Tuesday, September 1, 2020
కోతి ఉపవాసం
* కొతి ఉపవాసం *ఒక కొతి ఉన్నట్టుండి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చోని తాను పండ్ల తోటల మీద దాడి చేసి అనేక మంది రైతులను నష్ట పరచినందుకు పశ్చాత్తాపం కలిగి ఉపవాస ప్రార్థన చేసుకోవాలని ఆశ పడింది.ఉపవాసం మొదలు పెట్టాక దానికో ఆలోచనపుట్టింది. ఒక వేళ ఉపవాసానంతరం కదల్లేనంత నీరసం వస్తేప్రాణాపాయం కదా అని భయ పడి ' నాలుగు రకాల పండ్లు కోసుకొచ్చు కొని దగ్గర పెట్టుకుని ఉపవాసం కొనసాగించిందికాసేపటికి పండు నమల లేనంత నీరసం వస్తే ఎలా ? అని భయ పడి ఓ పండును నోట కరచు కొని ఉపవాసం సాగించింది .దాని పళ్ళు పండును నొక్కుకోవడం వల్ల ఊరిన ఊటను ఆవుకొ లేక ఆ పండును తినేసింది . ఒకటి ఎటూ తిన్నా ను గదా అని సమర్ధిం చుకొని ' మరొక పండును ' ఇంకొక పండును మొత్రం తినేసింది ఉపవాసం అయ్యే పోయింది.పాపం కొందరి ఉపవాసం ... ఉప్మా వాసం ! మామూలు బోజన బిల్లు కంటే పాలు పలహారాల బిల్లే ఎక్కువై పోతుందట !
మహాలయ పక్షాలు అంటే....
*మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి ?మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.2-9-2020 నుంచి 17.9.2020 వరకు మహాలయ పక్షాలు. భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.*పితృదేవతలకు.... ఆకలా...?*అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.*అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః**యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః*అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి , తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి , శుక్ల కణముగా రూపొంది , స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి , శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే... పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..*తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?*అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమి ? వారి గతి అధోగతేనా ? అంటే కాదు. అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర , సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ , శిక్షల ద్వారా కానీ , ఆత్మహత్యల ద్వారాకానీ , ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు , వరదలు)ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాల వారికి (తండ్రి , తాత , ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు , పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో , పిండప్రదానం ఇచ్చే అర్హత , అధికారం ఉంది. దీనినే *సర్వకారుణ్య తర్పణ విధి* అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి , తద్దినం , పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .... పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు.*మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?*సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ... వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి.క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి , పసుపు , కుంకుమ , గాజులు , పూవులు , చీర , పెట్టి సత్కరించి పంపాలి.చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి.ఇక ప్రమాదాలలో కానీ , ఉరిశిక్ష వల్ల కానీ , ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థినాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.
