేను శుభాన్ని. సంపదా, దానం, కీర్తీ లేని ఈ రాజ్యంలో నేను ఉండీ ప్రయోజనం లేదు. అందువల్ల నేను వారిని అనుసరించి పోవటమే మంచిది. నన్ను క్షమించి, పోనివ్వు" అన్నాడా దివ్యమూర్తి. రాజుగారు శుభాన్నీ సాగనంపారు.<br>
🌴'ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోనని రాజుగారు విచార పడుతుండగానే మరో దేవతా మూర్తి బయటికి పోతూ కనబడ్డది. "తల్లీ! నువ్వెవ్వరు?" అని అడిగాడు సత్యవ్రతుడు.<br>
"రాజా, నేను '' సత్యలక్ష్మి''ని. ధనలక్ష్మీ, దాన లక్ష్మీ, యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరం ఉండదని, నేనూ పోనెంచాను. నాకూ అనుమతినివ్వు" అన్నది సత్యం.🌼రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి " తల్లీ! నీకు ఆ అవసరం ఏమున్నది? వేరే ఏ సంపదనూ నేను కోరలేదు- వారంతట వారువచ్చారు; వారంతట వారు వెళ్ళారు. కానీ తల్లీ, నేను నీ పూజారిని. సత్యాన్ని కోరి, సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్లటం నీకు భావ్యం కాదు. నన్ను వదిలి వెళ్ళకు!" అన్నాడు.<br>
🌹సత్యం సంతోషపడింది. సరేలెమ్మన్నది. తిరిగి రాజ్యంలోకి వెళ్లిపోయింది.<br>
రాజుగారు నిట్టూర్చారు. సూర్యోదయం కాబోతున్నది. రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి పోబోతున్నారు- అంతలోనే ఒక దివ్యమూర్తి- ఈమారు ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోనికి ప్రవేశిస్తూ కనబడింది; చూడగా, ఆమె ధనలక్ష్మి! "ఏం తల్లీ! మళ్ళీ వస్తున్నావు?" అడిగారు రాజుగారు.<br>
"అవును సత్య వ్రతా! సత్యం లేనిచోట నేనూ ఉండలేను. అందుకే తిరిగి వస్తున్నాను" అన్నది ధనలక్ష్మి.<br>
అంతలోనే దానలక్ష్మీ, ఆపైన యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ ఒకరి తరువాత ఒకరు తిరిగి వచ్చారు రాజ్యానికి.<br>
మళ్లీ రాజ్యం కళకళలాడింది.</p>
<p dir="ltr">ఉపనిషత్తులలోని ఈ కథ, సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తున్నది. అన్ని విషయాల్లోనూ సత్యం ఆచరిస్తూ(నటిస్తూ కాదు) జీవించగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద. ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యమేలుతున్నట్లు, మోసకారి తనమే గెలుస్తున్నట్టు అనిపిస్తుంది కానీ, అంతిమంగా గెలిచేది, నిలిచేది సత్యమే, సందేహం లేదు. సత్యాన్ని జీవితంలోకి ఆహ్వానించి, అడుగడుగునా నిజం చెబుదాం; వాస్తవంగాబ్రతుకుదాం!  ....... </p>
కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-31416140619611210102016-12-22T09:43:00.001-08:002016-12-22T09:43:30.062-08:00ఇసుక రాయి స్నేహం <p dir="ltr">ఇద్దరు స్నేహితులు ఒక ఎడారి గుండా ప్రయాణిస్తున్నారు. మాటల మధ్యలో ఒక వాదన వచ్చింది. అది పెరిగి క్రమంగా పెద్దదై ఆవేశానికి లోనై ఒక స్నేహితుడు రెండో స్నేహితుణ్ణి చెంప మీద కొట్టాడు. దెబ్బతిన్న మిత్రునికి చాలా బాధ కలిగింది. కానీ అతను తిరిగి ఏమీ మాట్లాడలేదు. కిందకు వంగి ఇసుకలో ఇలా రాశాడు.</p>
<p dir="ltr">“ఈ రోజు నా ప్రియ మిత్రుడు నన్ను చెంప పై కొట్టాడు”</p>
<p dir="ltr">అలా ఇద్దరూ నడుస్తూ ఒక ఒయాసిస్సు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ స్నానం చేసి సేద తీరాలనుకున్నారు. దెబ్బతిన్న స్నేహితుడు ప్రమాదవశాత్తూ ఒక ఊబిలో ఇరుక్కుపోయాడు. కానీ సమయానికి మిత్రుడు వచ్చి సహాయం చేయడంతో బ్రతికి బయటపడ్డాడు. మళ్ళీ ఏమీ మాట్లాడకుండా చిన్నగా ఒక రాయి దగ్గరికి వెళ్ళి మరో రాయితో దానిమీద ఇలా లిఖించాడు.</p>
<p dir="ltr">“ఈ రోజు నా ప్రియ మిత్రుడు నా ప్రాణాన్ని కాపాడాడు”</p>
<p dir="ltr">కాపాడిన మిత్రుడు అతన్ని ఇలా అడిగాడు. “నేను నిన్ను కొట్టినపుడు నువ్వు ఆ సంగతి ఇసుకలో రాశావు. కానీ నేను నిన్న కాపాడిన సంగతి మాత్రం రాతిమీద రాశావు. ఎందుకలా చేశావు?”</p>
<p dir="ltr">దానికి అతను ఇలా సమాధానమిచ్చాడు “మనల్ని ఎవరినైనా బాధించినపుడు దాన్ని ఇసుక పై రాత లాగా తాత్కాలిక జ్ఞాపకంగా ఉంచుకోవాలి. ఎందుకంటే క్షమ అనే గాలులు వచ్చినపుడు అవి చెరిగి పోతాయి. అలాగే మనకు ఎవరైనా సహాయం చేసినపుడు దాన్ని రాయి లాంటి జ్ఞాపిక మీద భద్రపరుచుకోవాలి ఎందుకంటే ఏ గాలులూ దాన్ని చెరపలేవు”</p>
<p dir="ltr">కాబట్టి ప్రియమిత్రులారా! ఇది మీ జీవితానికి అన్వయించుకుని సంతోషమయం చేసుకుంటారని ఆకాంక్షిస్తున్నాను.</p>
కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-6552835732739679322016-12-22T09:39:00.001-08:002016-12-22T09:39:39.201-08:00డబ్బు మనుషుల్ని ఎంత పాడు చేస్తుందో<p dir="ltr">ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో రొప్పుతూ వస్తూ కనిపించాడు. వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి "ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నారు?" అని అడిగారు. అందుకాయన... "అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది." వాళ్ళిద్దరూ భయంతో… "అంటే అక్కడ పులి ఉందా?" అని అడిగారు.</p>
<p dir="ltr">"కాదు. కానీ దానికన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది బయటపడింది." అన్నాడాయన. "ఇంతకీ ఏమిటది?" అని అడిగారు వాళ్ళిద్దరూ కంగారుగా. "బంగారు నాణేల గుట్ట" అన్నాడు సన్యాసి. వాళ్ళిద్దరూ సంతోషంగా "ఎక్కడ?" అని అడిగారు.</p>
<p dir="ltr">"అదిగో ఆ పొదల్లోనే" అని వేలు చూపించి తన దారిన పోయాడా సన్యాసి. వాళ్ళిద్దరూ ఆ పొదవైపు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బంగారు నాణేలు కనిపించాయి. "ఈ సన్యాసి ఎంత మూర్ఖుడు? బంగారు నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేమిటి?" అన్నాడొక మిత్రుడు.</p>
<p dir="ltr">"అతడి సంగతి వదిలేయ్. ముందుగా ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. పట్టపగలే బహిరంగంగా దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది. మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం. మరొకరు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకు వద్దాం." అన్నాడు మరో మిత్రుడు.</p>
<p dir="ltr">అనుకున్నట్టే ఒక మిత్రుడు బంగారానికి కాపలాగా ఉన్నాడు. రెండోవాడు ఊర్లోకి వెళ్లాడు. ఈలోగా మొదటి వాడు ఇలా అనుకున్నాడు. "ఛ… ఈ రోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది. బంగారం కూడా మరీ ఎక్కువగా లేదు. నా కుటుంబం చాలా పెద్దది. దాన్ని పోషించడానికి ఈ బంగారం అంతా నాకే దక్కితే బాగుంటుంది కదా! వాడు వచ్చీ రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను. ఎవరికీ అనుమానం రాదు. బంగారం అంతా నేనే తీసుకోవచ్చు." అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు.</p>
<p dir="ltr">ఇదిలా ఉండగా ఊర్లోకి వెళ్ళిన రెండో వాడి ఆలోచన ఇలాఉంది… "వాడికి సగం భాగం ఎందుకివ్వాలి? మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా! అసలే నాకు చాలా అప్పులున్నాయి. నా జీవితంలో నేను ఏదీ వెనుకేసుకోలేదు. వాడికేమో అప్పులు లేవు. ఉన్నవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బంగారమంతా నాకే దక్కాలి. కాబట్టి నేను తీసుకెళ్ళే భోజనంలో విషం కలుపుతాను. అది తిని వాడు చనిపోతాడు. ఎవరికీ తెలియకుండా బంగారమంతా నేనే తీసుకోవచ్చు" అనుకున్నాడు. అలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్ళాడు.</p>
<p dir="ltr">అతను దగ్గరికి వెళ్ళగానే అక్కడే కత్తితో పొంచి ఉన్న రెండోవాడు ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు. "పిచ్చివాడు. సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంక నేను భోంచేస్తాను." అనుకునిఏ మాత్రం అనుమానం లేకుండా తెచ్చిన అన్నాన్ని తిన్నాడు. అరగంట తర్వాత అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. "సన్యాసి మాటలు ఎంత నిజమో కదా" అనుకున్నాడు చివరి క్షణాల్లో.</p>
<p dir="ltr">గమనిక : రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెడతాను, చివరికి స్నేహితులను కూడా దూరం చేస్తాను అంటుంది ఆ రూపాయి…. అని పెద్దల నానుడి. కాబట్టి ఆ రూపాయి విషయంలో జాగ్రత్త.</p>
కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-72248112550198610842016-12-22T09:29:00.001-08:002016-12-22T09:29:38.941-08:00* 'సత్యమేవ జయతే'కు అసలైన అర్థం<p dir="ltr">కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి.</p>
<p dir="ltr">అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు.</p>
<p dir="ltr">ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు.</p>
<p dir="ltr">"రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె.</p>
<p dir="ltr">మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు.</p>
<p dir="ltr">ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను.</p>
<p dir="ltr">"రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నాడు ఆ దివ్య పురుషుడు.<br>
"సంతోషంగా వెళ్లండి" అని సాగనంపాడు మహారాజు.</p>
<p dir="ltr">అంతలోనే మరొక దేవతామూర్తి బయటికి పోతూ కనబడింది ఆయనకు. "తల్లీ! నువ్వెవ్వరు? ఎందుకు నన్ను వదిలి పోతున్నావు?" అడిగాడు రాజు.</p>
<p dir="ltr">"రాజా! నేను కీర్తికాంతను. ధన సంపత్తీ, దాన సంపదా లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను. నన్ను వెళ్లనివ్వు" అన్నది ఆ దేవతామూర్తి.</p>
<p dir="ltr">"సరేనమ్మా! నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు." అన్నాడు రాజు.</p>
<p dir="ltr">ఇంకొంతసేపటికి మరొక దివ్య మూర్తి బయటి దారి పట్టింది. రాజుగారు అడిగారు "స్వామీ! మీరెవ్వరు?" అని.</p>
<p dir="ltr">"రాజా! నేను శుభాన్ని. సంపదా, దానం, కీర్తీ లేని ఈ రాజ్యంలో నేను ఉండీ ప్రయోజనం లేదు. అందువల్ల నేను వారిని అనుసరించి పోవటమే మంచిది. నన్ను క్షమించి, పోనివ్వు" అన్నాడా దివ్యమూర్తి. రాజుగారు శుభాన్నీ సాగనంపారు.</p>
<p dir="ltr">'ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోనని రాజుగారు విచార పడుతుండగానే మరో దేవతా మూర్తి బయటికి పోతూ కనబడ్డది. "తల్లీ! నువ్వెవ్వరు?" అని అడిగాడు సత్యవ్రతుడు.<br>
"రాజా, నేను సత్య లక్ష్మిని. ధనలక్ష్మీ, దాన లక్ష్మీ, యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరం ఉండదని, నేనూ పోనెంచాను. నాకూ అనుమతినివ్వు" అన్నది సత్యం.</p>
<p dir="ltr">రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి " తల్లీ! నీకు ఆ అవసరం ఏమున్నది? వేరే ఏ సంపదనూ నేను కోరలేదు- వారంతట వారువచ్చారు; వారంతట వారు వెళ్ళారు. కానీ తల్లీ, నేను నీ పూజారిని. సత్యాన్ని కోరి, సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్లటం నీకు భావ్యం కాదు. నన్ను వదిలి వెళ్ళకు!" అన్నాడు.</p>
<p dir="ltr">సత్యం సంతోషపడింది. సరేలెమ్మన్నది. తిరిగి రాజ్యంలోకి వెళ్లిపోయింది.</p>
<p dir="ltr">రాజుగారు నిట్టూర్చారు. సూర్యోదయం కాబోతున్నది. రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి పోబోతున్నారు- అంతలోనే ఒక దివ్యమూర్తి- ఈమారు ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోనికి ప్రవేశిస్తూ కనబడింది; చూడగా, ఆమె ధనలక్ష్మి! "ఏం తల్లీ! మళ్ళీ వస్తున్నావు?" అడిగారు రాజుగారు.</p>
<p dir="ltr">"అవును సత్య వ్రతా! సత్యం లేనిచోట నేనూ ఉండలేను. అందుకే తిరిగి వస్తున్నాను" అన్నది ధనలక్ష్మి.</p>
<p dir="ltr">అంతలోనే దానలక్ష్మీ, ఆపైన యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ ఒకరి తరువాత ఒకరు తిరిగి వచ్చారు రాజ్యానికి.</p>
<p dir="ltr">మళ్లీ రాజ్యం కళకళలాడింది.</p>
<p dir="ltr">ఉపనిషత్తులలోని ఈ కథ, సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తున్నది. అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద. ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యమేలుతున్నట్లు అనిపిస్తుంది కానీ, అంతిమంగా నిలిచేది సత్యమే, సందేహం లేదు. సత్యాన్ని జీవితంలోకి ఆహ్వానించి, అడుగడుగునా నిజం చెబుదాం; వాస్తవంగా బ్రతుకుదాం.</p>
కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-85388872604446684612016-12-22T09:28:00.001-08:002016-12-22T09:28:14.236-08:00*భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్*<p dir="ltr">భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌ </p>
<p dir="ltr">డిసెంబర్‌ 22 జాతీయ గణిత దినోత్సవ ప్రత్యేకం</p>
<p dir="ltr">శ్రీనివాస రామానుజన్‌..</p>
<p dir="ltr">భారతదేశ ఆధునిక గణిత శాస్త్రవేత్తలలో ఒకరు.</p>
<p dir="ltr">నిజానికి గణితశాస్త్ర చరిత్ర భారతదేశంలో వేదకాలం నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రాచీన భారతీయులు గణితంలో ఎన్నో విషయాలు కనుగొన్నారు. సంఖ్యలను కనుగొనడంలో చాల కృషి చేశారు. దశాంశ పద్ధతిని గుర్తించిన మొదటివారు భారతీయులే.</p>
<p dir="ltr">భారతీయ గణిత చరిత్ర ఆర్యభట్ట కాలంలో స్వర్ణయుగం నుండి భాస్కరాచార్యుని వరకు ఆప్రతిహతంగా సాగింది. భాస్కరాచార్యుని తరువాతి కాలంలో బహుళ విదేశీ దండయాత్రల వలన కాబోలు గణితం కళా విహీనమైంది. అనువాదాలు, వ్యాఖ్యానాలు తప్ప పెద్దగా స్వతంత్ర గణిత సారస్వతం ఏదీ ఆవిష్కరణ కాలేదు. ఆ స్థితిలో మరల భారతీయ గణిత చరిత్రకు వన్నెలద్దిన వాడు శ్రీనివాస రామానుజన్‌.</p>
<p dir="ltr">ఇతడు 1887 డిశంబరు 22న శ్రీనివాస అయ్యంగార్‌, కోయల అయ్యంగార్‌ దంపతులకు మద్రాసు (తమిళనాడు) రాష్ట్రంలోని ఈరోడు గ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి శ్రీనివాస అయ్యంగార్‌ కుంభకోణంలో చిన్న బట్టల కొట్టులో గుమాస్తాగా పనిచేసేవారు. అందువల్ల శ్రీనివాస రామానుజన్‌ పాఠశాల విద్య కుంభకోణం లోనే జరిగింది. చిన్ననాటి నుండి రామానుజన్‌ అసాధారణ తెలివితేటలు చూపేవాడు.</p>
<p dir="ltr">శ్రీనివాస రామానుజన్‌ బాల్యం నుంచి గణితం అంటే అభిరుచి కనబరుస్తూ తన ప్రతిభతో ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచేవాడు. అయితే శ్రీనివాస రామానుజన్‌ గణితముపై మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపేవాడు. ఇతర అంశాలలో అంతగా శ్రద్ధ పెట్టేవాడు కాదు. అందువల్ల ఇంటర్మీడియట్‌ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు.</p>
<p dir="ltr">ఒకసారి తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడు ‘ఒక సంఖ్యను అదే సంఖ్యచో భాగిస్తే ఒకటి వస్తుంద’ని చెప్పినప్పుడు ‘సున్నను సున్నతో భాగించినప్పుడు ఒకటి ఎలా వస్తుంది?’ అని ప్రశ్నించాడు రామానుజన్‌.</p>
<p dir="ltr">ప్రాథమిక విద్యకు సంబంధించిన పరీక్షలలో జిల్లాలో ప్రథముడిగా ఉత్తీర్ణుడైనాడు రామానుజన్‌. ఉపకార వేతనం పొందాడు. 10వ తరగతి చదివే రోజులలో అతడు బీజగణితము, త్రికోణమితి, కలన గణితము, వైశ్లేషిక రేఖాగణితము మొదలగు వానిని అధ్యయనం చేశాడు. త్రికోణమితిని తన 12 సంవత్సరాల వయసులోనే పూర్తి చేశాడు.</p>