ఎలా చదివినా అవే పదాలు
మూడింటిని నిలువుగాను, అడ్డంగాను చదివి చూడండి. ఎట్లా చదివినా అవే పదాలు వస్తున్నాయి చూడండి! ఇలా మీరూ తయారు చేస్తారా మరి? మా పిల్లలకి పంపిస్తాను - మీ రాధ మండువస మ తమ జ్జి గత గ ముకం చ ముచ క్కె రము ర ళిక్షీ ర ముర వ్వ లుము లు కుకా ను పును వ్వు లుపు లు లుకా ర ముర గ డము డ తస మ తమ ర లత ల పుత మ కంమ ర్యా దకం ద కంపొ ల ముల లి తము త కధ న మున వ్య తము త కవ ర సర వి కస క లంహి మ జమ న ముజ ము నక వి తవి న లత ల కకో వె లవె న్నె లల ల నమ న సున య నంసు నం దది న మున గ రిము రి కిటో క రాక వ్వ మురా ము డుచ దు వుదు ర దవు ద కంప్ర వే శంవే ది కశం క రం
స్నేహమంటే ఇలా ఉండాలి
ఒక సెలవు రోజున సరదాగా షికారుకెళ్లిన ఇద్దరు స్నేహితులకు ఏదో విషయంపై మాట తేడా వచ్చింది. వాదన పెరిగింది. దీంతో మొదటి స్నేహితుడు, రెండోవాడ్ని చెంపపై కొట్టాడు. దెబ్బతిన్న స్నేహితుడు అక్కడే వున్న ఇసుకపై "ఈరోజు నా స్నేహితుడు నా చెంపపై కొట్టాడు'"అని రాశాడు. మరికొంత దూరం వెళ్లిన తర్వాత, ఇద్దరికీ దాహం వేసి ఓ మడుగు దగ్గర ఆగారు. చెంప దెబ్బ తిన్న వాడు ముందుగా నీళ్ల లోకి దిగాడు. అక్కడ ఊబి వుండడంతో అందులో కూరుకుపోతుండగా, మొదటి మిత్రుడు తన ప్యాంటు విప్పి, ఊబిలో కూరుకుపోతున్న స్నేహితునికి అందించి బయటికి లాగాడు.ప్రాణాపాయం నుండి బయటపడ్డ రెండో స్నేహితుడు- "ఈరోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు.." అని ఓ బండరాయిపై చెక్కాడు.మొదటి విషయాన్ని ఇసుకపై, రెండోదాన్ని రాతిపై ఎందుకు రాశావని మొదటి మిత్రుడు అడిగాడు. ఇసుక మీద రాసింది గాలి వీస్తే చెరిగిపోతుంది. స్నేహితుల పొరపాట్లు కూడా అలాంటివే. వాటిని మనసులో నిలుపుకోకూడదు. అలాగే... సహాయం చేసినపుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. అందుకే రాయిపై రాశాను. ఈ అక్షరాలు ఎప్పటికీ వుంటాయి అన్నాడట. స్నేహితుల మధ్య వచ్చే తప్పిదాలు ఇసుక మీద రాతల్లాంటివి.ఎవరు తప్పు చేసినా క్షమించి మర్చిపోవాలి. రాతిపై రాసిన రాతలా స్నేహితుడి సహాయాన్ని కలకాలం గుర్తుంచుకోవాలి. అందుకే పెద్దలు అంటారు."ఇచ్చింది మర్చిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం" అని. *స్నేహమనేది ఒకరోజు కాలక్షేపం కాదు... స్వచ్ఛమైన అనుబంధానికి చిరునామా.*
ఏదో వెలితి
చిన్నప్పటి నుంచి
ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న
స్నేహితులంతా ఓ చోట కలిశారు👩👩👧👧
అందరికీ వేలల్లో జీతం వస్తోంది ...
బాగా సెటిల్ అయ్యారు
కానీ జీవితంలో ఏదో మిస్ అవుతున్నామనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది🧎
ఇదే విషయం గురించి చర్చించారు...
కానీ ఏదో మిస్ అవుతున్నామని
అందరూ ఒప్పుకున్నారు.....!🤔
మాటల్లో మాటగా ఎవరో చిన్నప్పుడు వాళ్లకు పాఠం చెప్పిన ఓ మాస్టారూని గుర్తుచేశారు😍
ఆ మాస్టారూ పేరు
గుర్తుకు రాగానే అందరి మోహాల్లో
ఒక సంతోషం...!😍
ఎప్పుడూ సంతోషంగా ఉండే
ఆ మాస్టారూ అంటే అందరికీ
ఎంతో ఇష్టం....
అతనొక స్పూర్తి !
అంతా ఒక అండస్టాండింగ్కు వచ్చారు...
ఆ మాస్టారూ ఎప్పుడూ
అంత ఆనందంగా ఎలా ఉండేవాడో కనుక్కుందామని ఆయన
దగ్గరకు బయలు దేరారు....!🏃🏿♂️🏃🏿🏃♀️
ఆ మాస్టారూ దగ్గరకు వెళ్ళి, తామిప్పుడు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారో అందరూ గొప్పగా చెప్పుకున్నారు..!💃🏿🕺
ఆయన చెప్పిన పాఠాల మూలంగానే
ఇంత గొప్పవాళ్లమయ్యామని గుర్తుచేశారు...!