<p dir="ltr">శ్రీనివాస రామానుజన్‌ను ఎక్కువగా ప్రభావితం చేసినది కార్‌ వ్రాసిన ‘సినాప్సిస్‌’. దానిలో 6 వేలకు పైగా నిరూపణలు చేసిన సిద్ధాంతాలున్నాయి. అనేక సిద్ధాంతాలను తనకు తానుగా నిరూపించి శ్రీనివాసరామానుజన్‌ తన ప్రతిభను ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేశాడు.</p>
<p dir="ltr">10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన తరువాత కుంభకోణం ప్రభుత్వ కళాశాలలో F.A.లో చేరాడు. కాని కృతార్థుడు కాలేకపోయాడు. అందువల్ల కళాశాల విద్యలో రాణించలేకపోయాడు. ఒక సంవత్సరం తరువాత తిరిగి కళాశాలలో చేరినా లాభం లేకపోయింది. డిగ్రీ పొందకుండానే ఇంటికి తిరిగి వచ్చాడు.</p>
<p dir="ltr">విద్యాభ్యాసము కుంటుపడుతున్నా రామానుజన్‌ గణిత పరిశోధనలకు ఆటంకం కలుగనీయలేదు. నెల్లూరు కలెక్టరు రామస్వామి అయ్యంగార్‌ గారికి తన నోట్‌బుక్‌ చూపించి ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనం పొందుతూ పరిశోధనలు చేశాడు.</p>
<p dir="ltr">కొన్నాళ్ళ తరువాత రామానుజన్‌కు జానకితో వివాహం అయింది. సంపాదన కోసం మద్రాసు ప్రెసిడెన్సిలో చిన్న గుమాస్తాగా చేరాడు. గణిత పరిశోధనలపై శ్రీనివాస రామానుజన్‌కు ఉన్న శ్రద్ధ, అతని శాంత స్వభావం చూసి డా||వాకర్‌ రామానుజన్‌కు మద్రాసు యూనివర్సిటీ నుండి రూ|| 75/- పరిశోధన ఉపకార వేతనం ఇప్పించాడు.</p>
<p dir="ltr">మొదటిసారిగా 1913 జనవరి 16 మకర సంక్రాంతి నాడు ప్రొఫెసర్‌. హార్దికి రామానుజన్‌ స్వయంగా, తన అర్హతలు, గణితంలో గల ప్రావీణ్యత, సామర్థ్యాలను గురించి ఉత్తరం వ్రాశాడు. అది చూసి ప్రొఫెసర్‌ హార్డి రామానుజన్‌ను కేంబ్రిడ్డికి ఆహ్వానించారు. రామానుజన్‌ పరిశోధనలు చూసి ఆశ్చర్యపోయాడు హార్డి. 1914 మార్చి 17న రామానుజన్‌ మద్రాసు నుండి షిప్‌లో బయలుదేరి, 20 రోజుల ప్రయాణం తరువాత ఏప్రిల్‌ 7న లండన్‌ చేరాడు.</p>
<p dir="ltr">లండన్‌లో కేంబ్రిడ్జిలో గల ట్రినిటి కాలేజిలో ప్రవేశించి, 1917 వరకు గణిత పరిశోధనలు చేశాడు. వీటి గురించి ప్రపంచ పత్రికల్లో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. దీనివలన ప్రపంచ వ్యాప్తంగా రామానుజన్‌ ప్రతిభ వెల్లడైంది. 1914 నుండి 1919 వరకు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కఠోరంగా పరిశ్రమిస్తూ 32 పరిశోధనా పత్రాలు సమర్పించారు రామానుజన్‌.</p>
<p dir="ltr">srinivasaశుద్ధ గణిత శాస్త్రజ్ఞుల్లో శ్రీనివాస రామానుజన్‌ ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. ఈయన గణిత పరిశోధనలు ముఖ్యంగా సంఖ్యావాదానికి (Theory of Numbers) చెందినవి. 1918లో రాయల్‌ సోసైటీ ఆఫ్‌ ఇంగ్లాండు శ్రీనివాస రామానుజన్‌కు అత్యంత ప్రతిష్టాకరమైన ”ఫెలో ఆఫ్‌ రాయల్‌ సోసైటి” బిరుదునిచ్చి గౌరవించింది. 1918 లో రామానుజన్‌ కేంబ్రిడ్జి ట్రినిటి కళాశాల ఫెలోగా ఎన్నికయ్యాడు.</p>
<p dir="ltr">శ్రీనివాస రామానుజన్‌ సంఖ్య 1729 అని అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆచార్య హర్డీ టాక్సీ నెంబరు 1729. రామానుజన్‌ అనారోగ్యంగా వున్నప్పుడు పరామర్శించడానికి వెళ్లిన కారు నెంబరు. శ్రీనివాస రామానుజన్‌ 1729 యొక్క ప్రాముఖ్యత హార్డీకి వివరించారు. దానిని రెండు ఘనాల మొత్తమని చెప్పారు. దానిని రెండు రకాలుగా రాయగల మిక్కిలి చిన్న సంఖ్య అని గుర్తించిన మేధావి శ్రీనివాస రామానుజన్‌. 1729=10³+9³=12³+1³. రామానుజన్‌ π విలువను 3.14159265262= (9²+19²/22)¼గా చెప్పారు.</p>
<p dir="ltr">2తో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్దాలు రామానుజన్‌ రాశారు. ప్రధాన సంఖ్యలపై రామానుజన్‌ యిచ్చిన వివరాలు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. రామానుజన్‌ ”సమున్నత సంయుక్త సంఖ్య” అనే భావనను ప్రవేశపెట్టారు. రామానుజన్‌ ప్రతిపాదించిన ‘మాక్‌ తీటా ఫంక్షన్స్‌’ ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. 1903-1910 సంవత్సరాల మధ్య కాలంలో రామానుజన్‌ కనుగొన్న తరువాత రోగర్‌-రామానుజన్‌ సర్వ సమీకరణంగా పేరుపొందింది. సంఖ్యల సర్వ సమానత్వాలు, సౌష్టవాలు, వాటి మధ్య సంబంధాలు అనే వాటిపై ఆయనకు గల జ్ఞానం మరో శాస్త్రవేత్తకు లేదని చెప్పవచ్చు. రామానుజన్‌ 3⇒√9⇒√1+2×4…..⇒…  మ్యాజిక్‌ స్వ్కేర్స్‌, కంటిన్యూస్‌ ఫ్రాక్షన్స్‌, ప్రధాన సంఖ్యలు, ఎలిప్టిక్‌ ఇంటిగ్రల్స్‌పై చాల పరిశోధనలు చేశారు.</p>
<p dir="ltr">వీటిని చిన్నసైజు కాగితాలపై రాసి, ప్రొఫెసర్‌ వి.రామస్వామికి చూపారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన చివరి రోజులలో రామానుజన్‌ మాక్‌-తీటా ఫంక్షన్ల్‌పై చేసిన పరిశోధనలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. 1916లో రామానుజన్‌ ప్రతిపాదించిన గణిత సూత్రాలు 1974లో డెల్జిన్‌ అనే ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త నిరూపించాడు. ఇది రామానుజన్‌ ఉహాశక్తికి ఒక ఉదాహరణ మాత్రమే.</p>
<p dir="ltr">రామానుజన్‌ మాపన సమీకరణలు ఎంత పరిమాణము వరకైనా గుణకారాలు చేయడానికి ఉపయోగపడుతాయి. జార్జిషూ బ్రిడ్జికార్‌ రచించిన “Synopsis of Elementary Results in Pure and Applied Mathematics” అనే గ్రంథాన్ని సంపాదించి 6000 సమస్యలు సాధించారు రామానుజన్‌. ఈ ప్రతిభ శ్రీనివాస రామానుజన్‌కు మాత్రమే దక్కుతుంది. శ్రీనివాస రామానుజన్‌ ప్రధాన సంఖ్యలు, భిన్నములు, అనంత పరంపరలు, శృంఖలికిత భిన్నములు, నిశ్చిత శయనములు మొదలగు వాటిలోని సమస్యలు సాధించి మూడు నోటు పుస్తకాలలో నింపారు. వీటినే శ్రీనివాస రామానుజన్‌ ”ఫ్రేయడ్‌ నోట్‌ బుక్స్‌” అంటారు. ఈ విధంగా గణిత శాస్త్రానికి సేవ చేసినందుకు, అభివృద్ధి చేసినందుకు ”ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటి” బిరుదు రామానుజన్‌ను వరించింది. రామానుజన్‌ చివరలో మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధనాచార్య పదవి స్వీకరించారు.</p>
<p dir="ltr">గణిత పరిశోధనలపై అవిశ్రాంతంగా పనిచేయడంతో శ్రీనివాస రామానుజన్‌ 32 సంవత్సరాల అతి చిన్న వయసులోనే 26 ఏప్రిల్‌ 1920న స్వర్గస్తులయ్యారు.</p>
<p dir="ltr">శ్రీనివాస రామానుజన్‌లో అసాధరణంగా దాగియున్న అంతర్‌దృష్టి, అతణ్ణి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా నిలబెట్టింది. ఏ గణిత సూత్రాన్ని నిరూపణలు లేకుండా ఆయన ఆవిష్కరించలేదు.</p>
<p dir="ltr">గణిత సూత్రాలు, గణిత ప్రవచనాలు, సిద్ధాంతాలు, నంబర్‌ థీరమ్స్‌ మొదలైన గణిత సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం శ్రీనివాస రామానుజన్‌ పేర తపాల బిళ్లను విడుదల చేసింది. ఆయన జన్మించిన డిశంబర్‌ 22 వ తేదీని జాతీయ గణిత దినోత్సవముగా నిర్ణయించింది.భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌<br><br></p>
<p dir="ltr">భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌ </p>
<p dir="ltr">డిసెంబర్‌ 22 జాతీయ గణిత దినోత్సవ ప్రత్యేకం</p>
<p dir="ltr">శ్రీనివాస రామానుజన్‌..</p>
<p dir="ltr">భారతదేశ ఆధునిక గణిత శాస్త్రవేత్తలలో ఒకరు.</p>
<p dir="ltr">నిజానికి గణితశాస్త్ర చరిత్ర భారతదేశంలో వేదకాలం నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రాచీన భారతీయులు గణితంలో ఎన్నో విషయాలు కనుగొన్నారు. సంఖ్యలను కనుగొనడంలో చాల కృషి చేశారు. దశాంశ పద్ధతిని గుర్తించిన మొదటివారు భారతీయులే.</p>
<p dir="ltr">భారతీయ గణిత చరిత్ర ఆర్యభట్ట కాలంలో స్వర్ణయుగం నుండి భాస్కరాచార్యుని వరకు ఆప్రతిహతంగా సాగింది. భాస్కరాచార్యుని తరువాతి కాలంలో బహుళ విదేశీ దండయాత్రల వలన కాబోలు గణితం కళా విహీనమైంది. అనువాదాలు, వ్యాఖ్యానాలు తప్ప పెద్దగా స్వతంత్ర గణిత సారస్వతం ఏదీ ఆవిష్కరణ కాలేదు. ఆ స్థితిలో మరల భారతీయ గణిత చరిత్రకు వన్నెలద్దిన వాడు శ్రీనివాస రామానుజన్‌.</p>
<p dir="ltr">ఇతడు 1887 డిశంబరు 22న శ్రీనివాస అయ్యంగార్‌, కోయల అయ్యంగార్‌ దంపతులకు మద్రాసు (తమిళనాడు) రాష్ట్రంలోని ఈరోడు గ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి శ్రీనివాస అయ్యంగార్‌ కుంభకోణంలో చిన్న బట్టల కొట్టులో గుమాస్తాగా పనిచేసేవారు. అందువల్ల శ్రీనివాస రామానుజన్‌ పాఠశాల విద్య కుంభకోణం లోనే జరిగింది. చిన్ననాటి నుండి రామానుజన్‌ అసాధారణ తెలివితేటలు చూపేవాడు.</p>
<p dir="ltr">శ్రీనివాస రామానుజన్‌ బాల్యం నుంచి గణితం అంటే అభిరుచి కనబరుస్తూ తన ప్రతిభతో ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచేవాడు. అయితే శ్రీనివాస రామానుజన్‌ గణితముపై మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపేవాడు. ఇతర అంశాలలో అంతగా శ్రద్ధ పెట్టేవాడు కాదు. అందువల్ల ఇంటర్మీడియట్‌ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు.</p>
<p dir="ltr">ఒకసారి తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడు ‘ఒక సంఖ్యను అదే సంఖ్యచో భాగిస్తే ఒకటి వస్తుంద’ని చెప్పినప్పుడు ‘సున్నను సున్నతో భాగించినప్పుడు ఒకటి ఎలా వస్తుంది?’ అని ప్రశ్నించాడు రామానుజన్‌.</p>
<p dir="ltr">ప్రాథమిక విద్యకు సంబంధించిన పరీక్షలలో జిల్లాలో ప్రథముడిగా ఉత్తీర్ణుడైనాడు రామానుజన్‌. ఉపకార వేతనం పొందాడు. 10వ తరగతి చదివే రోజులలో అతడు బీజగణితము, త్రికోణమితి, కలన గణితము, వైశ్లేషిక రేఖాగణితము మొదలగు వానిని అధ్యయనం చేశాడు. త్రికోణమితిని తన 12 సంవత్సరాల వయసులోనే పూర్తి చేశాడు.</p>
<p dir="ltr">శ్రీనివాస రామానుజన్‌ను ఎక్కువగా ప్రభావితం చేసినది కార్‌ వ్రాసిన ‘సినాప్సిస్‌’. దానిలో 6 వేలకు పైగా నిరూపణలు చేసిన సిద్ధాంతాలున్నాయి. అనేక సిద్ధాంతాలను తనకు తానుగా నిరూపించి శ్రీనివాసరామానుజన్‌ తన ప్రతిభను ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేశాడు.</p>
<p dir="ltr">10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన తరువాత కుంభకోణం ప్రభుత్వ కళాశాలలో F.A.లో చేరాడు. కాని కృతార్థుడు కాలేకపోయాడు. అందువల్ల కళాశాల విద్యలో రాణించలేకపోయాడు. ఒక సంవత్సరం తరువాత తిరిగి కళాశాలలో చేరినా లాభం లేకపోయింది. డిగ్రీ పొందకుండానే ఇంటికి తిరిగి వచ్చాడు.</p>
<p dir="ltr">విద్యాభ్యాసము కుంటుపడుతున్నా రామానుజన్‌ గణిత పరిశోధనలకు ఆటంకం కలుగనీయలేదు. నెల్లూరు కలెక్టరు రామస్వామి అయ్యంగార్‌ గారికి తన నోట్‌బుక్‌ చూపించి ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనం పొందుతూ పరిశోధనలు చేశాడు.</p>
<p dir="ltr">కొన్నాళ్ళ తరువాత రామానుజన్‌కు జానకితో వివాహం అయింది. సంపాదన కోసం మద్రాసు ప్రెసిడెన్సిలో చిన్న గుమాస్తాగా చేరాడు. గణిత పరిశోధనలపై శ్రీనివాస రామానుజన్‌కు ఉన్న శ్రద్ధ, అతని శాంత స్వభావం చూసి డా||వాకర్‌ రామానుజన్‌కు మద్రాసు యూనివర్సిటీ నుండి రూ|| 75/- పరిశోధన ఉపకార వేతనం ఇప్పించాడు.</p>
<p dir="ltr">మొదటిసారిగా 1913 జనవరి 16 మకర సంక్రాంతి నాడు ప్రొఫెసర్‌. హార్దికి రామానుజన్‌ స్వయంగా, తన అర్హతలు, గణితంలో గల ప్రావీణ్యత, సామర్థ్యాలను గురించి ఉత్తరం వ్రాశాడు. అది చూసి ప్రొఫెసర్‌ హార్డి రామానుజన్‌ను కేంబ్రిడ్డికి ఆహ్వానించారు. రామానుజన్‌ పరిశోధనలు చూసి ఆశ్చర్యపోయాడు హార్డి. 1914 మార్చి 17న రామానుజన్‌ మద్రాసు నుండి షిప్‌లో బయలుదేరి, 20 రోజుల ప్రయాణం తరువాత ఏప్రిల్‌ 7న లండన్‌ చేరాడు.</p>
<p dir="ltr">లండన్‌లో కేంబ్రిడ్జిలో గల ట్రినిటి కాలేజిలో ప్రవేశించి, 1917 వరకు గణిత పరిశోధనలు చేశాడు. వీటి గురించి ప్రపంచ పత్రికల్లో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. దీనివలన ప్రపంచ వ్యాప్తంగా రామానుజన్‌ ప్రతిభ వెల్లడైంది. 1914 నుండి 1919 వరకు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కఠోరంగా పరిశ్రమిస్తూ 32 పరిశోధనా పత్రాలు సమర్పించారు రామానుజన్‌.</p>
<p dir="ltr">srinivasaశుద్ధ గణిత శాస్త్రజ్ఞుల్లో శ్రీనివాస రామానుజన్‌ ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. ఈయన గణిత పరిశోధనలు ముఖ్యంగా సంఖ్యావాదానికి (Theory of Numbers) చెందినవి. 1918లో రాయల్‌ సోసైటీ ఆఫ్‌ ఇంగ్లాండు శ్రీనివాస రామానుజన్‌కు అత్యంత ప్రతిష్టాకరమైన ”ఫెలో ఆఫ్‌ రాయల్‌ సోసైటి” బిరుదునిచ్చి గౌరవించింది. 1918 లో రామానుజన్‌ కేంబ్రిడ్జి ట్రినిటి కళాశాల ఫెలోగా ఎన్నికయ్యాడు.</p>
<p dir="ltr">శ్రీనివాస రామానుజన్‌ సంఖ్య 1729 అని అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆచార్య హర్డీ టాక్సీ నెంబరు 1729. రామానుజన్‌ అనారోగ్యంగా వున్నప్పుడు పరామర్శించడానికి వెళ్లిన కారు నెంబరు. శ్రీనివాస రామానుజన్‌ 1729 యొక్క ప్రాముఖ్యత హార్డీకి వివరించారు. దానిని రెండు ఘనాల మొత్తమని చెప్పారు. దానిని రెండు రకాలుగా రాయగల మిక్కిలి చిన్న సంఖ్య అని గుర్తించిన మేధావి శ్రీనివాస రామానుజన్‌. 1729=10³+9³=12³+1³. రామానుజన్‌ π విలువను 3.14159265262= (9²+19²/22)¼గా చెప్పారు.</p>
<p dir="ltr">2తో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్దాలు రామానుజన్‌ రాశారు. ప్రధాన సంఖ్యలపై రామానుజన్‌ యిచ్చిన వివరాలు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. రామానుజన్‌ ”సమున్నత సంయుక్త సంఖ్య” అనే భావనను ప్రవేశపెట్టారు. రామానుజన్‌ ప్రతిపాదించిన ‘మాక్‌ తీటా ఫంక్షన్స్‌’ ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. 1903-1910 సంవత్సరాల మధ్య కాలంలో రామానుజన్‌ కనుగొన్న తరువాత రోగర్‌-రామానుజన్‌ సర్వ సమీకరణంగా పేరుపొందింది. సంఖ్యల సర్వ సమానత్వాలు, సౌష్టవాలు, వాటి మధ్య సంబంధాలు అనే వాటిపై ఆయనకు గల జ్ఞానం మరో శాస్త్రవేత్తకు లేదని చెప్పవచ్చు. రామానుజన్‌ 3⇒√9⇒√1+2×4…..⇒…  మ్యాజిక్‌ స్వ్కేర్స్‌, కంటిన్యూస్‌ ఫ్రాక్షన్స్‌, ప్రధాన సంఖ్యలు, ఎలిప్టిక్‌ ఇంటిగ్రల్స్‌పై చాల పరిశోధనలు చేశారు.</p>
<p dir="ltr">వీటిని చిన్నసైజు కాగితాలపై రాసి, ప్రొఫెసర్‌ వి.రామస్వామికి చూపారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన చివరి రోజులలో రామానుజన్‌ మాక్‌-తీటా ఫంక్షన్ల్‌పై చేసిన పరిశోధనలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. 1916లో రామానుజన్‌ ప్రతిపాదించిన గణిత సూత్రాలు 1974లో డెల్జిన్‌ అనే ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త నిరూపించాడు. ఇది రామానుజన్‌ ఉహాశక్తికి ఒక ఉదాహరణ మాత్రమే.</p>
<p dir="ltr">రామానుజన్‌ మాపన సమీకరణలు ఎంత పరిమాణము వరకైనా గుణకారాలు చేయడానికి ఉపయోగపడుతాయి. జార్జిషూ బ్రిడ్జికార్‌ రచించిన “Synopsis of Elementary Results in Pure and Applied Mathematics” అనే గ్రంథాన్ని సంపాదించి 6000 సమస్యలు సాధించారు రామానుజన్‌. ఈ ప్రతిభ శ్రీనివాస రామానుజన్‌కు మాత్రమే దక్కుతుంది. శ్రీనివాస రామానుజన్‌ ప్రధాన సంఖ్యలు, భిన్నములు, అనంత పరంపరలు, శృంఖలికిత భిన్నములు, నిశ్చిత శయనములు మొదలగు వాటిలోని సమస్యలు సాధించి మూడు నోటు పుస్తకాలలో నింపారు. వీటినే శ్రీనివాస రామానుజన్‌ ”ఫ్రేయడ్‌ నోట్‌ బుక్స్‌” అంటారు. ఈ విధంగా గణిత శాస్త్రానికి సేవ చేసినందుకు, అభివృద్ధి చేసినందుకు ”ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటి” బిరుదు రామానుజన్‌ను వరించింది. రామానుజన్‌ చివరలో మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధనాచార్య పదవి స్వీకరించారు.</p>