పనిలోపనిగా ఇప్పుడు జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు,
సవాళ్లను కూడా ఏకరువూ పెట్టారు.🤦🏿♂️
ఎంతెంతో పెద్ద పెద్ద హోదాలో వున్నా..
.వేలకు వేల జీతాలు సంపాధిస్తున్నా ఏదో అశాంతికి గురవుతున్నామని చెప్పుకున్నారు.....!🤦🏾
ఇదంతా విన్న ఆ గురువు
కాసేపు కూర్చోండని చెప్పి లోపలికెళ్ళాడు.
కొద్ది సేపటికి గురువుగారి భార్య
వంటగదిలో నుండి వేడి వేడి టీ ని ఓ కేటిల్లో తీసుకుని వచ్చింది.
ఓ ప్లేట్లో రకరకాల కప్పులను
(పింగాణి, స్టీల్, మట్టి, రకరకాల పూలతో ఆకర్షణీయంగా డిజైన్ చేసినవి) తీసుకొచ్చి, వారి ముందుపెట్టి టీ తాగమని చెప్పి లోపలికెళ్ళింది.💁♂️
వాళ్లంతా మోహమాట పడుతూనే....తమకు నచ్చిన కప్పును తీసుకొని టీ తాగడం మొదలెట్టారు...!💪💪
వాళ్లంతా టీ తాగడం అయిపోగానే ఆ మాస్టారూ వాళ్లందరిని ఉద్దేశించి..😚
‘‘మీరంతా గమనించారా...
టీ మీ ముందుకు రాగానే , ఏ కప్పు తీసుకోవాలని కాసేపు అలోచించి మీరంతా మీకు నచ్చిన కప్పును ఎన్నుకుని టీ తాగారు..ఫలితం...
ఇక్కడున్న వాటిలో normal కప్పులే మిగిలిపోయాయి....!😩😩😩
అందరూ *తాగే టీ
ఒకటేఅయినా... తాగుతూ..
ఇతరుల టీ కప్పు,
దాని డిజైన్ తమ కప్పు కంటే ఎంత బాగున్నాయే అని మధన పడుతూ తాగుతున్నారు ...*
ఫలితం...తాగే
* "టీ"ని అస్వాధించడం" మరిచిపోయారు.*.🏃♀️🏃♀️🏃♀️
అదే సకల సమస్యలకు మూలం....🙏🙏
ఈ ప్రపంచంలో మనకు ఆకర్షణీయంగా చాలా కనిపిస్తుంటాయి...
వాటి వెంట పరిగెడితే ఇక అంతే...! 🏃🏿🏃🏿
*మీరంతా అదే పొరపాటు చేస్తున్నారు...!*
ఎదుటి వాళ్లు ఎంత సంపాదిస్తున్నారో,
ఎంత రిచ్గా ఉన్నారో...
ఏ హోదాలో ఉన్నారో,
ఏం కొంటున్నారో
అని పొల్చుకొని...
మధన పడుతూ...
వాళ్లలా ఉండటానికి ప్రయత్నిస్తూ
మీ ఇష్టాఇష్టాలను,
మీ అభిరుచులను
అన్నీ అన్నీ మర్చిపోతున్నారు...
మీ జీవితం టీ అయితే.....
మీ ఉద్యోగం, డబ్బు, పరపతి అన్నీ కూడా
టీ కప్పులాంటివి...no limit for them.
కప్పు మీ జీవితాన్ని శాసించనీయకండి...కప్పులోని టీ ని ఆస్వాధించటం నేర్చుకొండి. అప్పుడే "ఆనందంగా" ఉంటారు.
అదే జీవిత సత్యం...
Subscribe to:
Posts (Atom)