<p dir="ltr">గణిత పరిశోధనలపై అవిశ్రాంతంగా పనిచేయడంతో శ్రీనివాస రామానుజన్‌ 32 సంవత్సరాల అతి చిన్న వయసులోనే 26 ఏప్రిల్‌ 1920న స్వర్గస్తులయ్యారు.</p>
<p dir="ltr">శ్రీనివాస రామానుజన్‌లో అసాధరణంగా దాగియున్న అంతర్‌దృష్టి, అతణ్ణి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా నిలబెట్టింది. ఏ గణిత సూత్రాన్ని నిరూపణలు లేకుండా ఆయన ఆవిష్కరించలేదు.</p>
<p dir="ltr">గణిత సూత్రాలు, గణిత ప్రవచనాలు, సిద్ధాంతాలు, నంబర్‌ థీరమ్స్‌ మొదలైన గణిత సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం శ్రీనివాస రామానుజన్‌ పేర తపాల బిళ్లను విడుదల చేసింది. ఆయన జన్మించిన డిశంబర్‌ 22 వ తేదీని జాతీయ గణిత దినోత్సవముగా నిర్ణయించింది.</p>
కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-34597436832629234652016-12-20T09:42:00.001-08:002016-12-20T09:42:36.507-08:00మన మనసే దర్పణం <p dir="ltr">ఒకరోజు ఒక కుక్క పూర్తిగా అద్దాలతో కట్టిన ఒక మ్యూజియం లోకి వచ్చింది. అక్కడ ఎవ్వరూ లేరు...ఆ హాలు నిండా అద్దాలు ఉండడం వలన, ఆ కుక్కకు చుట్టూ ఎన్నో కుక్కలు ఉన్నట్టు కనిపించింది. నిజంగానే చాలా ఉన్నాయి అనుకుని, వాటిని భయపెట్టటానికి పళ్ళు బయటపెట్టి అరిచింది....చుట్టూ ఉన్న దాని ప్రతిబింబాలన్నీ అలాగే చేసాయి. గట్టిగా అరిచింది...అద్దాలలో కూడా అలాగే కనిపించింది. ఖాళీ గా ఉండడం వల్ల శబ్దం మరింత ప్రతిధ్వనించింది. అద్దాల దగ్గరికి వెళ్ళేసరికి ఆ కుక్కలు కూడా తన మీదకు వస్తున్నట్టు భ్రమించింది. రాత్రంతా అలాగే గడిచింది. తెల్లవారి ఆ మ్యూజియం కాపలావాళ్ళు వచ్చి చూసే సరికి ఆ కుక్క చాలా దీనంగా, ఒంటి నిండా దెబ్బలతో లేవలేని స్థితిలో, దాదాపు చనిపోవటానికి సిధ్ధంగా ఉంది. కాపలావాళ్ళు ఆశ్చర్యపోయారు, ఎవ్వరూ లేని చోట కుక్కకు దెబ్బలు ఎలా తగిలాయి, ఎవ్వరు దీనిమీద దాడి చేసారు అని....<br>
ఆకుక్క తన ప్రతిబింబాలతో తనే పోట్లాడింది....వాటిపై దాడి చేస్తున్నాను అనుకుని, తనకు తనే భయంకరంగా గాయాలు చేసుకుంది.<br>
ఈ ప్రపంచం కూడా సరిగ్గా అలాంటిదే.....అది మనకు మంచి కాని, చెడు కాని, చేయదు. మన ఆలోచనలు, మన మనస్తత్వమే మన మంచి చెడులను నిర్ణయిస్తుంది. మన చుట్టూ జరుగుతునది అంతా మన ఆశలు, కోరికలు, ఆలోచనల ఫలితమే. ఈ ప్రపంచం ఒక పెద్ద దర్పణం వంటిది, మనం మంచిగా ఉంటే అందరూ మంచిగానే కనపడతారు...ఈ దర్పణం ముందు ఆనందంగా పోజు ఇవ్వండి....అంతా ఆనందంగానే ఉంటుంది.</p>
కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-23351149474389776112016-12-20T09:35:00.001-08:002016-12-20T09:35:43.276-08:00వందే గోమాతరం<p dir="ltr">కోడి,మేక,లాగా గోవు కూడా జంతువే కదా అలాంటప్పుడు దాన్ని కోసుకుని తింటే తప్పేంటి”<br>
అని అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానుల్లారా…..</p>
<p dir="ltr">గోవు కూడా జంతువే కానీ….<br>
ప్రపంచంలో మరే జంతువుకూ లేని (చివరకు మనిషిగా పుట్టిన నీకూ,నాకూ కూడా లేని) చాలా ప్రత్యేకతలు గోవుకుంది.<br>
అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ”గోమాత” అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు.</p>
<p dir="ltr">నీ చదువు…<br>
నీ సంస్కారం…<br>
నీ విచక్షణ…<br>
నీ విజ్ఞత…<br>
నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే…<br>
గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా</p>
<p dir="ltr">* ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని..ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమో అని ..<br>
ఒక ఆవుకు ప్రతిరోజూ ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని,పాలను,మూత్రాన్ని, పేడను ప్రయోగశాల(Lab )కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసుందో పరీక్షించారు.<br>
అలా ఒకరోజు,రెండ్రోజులు కాదు…ఏకంగా తొంభై రోజులు(మూడు నెలలు) ఢిల్లీ లోని ఎయిమ్స్(All India Institute of Medical Science ) కు పంపి పరీక్షించారు.<br>
ఆ ఆవు పాలలోగానీ, రక్తంలోగానీ,మూత్రంలోగానీ,పేడలోగానీ విషపు ఛాయలేవీ కనిపించలేదు వారికి.</p>
<p dir="ltr">మరి వీరు తొంభైరోజులు ఎక్కించిన విషమంతా ఏమయినట్టు?<br>
గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత.<br>
మరే జంతువుకూ లేని విశిష్టగుణం ఇది.</p>
<p dir="ltr">* ప్రాణవాయువు(Oxygen )ను పీల్చూకుని ప్రాణవాయువు(Oxygen )ను వదిలే ఏకైక ప్రాణి.</p>
<p dir="ltr">* విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది.</p>
<p dir="ltr">* వైద్యశాస్త్రానికే అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది.</p>
<p dir="ltr">* ఆవునెయ్యి,బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్,ప్రోపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి.</p>
<p dir="ltr">* కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడే శ్రేష్టమైనది.</p>
<p dir="ltr">* గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని.</p>
<p dir="ltr">* గోవుపేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు.</p>
<p dir="ltr">* ఇళ్ళను,వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు.</p>
<p dir="ltr">* ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది.</p>
<p dir="ltr">*  ఒక తులం నెయ్యిని అగ్ని(యజ్ఞం)లో వాడితే ఒక టన్ను ప్రాణవాయవు(Oxygen )ఉత్పత్తి అవుతుంది.</p>
<p dir="ltr">* గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది.</p>
<p dir="ltr">”గోరక్షణ వల్లనే మన జాతి,మన ధర్మము రక్షింపబడును.గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు”.<br>
– గాంధీజీ.</p>
<p dir="ltr">”ఆవుపాలలో రసాయన్,ఆవునెయ్యిలో అమృతం ఉంది.దాని మాంసం తింటే రోగిస్టులు అవుతారు”.<br>
– మహ్మద్ ప్రవక్త.</p>
<p dir="ltr">”ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినట్టే”.<br>
– ఏసుక్రీస్తు.</p>
<p dir="ltr">”గో క్షీరము గొప్పమందు.దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని.దాని మాంసము రోగకారకము”.<br>
– హజరత్ మహమ్మద్.</p>
<p dir="ltr">”గోవులు మానవ సమాజమునకు ఒక గొప్పవరము.ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుచూ రక్షింపబడునో ఆ దేశపుభూములు గొప్పగానుండును.గృహములు ఉన్నతి చెందును.నాగరికత పురోగమించును”.<br>
– బర్మార్డ్ మేక్ ఫెడన్.</p>
<p dir="ltr">”మహ్మదీయుల మత గ్రంధమైన ఖురాన్ లో ఎక్కడనూ గోవధ సమర్థింపబడలేదు”.<br>
– హకీల హజ్మల్ ఖాన్.</p>
<p dir="ltr">”గో హత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధం”.<br>
– తోహస్-వి-హింద్ బిజహరు.</p>
<p dir="ltr">భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడైనా చూడగలవా?<br>
నువ్వు హిందువైనా, మస్లీమువైనా,క్రిస్టియన్వైనా నాదేశంలో ఉన్నంతవరకూ భారతీయుడివి.<br>
నా దేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడం నీ ధర్మం.</p>
<p dir="ltr">స్వేచ్ఛంటే….<br>
”నీకు నచ్చినట్టు బ్రతకడం కాదు”<br>
”నా(నీ,ఈ)దేశం మెచ్చేటట్టు బ్రతకడం”</p>
<p dir="ltr">         ”వందేగోమాతరం”</p>
కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-52717506800467301342016-12-20T09:33:00.001-08:002016-12-20T09:33:43.865-08:00*ఆ రోజులే బాగున్నాయ్* !
�----------�----------�<p dir="ltr">టెన్షన్లు.. <br>
ఒత్తిళ్లు...  <br>
డబ్బు సంపాదన...<br>
అతిగా ఆలోచనలు లేకుండా...<br>
ఉన్నంతలో కుటుంబమంతా కలసి... <br>
ఆనందంగా గడిపిన .<br>
�ఆ రోజులు బాగున్నాయ్..!</p>
<p dir="ltr">ఆదివారం <br>
ఆటలాడుతూ... <br>
అన్నాన్ని మరచిన <br>
�ఆ రోజులు బాగున్నాయ్..!</p>
<p dir="ltr">మినరల్ వాటర్ గోల లేకుండా...<br>
కుళాయి దగ్గర, <br>
బోరింగుల దగ్గర, <br>
బావుల దగ్గర... <br>
నీళ్లు తాగిన...<br>
�ఆ రోజులు బాగున్నాయ్..!</p>
<p dir="ltr">ఎండాకాలం <br>
చలివేంద్రాల్లోని చల్లని నీళ్లకోసం..<br>
ఎర్రని ఎండను సైతం <br>
లెక్కచేయని...<br>
�ఆరోజులు బాగున్నాయ్..!</p>
<p dir="ltr">వందలకొద్దీ చానెళ్లు లేకున్నా...<br>
ఉన్న ఒక్క దూరదర్శన్ లో <br>
శుక్రవారం చిత్రలహరి... <br>
ఆదివారం సినిమా కోసం వారమంతా... <br>
ఎదురు చూసిన <br>
� ఆ రోజులు బాగున్నాయ్..!</p>
<p dir="ltr">సెలవుల్లో <br>
అమ్మమ్మ.. <br>
నానమ్మల ఊళ్లకు వెళ్లి... <br>
ఇంటికి రావాలనే ఆలోచన లేని...<br>
� ఆ రోజులు బాగున్నాయ్..!</p>
<p dir="ltr">ఏసీ కార్లు లేకున్నా <br>
ఎర్రబస్సుల్లో...<br>
కిటికీ పక్క సీట్లో నుండి <br>
ప్రకృతిని ఆస్వాదించిన <br>
� ఆ రోజులు బాగున్నాయ్...!</p>
<p dir="ltr">మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా...<br>
బర్త్ డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ... <br>
చాక్లెట్లు పంచిన <br>
� ఆ రోజులు బాగున్నాయ్..!</p>
<p dir="ltr">మటన్ బిర్యానీ.. <br>
చికిన్ బిర్యానీ లేకున్నా... <br>
ఎండాకాలం వచ్చిందంటే <br>
మామిడి కాయ పచ్చడితో...<br>
అందరం కలసి<br>
కడుపునిండా అన్నం తిన్న...<br>
� ఆరోజులు బాగున్నాయ్..!</p>
<p dir="ltr">ఇప్పుడు జేబు నిండా కార్డులున్నా... <br>
పరుసు నిండా డబ్బులున్నా...<br>
కొట్టుకు పంపితే ...<br>
మిగిలిన చిల్లర కాజేసిన<br>
� ఆ రోజులే బాగున్నాయ్..!</p>
<p dir="ltr">సెల్లు నిండా గేములున్నా...<br>
బ్యాట్ మార్చుకుంటూ <br>
ఒకే బ్యాట్ తో క్రికెట్టాడిన.. <br>
� ఆ రోజులే బాగున్నాయ్...!</p>
<p dir="ltr">ఇప్పుడు బీరువా నిండా జీన్సు ప్యాంట్లున్నా... <br>
రెండు నిక్కర్లతో బడికెళ్లిన...<br>
� ఆ రోజులే బాగున్నాయ్..!</p>
<p dir="ltr">ఇప్పుడు బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా... .<br>
ఐదు పైసల ఆశా చాక్లెట్ తిన్న...<br>
� ఆ రోజులే బాగున్నాయ్...!</p>
<p dir="ltr">చిన్న చిన్న మాటలకే దూరం పెంచుకుంటున్న ఈ రోజుల్లో..<br>
పిల్లలం కొట్టుకున్నా <br>
పెద్దలంతా కలసివుండే<br>
� ఆ రోజులే బాగున్నాయ్..! </p>
<p dir="ltr">ఇప్పుడు ఇంటినిండా తినుబండారాలున్నా...<br>
నాన్న కొనుక్కొచ్చే ...<br>
చిరుతిళ్ళ కోసం ఎదురు చూసిన..<br>
� ఆ రోజులే బాగున్నాయ్..!</p>
<p dir="ltr">ఇప్పుడు రకరకాల <br>
ఐస్ క్రీమ్ లు చల్లగా నోట్లో నానుతున్నా...<br>
అమ్మ చీరకొంగు పైసలతో <br>
పుల్ల ఐసు కొనితిన్న...<br>
�ఆ రోజులు ఎంతో బాగున్నాయ్..!</p>
<p dir="ltr">పొద్దుపోయేదాకా <br>
చేలో పని చేసుకొచ్చి...<br>
ఎలాంటి చీకూచింత లేకుండా.. <br>
ఎండాకాలంలో ఆకాశంలోని <br>
చందమామను చూస్తూ నిదురించిన..<br>
� ఆ రోజులు బాగున్నాయ్..!</p>
<p dir="ltr">�ఆ రోజులు బాగున్నాయ్...�<br>
�ఆ రోజులు ఎంతో బాగున్నాయ్...�<br>
*ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయింది*<br>
అమ్మ, నాన్న,.... <br>
అక్క బావ...<br>
చెల్లి మర్ది.... <br>
అన్న వదిన.... <br>
తమ్ముడు మర్దలు.... <br>
మేనత్త మేనమామ.... <br>
పిన్ని బాబాయ్..... <br>
పెద్దమ్మ పెదనాన్న.... <br>
తాతయ్య అమ్మమ్మ.... <br>
తాతయ్య నానమ్మ..... <br>
ఒదిన, మరదలు....<br>
బావ బామ్మర్ధి.....<br>
ఇంకా.... <br>
ముత్తాత తాతమ్మ....<br>
ఇలా వరుసలు ఉన్నాయని.... ఉంటాయన్న సంగతే మరిచారు నేటి తరం....<br>
మమ్మి డాడి..... ఆంటీ అంకుల్<br>
ఇవి రెండు తెలిస్తే చాలు....<br>
ప్రపంచమంతా మన బందువులే అనే భావన ఏర్పడింది.<br>
రక్త సంభందం అంటే ఏంటో తెలియని దుస్తితి....<br>
కారణం.....<br>
పుట్టగానే పిల్లలను క్రెచ్చ్ ల్లో వేయడం....<br>
లేదా ఆయాలకు అప్పగించడం...<br>
అందాలకు బందీలై తల్లి పాలు కూడా ఇవ్వకపోవడం....<br>
ముడ్డి కడగడం మానుకొని డైపర్స్ వాడడం....<br>
ఇంకెక్కడి ప్రేమలు... లాలనలు....<br>
ఇక్కడినుండే మొదలు....<br>
ఇక కాన్వెంట్లు..... రెసిడెన్సు స్కూళ్లు....<br>
వాడికి ఎవడు చుట్టమో... ఎవడు పక్కమో తెలియని పరిస్థితి ....<br>
ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప మరేమీలేదు....<br>
ఇంజనీరింగ్ చేయడం.... <br>
ఎమ్మెస్ కని విదేశాలకు వెళ్ళడం..... <br>
వాట్సాప్ లో చాటింగ్....<br>
ఐ ఎం ఓ లో విజిటింగ్....<br>
స్కైప్ లో వీడియో కాలింగ్....<br>
అమేజాన్ ద్వారా షాపింగ్....<br>
నెలకింత అమ్మ నాన్నలకు డబ్బు పంపిస్తే.... వీరికదే ఆనందం....<br>
పెళ్లి ముందురావడం.... అయిపోగానే పెళ్ళాన్ని తీసుకొని పోవడం..... <br>
ఇంకెక్కడి ప్రేమలు... ఆప్యాయతలు....<br>
అయ్యా, అమ్మ సస్తే తప్ప.... <br>
కనీసం దాయాదులు పోయినా....<br>
దగ్గరోడు సచ్చినా....<br>
దయలేని దుస్థితి ....<br>
చూడలేని పరిస్థితి ....<br>
ఇంకెక్కడి బందాలు....<br>
ఇంకెక్కడి బందుత్వాలు....<br>
అందుకే....<br>
కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది....<br>
అందుకే రోజు రోజుకు ఓల్డ్ ఏజ్ హోం ల సంఖ్యలు పెరుగుతూ పోతున్నాయి.....<br>
బాల్యం నుండే మార్పు రావాలి...<br>
బందాలు పెరగాలి....<br>
అమ్మమ్మ, నానమ్మ ల కథలు వినాలి....<br>
తాతయ్య నేర్పే మర్యాదలు నేర్పాలి....<br>
కుటుంబం లో ఉండే ఆనందం తెలపాలి....<br>
అది మనింటినుండే ప్రారంభం కావాలి....<br>
కలసి బోజనం చేసి.... కలసి ముచ్చటించడం నేర్పాలి....<br>
ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి....<br>
మళ్ళీ ప్రపంచానికి మన దేశం వసుదైక కుటుంబం అని చాటి చెబుదాం....🌹<br>
💑👨‍👨‍👧👨‍👩‍👦‍👦👨‍👨‍👧‍👦👨‍👨‍👦‍👦👩‍👩‍👦🌏💞</p>
కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-17009508003009692812016-12-20T09:21:00.001-08:002016-12-20T09:21:47.419-08:00One million dollar <p dir="ltr">బ్రెజిల్ లో ఒక కోటీశ్వరుడు తన One Million Dollar ఖరీదుగల బెంట్లీ కారుని పలానా రోజు పాతిపెడుతున్నాను అని పత్రికా ప్రకటన ఇచ్చాడు..!!<br>
నేను ఈ కారుని ఎందుకు పాతి పెడుతున్నానంటే.. నా మరణానంతరం కూడా ఈ కారు నాకు పనికివస్తుంది అని చెప్పాడు..!!<br>
అప్పుడు ఈ కోటీశ్వరుడుని అందరూ ఈయన ఒక పెద్ద అవివేకి అని, One Million Dollar కారుని వృధా చేస్తున్నాడు అని విమర్శించారు..!!<br>
మీడియాతో పాటుగా ప్రజలు కూడా చాలా తిట్టారు అతన్ని..!!<br>
అతను పాతిపెట్టే రోజు ఏమి జరుగుతుందో అని చూడటానికి ఆత్రంగా జనం అంతా పోగై ఆ చోటికి వచ్చి రెడీగా ఉన్నారు..!! పెద్ద కారుని పాతిపెట్టడానికి అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి ఏర్పాట్లు పూర్తిచేశారు.</p>
<p dir="ltr">ఇంతలో అక్కడికి ఆ కోటీశ్వరుడు వచ్చాడు..!!<br>
అక్కడికి వచ్చిన ప్రజలు అతన్ని తిడుతూ కోపంగా..<br>
ఎందుకు మీరు ఈ కారుని ఇలా పాతిపెట్టి వృధా చేస్తున్నారు..? మీ మరణానంతరం ఇది మీకు ఏ విధంగా పనికి రాదు..!! దీనిని వేరోకరికైనా దీనిని ఇవ్వచ్చు కదా.. అని పదిమంది పదిరకాలుగా ప్రశ్నించారు..!!</p>
<p dir="ltr">అప్పుడు ఆ కోటీశ్వరుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు..!!<br>
"నేను నా కారుని ఇలా సమాధి చేయడానికి నేనేమి అవివేకిని కాను..!! దీని ద్వారా నేను మీకు ఒక సందేశాన్ని ఇవ్వాలని కోరుకున్నాను..!!<br>
ఈ కారు ధర కేవలం 1 మిలియన్ డాలర్.. నేను దాన్ని పాతిపెట్టే నిర్ణయం తీసుకున్నందుకు మీ అందరికి నా మీద మీకు ఇంత కోపం వచ్చింది..!! <br>
నిజమే కానీ మీరు మాత్రం వెలకట్టలేని...<br>
మీ(మన) గుండె...<br>
కళ్ళు...<br>
ఊపిరితిత్తులు..<br>
మూత్రపిండాలు..<br>
ఇలా మన శరీరంలోని ప్రతి అవయవమూ మానవ సమాజానికి ఉపయోగపడతాయి కదా..?<br>
ఈ అవయవాలన్నీ మనతోపాటే అనవసరంగా వృధాగా మట్టిలో కలిసిపోతున్నాయి కదా..?<br>
వాటి గురించి మీకు ఏ మాత్రం చింతకాని.. ఆలోచన కాని లేదు ఎందుకు..?<br>
కారు పోయినా.. డబ్బు పోయినా మళ్ళి తిరిగి వస్తుంది..!! <br>
మరి మన అవయవాలు తిరిగి వస్తాయా..?<br>
వాటికి విలువ కట్టగలమా..?<br>
మరి మనం ఎందుకు వాటిని ఒక బహుమతిగా ఇతరులకి దానం చెయ్యలేక పోతున్నాం..?<br>
కొన్ని లక్షలమంది ప్రజలు అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారు కదా..?<br>
మనం అంతా ఎందుకు వారికి సాయం చెయ్యకూడదు..?<br>
ఆలోచించండి..!!<br>
అవయవదానం చెయ్యడానికి నడుం బిగించండి..!!<br>
మీ అందరిలో అవయవదానం ప్రాముఖ్యత గ్రహించేలా చేయడానికే నేను ఈ నాటకం ఆడానని అక్కడున్నవారి జ్ఞానోదయం కలిగించాడు ఆ పెద్దమనిషి.</p>
<p dir="ltr">అవయవ దాన ప్రాముఖ్యతను అందరికి తెలియజేయండి.</p>
కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-12023029789762929962016-12-17T09:46:00.001-08:002016-12-17T09:46:03.139-08:00*మనిషి చనిపోయిన తర్వాత ఎందుకు దహనం చేస్తారో తెలుసా..?*<p dir="ltr">ప్రకృతి చాలా విచిత్రమైంది. అద్భుతమైంది కూడా. తాను తయారుచేసిన దానిని, తానే నాశనం చేసే ఆటోమేటిక్ సిస్టమ్ ను నేచర్ తయారుచేసుకుంది. మనిషి తయారుచేసినవి తప్ప, ప్రకృతి సహజసిద్ధంగా తయారుచేసే ఈ పదార్ధాన్నైనా, ఎటువంటి సంకోచం లేకుండా మళ్లీ తనలో కలిపేసుకుంటుంది. దీనికి మానవశరీరం అతీతం కాదు. ఐదు ప్రకృతి శక్తులు నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం. ఇవే భూమ్మీద ఉన్న జీవ కోటికి ఆధారం. వీటి నుంచే మానవశరీరం పురుడుపోసుకుంది. అందుకే, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన దేహాన్ని ప్రకృతిలోనే కలిపే పద్ధతే దహన సంస్కారం..!</p>
<p dir="ltr">మనం పుట్టక ముందు లోకంలో మనకు సంబంధించినవేవీ లేవు. అలాగే మనం పోయిన తర్వాత కూడా, మనకు సంబంధించినవేమీ ఈ ప్రపంచంలో మిగలకూడదు అనే కాన్సెప్టే శవదహనం. దహనం ద్వారా అతని శరీరాన్ని పూర్తిగా అంతం చేయడం దీని వెనుక అర్ధం. ప్రపంచంలో ఒక్కో నిముషానికి లెక్కలేనంత మంది పుడుతుంటారు. లెక్కలేనంత మంది పోతుంటారు. మరి శవాన్ని పూడుస్తూ వెళ్తుంటే, కొంత కాలానికి మనుషులు ఉండే చోటుకంటే, శవాలు ఉండటానికి కావాల్సిన చోటే చాలా ఎక్కువ అవసరంగా మారుతుంది. బహుశా ఈ విషయాన్ని ముందే గ్రహించారో ఏమో కానీ, ప్రాచీన భారతీయులు శరీరదహనం పద్ధతినే పాటించేవారు.</p>
<p dir="ltr">మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారీ దేవీ, కుంతీ దేవి వానప్రస్థాశ్రమానికి చేరుకున్నారు. మానవ జీవితంలో ఆఖరున వచ్చేది వానప్రస్థాశ్రమమే. ఆ ఆశ్రమ నియమం ప్రకారం దట్టమైన అడవుల్లో తపస్సు చేసుకుంటూ, కందమూలాలు తింటూ వారు బ్రతికేవారు. ఒక రోజు అడవిలో అగ్ని రాజుకుంది. శరవేగంగా మొత్తం అడవిని కబళించేస్తున్న అగ్నిని చూసి కూడా ఆ ముగ్గురూ బెదరలేదు. సంతోషంగా అగ్నికి ఆహుతైపోయారు. అయితే అంతకంటే ముందు, ధృతరాష్ట్రుడు గాంధారి, కుంతిలతో అగ్నిలో సంభవించే మరణానికి ఎంత ప్రాశస్త్యముందో, ఏ విధంగా ఉత్తమ గతులు ప్రాప్తించగలవో చెబుతాడు.</p>
<p dir="ltr">పంచభూతాల నుంచి ఏర్పడిన శరీరాన్ని, అవే పంచభూతాల్లో కలిపేయడమే దహనసంస్కారాల ఆచారం వెనుక ఉన్న ప్రధాన కారణం. ప్రాణం విడిచిన దేహాన్ని అగ్నికి ఆహుతి చేస్తారు. అలా కాలి భస్మంగా మారే పద్ధతిలో, ఆకాశంలో, గాలిలో శరీరం కలుస్తుంది. ఇక భస్మం కూడా భూమిలో మట్టిగా మారి కనుమరుగవుతుంది. ఆచారం పాటించేవారు ఆ భస్మాన్ని నీటిలో కలుపుతారు. దీంతో పంచభూతాలతో శరీరం తిరిగి ఐక్యమవుతుంది. ఇక అగ్ని, గంగానది..ఈ రెండూ ఈ లోకంలో అత్యంత పవిత్రమైనవి, పునీతమైనవి అని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ సమర్పించినవి దేవతలకు అందించేవాడు అని అగ్నికి, దేవతల దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చి పాపాలు కడుగుతుందని గంగకు పేరు. ఈ కారణం చేతనే బ్రతికినంత కాలం పాప భూయిష్టమైన మానవ శరీరాన్ని పవిత్రుడైన అగ్నికి ఆహుతిచ్చి, ఆ తర్వాత మిగిన చితాభస్మాన్ని పరమ పావని గంగలో కలిపేసి, ఆ వ్యక్తికి ఉత్తమగతులు సిద్ధించాలని ప్రార్ధిస్తారు. ఇదీ దహన సంస్కారాల వెనుక ఉన్న అసలు కారణం...</p>
<p dir="ltr">🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏</p>
కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-31482903352795928942016-12-17T09:21:00.001-08:002016-12-17T09:21:46.740-08:00ఎవరు పేదవారు - ఎవరు ధనవంతులు <p dir="ltr">ఎవరు పేదవారు???</p>
<p dir="ltr"> ⭐ ⭐ ⭐</p>
<p dir="ltr">ఒక చాలా సంపన్న మహిళ చీరల షాప్ కి వెళ్లి , "బాబూ! కొన్ని చౌకగా చీరలు చూపించండీ! నా కుమారుడి వివాహం. కట్నంగా మా ఇంట్లో పని మనిషికి ఇవ్వాల్సి ఉంది."</p>
<p dir="ltr">అలాగే అని చౌక చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి .<br>
అందులోంచి ఒక చౌక చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ సంపన్న మహిళ.</p>
<p dir="ltr">కొంత సమయం తర్వాత ఆ చీరల షాప్ కి మరొక మహిళ వచ్చి, "అన్నా! కొన్ని ఖరీదైన చీరలు చూపించు! మా యజమానురాలి కొడుకు వివాహం. ఈ సందర్భంగా మా యజమానురాలుకు కట్నం పెట్టడం కోసం నెలనెల డబ్బులు కూడబెట్టాను. ఆమెకు ఒక మంచి చీరను కట్నంగా ఇవ్వాలి.</p>
<p dir="ltr">అలాగే అని ఖరీదైన చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి .<br>
అందులోంచి ఒక ఖరీదైన చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ పేద మహిళ.</p>
<p dir="ltr">ఈ ఇద్దరు స్త్రీలలో ఎవరు పేదవారు?<br>
పేదరికం ఎక్కడ ఉంది ?<br>
మనస్సులోనా?<br>
గుణం లోనా?</p>
<p dir="ltr">సంపన్న మహిళకు ఇంట్లో పేదరికం లేకపోవచ్చు! కాని ఆమే వ్యక్తిత్వంలో పేదతనం ఉంది.</p>
<p dir="ltr">ఆ పేద మహిళకు ఇంట్లో పేదరికం ఉండోచ్చు! కాని ఆమే వ్యక్తిత్వంలో పేదతనం లేదు.</p>
<p dir="ltr">ఆ ఇద్దరు స్త్రీలను ఇల్లుతోనూ - దేనితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా నిల్చోబెడితే ఎవరు పేదవారు ???</p>
<p dir="ltr"> ⭐ ⭐ ⭐</p>
<p dir="ltr">ఎవరు ధనవంతులు ???</p>
<p dir="ltr"> 🔯 🔯 🔯</p>
<p dir="ltr">ఒకసారి, తన కుటుంబం తో ఒక మహిళ టూర్ కు వెళ్లి అక్కడ ఒక త్రీస్టార్ హోటల్ లో బస చేసింది.. ఆ మహిళ ఒక ఆరు నెలల పాపకు తల్లి.</p>
<p dir="ltr">పాప పాల కోసం ఏడుస్తుంటే ఆ మహిళ త్రీస్టార్ హోటల్ మేనేజర్ వద్దకు వెళ్లి " దయచేసి ఒక కప్పు పాలు ఇవ్వగలరా? " అని అడిగింది.</p>
<p dir="ltr">"తప్పకుండా మేడమ్" అని ఆయన బదులిచ్చారు.</p>
<p dir="ltr">" కానీ మేడమ్ మా హోటల్లో ఒక కప్పు పాలు 100 రూ॥ మేడమ్!"</p>
<p dir="ltr">"పర్వాలేదు ఇవ్వండి!" అని ఆ మహిళ పాలు తీసుకుని పాపకు త్రాగించింది.</p>
<p dir="ltr">కొంత సమయం తర్వాత వారందరు అక్కడి ప్రదేశాలను చూడడానికి కారులో బయలుదేరారు.</p>
<p dir="ltr">మధ్యలో పాప ఆకలితో పాల కోసం ఏడుస్తుంటే...</p>
<p dir="ltr">వారు ఒక రహదారి ప్రక్కన ఉన్న టీ స్టాల్ వద్ద కారును ఆపుకున్నారు. ఆ టీ విక్రేత వద్ద ఒక కప్పు పాలు తీసుకుని పాపకు పట్టింది.<br>
తరువాత "ఎంత?" అని ఆమె టీ స్టాల్ వ్యక్తిని అడిగింది.</p>
<p dir="ltr">"మేడమ్! మేము చిన్న పిల్లల పాలకు డబ్బు వసూలు చేయం" అన్నాడు టీ స్టాల్ వ్యక్తి నవ్వుతూ</p>
<p dir="ltr">ఎంత బలవంతపెట్టినా డబ్బులు తీసుకోలేదతను. అంతే కాదు ప్రయాణంలో పాపకు అవసరమౌతాయని మరో కప్పు పాలు పోసి ఇచ్చాడు.</p>
<p dir="ltr">ఆ మహిళ కారులో కుర్చున్న తరువాత ఆలోచించసాగింది.</p>
<p dir="ltr">నిజంగా ఎవరు ధనవంతులు ? త్రీస్టార్ హోటల్ నిర్వాహకుడా? లేక టీ స్టాల్ విక్రేత నా?</p>
<p dir="ltr">ధనవంతత్వం ఎక్కడ ఉంది?<br>
మనస్సులోనా?<br>
గుణం లోనా??<br>
లేక దాచుకున్న డబ్బుకట్టలు - సంపదలలోనా???</p>
<p dir="ltr">చాలా సార్లు మనమందరం డబ్బు సంపాదన యావ లో పడి మనుషుల మన్న సంగతి మర్చిపోతుంటాము.</p>
<p dir="ltr"> -</p>
కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5088878554653303355.post-55378857234960732632016-12-17T09:19:00.001-08:002016-12-17T09:19:41.098-08:00యువతకు స్వేచ్ఛ <p dir="ltr">సమయం రాత్రి 10 గంటలు !<br>
ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకుని చదువు మీద ధ్యాస పెట్టమని , ఇలాంటివి మానుకొమ్మని తల్లిదండ్రులు మందలించారు.<br>
"చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నాకు మీరు అస్సలు స్వేచ్చ ఇవ్వడం లేదు. ఎంత సేపు చదువు చదువు అని నా ప్రాణం తోడేస్తున్నారు . నేను మిత్రులతో గడపకూడదా ? సినిమాలకి షికార్ల కి వెళ్లకూడదా ? అందరు వెళ్ళడం లేదా ? మొబైల్ లో ఒక గంట సేపు మాట్లాడితే తప్పా ? ఫేస్బుక్ లో చాటింగ్ తప్పా ? " అని నిలదీసాడు కొడుకు .<br>
"సరే నీకు కావలసినంత స్వేఛ్చ ఇస్తాను. ఒక్క సారి నా మాట వింటావా ? వొచ్చే శుక్రవారం మనం ఒకసారి మన సొంత ఊరికి వెళ్లి వద్దాము . అక్కడ రెండు రోజులు ఉందాము . తిరిగి వొచ్చిన తర్వాత నీ ఇష్టం " అని తండ్రి బదులిచ్చాడు.కొడుకు సరే అన్నాడు . అనుకున్నట్టు గానే సొంత ఊరికి బయలు దేరారు.<br>
తండ్రి కొడుకుతో కలిసి వారి మామిడి తోట కి తీసుకెళ్ళి "నేను ఇక్కడే కుర్చుంటాను . ఈ తోటలో నువ్వు ఒక గంట సేపు తిరిగి రా అని బదులిచ్చాడు"కొడుకు ఒక గంట తర్వాత తిరిగొచ్చాడు.తోటలో నువ్వు ఏమి చూసావు అని ప్రశ్నించాడు తండ్రి."అన్ని చెట్లు పెద్దగా బాగానే ఉన్నాయి. కానీ ఒక చెట్టు మాత్రం పొట్టిగా, పురుగులు పట్టి, కాయలు లేకుండా ఉంది . ఆరోగ్యం గా లేదు . మిగిలిన అన్ని చెట్లు బాగున్నాయి. దీనికి కారణం ఏమిటి ? " అని అడిగాడు<br>
దానికి తండ్రి "మామిడి చెట్టు పెంచేటప్పుడు కొంత ఎత్తు పెరిగిన తర్వాత అవసరం లేని కొమ్మలను, కిందకు వేలాడే కొమ్మలను కత్తిరిస్తారు . లేదంటే ఈ వేలాడే కొమ్మలకు సూర్య రశ్మి తగలక, పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. అంతే కాకుండా పురుగులు చేరే అవకాశం కూడా ఎక్కువ . అన్ని చెట్లకి కొమ్మలు కత్తిరించాము. అందుకే అన్నీ ఆరోగ్యం గా ఉన్నాయి. కానీ ఆ చెట్టు కి కత్తిరించలేదు. మొదట నాటిన చెట్టు కదా స్వేఛ్చ గా పెరగనిద్దాము అని వదిలేసాము" అని బదులిచ్చాడు.కొడుకుకి విషయం అర్ధమయ్యింది<br>
"అనవసరంగా పెరిగే కొమ్మలు ఎలాగైతే వృక్షాన్ని నాశనం చేస్తాయో .. అదే విధంగా చదువుకునే వయసులో చేసే అనవసరమైన పనులు విద్యార్ధుల జీవితాలను నాశనం చేస్తాయి. మీ నాన్న కేవలం కొమ్మలు కత్తిరించే ప్రయత్నం చేస్తున్నాడు , చెట్టంత కొడుకు చల్లగా ఉండాలని. అంతే కానీ స్వేఛ్చని అడ్డుకోవాలని కాదు " అని భుజం మీద చెయ్యి వేసి ఇంటికి తీసుకొచ్చాడు .<br>
బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే ప్రతి తల్లి దండ్రుల మనోభావాలను ఈ యువతరం అర్ధంచేసుకోవాలని<br>
ఆశిస్తూ.............</p>
<p dir="ltr">ఈ చిన్న కథ మీ మనసుని తాకితే నలుగురితో షేర్ చేసుకోగలరు..</p>
కావలి కబుర్లు http://www.blogger.com/profile/11808734737523483981noreply@blogger.com0