Tuesday, December 27, 2016

రైతులకు భరోసా నిధి ఎందుకు లేదు

✍🏻 *రైతుల భరోసా నిధి ఎందుకు లేదు ?.విపత్తులకు నష్ట పరిహారం అందక ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగుతున్న రైతన్న ప్రభుత్వాలు మారినా మారని రైతుల దుస్థితి*
✍🏻భారత దేశం రైతు బాంధవ దేశం
*జై కిసాన్ అని* అన్నారు. వరదలు తుఫానులు, నకిలీ విత్తనాలు, డేట్ అయ్యిన ఎరువులు, పురుగు మందులు, సొకిన వైరస్ లు ,అధిక వ్యయం,సరైన మద్దతు ధర లేక ,గిట్టు బాటు ధర లేక చేసిన అప్పులు తీర్చ లేక పిల్లల్ని చదివించలేక పెళ్లిళ్లు చేయలేక ఏడాదికి సుమారు 20 వేల చని పోతున్నారు.
✍🏻ప్రాధమిక రంగం అని 70%మంది ప్రజలు వ్యవసాయం మీదే ఆధార పడినా దానికి ఒక ప్రత్యేక బడ్జెట్ లేక పోవడం పాలకుల చేతగాని తనమే .
✍🏻విదేశాలలో ఏ రంగం అభివృద్ధి చెందుతుందో దానికి మరిన్ని రాయితీలు యిచ్చి ముందుకు నడిపిస్తారు.కానీ దేశం రవాణా ,ఆదాయం ,కార్మికులు,రాబడి, తిండి అన్ని ఒకే రంగం మీద ఉన్నా నిధులు సూన్యం
✍🏻మన రాష్ట్రము లో 5సంవత్సరములలో హెలిన్ ,ఫైలిన్ ,నీలం ,హుద్ హుద్, కెంప్ లాంటి బారి తుపాన్ లు వచ్చినా కేంద్ర సహాయం అని కూర్చున్నాము తప్ప రైతుకు ఇచ్చింది సూన్యం రికార్డ్స్ లో ఇస్తున్నాము అని ప్రచారం .
✍🏻సెపరేట్ బడ్జెట్ పెట్టి నిధులు ఎందుకు ఇవ్వడం లేదు. ఆర్ధిక బడ్జెట్ కాకుండా రైతు భరోసా నిధి అని కేంద్ర ఆగంతుక నిధిని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు.
✍🏻విపత్తు నిర్వహణ అధికారులు రైతు పేరిట చేతి వాటం  చూపించి కోట్లు సంపాదించారు.ఇప్పటికి నష్ట పరిహారం అందక తుపాను బాధితులు ఉన్నారు రికార్డ్స్ లో ఇచ్చామని బాధితుల సొమ్ము తిన్నారు.
✍🏻రైతు భరోసా నిధి ఏర్పాటు చేయాలి ప్రత్యేక బడ్జెట్ ఉండాలి. నష్ట అంచనా అనుభవం ఉన్న టీం చేత చేయించాలి.
✍🏻నష్ట నివారణ చేసిన్నప్పుడు అధికార బలం చూపి దొంగ లెక్కలు చూపించే అధికారుల్ని తొలగించాలి.
✍🏻నష్ట పరిహారం రైతు అకౌంట్స్ లోకి మాత్రమే జమ చేయాలి.అనుభవం ఉన్న వ్యవసాయ నిపుణులు చేత అంత రించి పోతున్న వైరస్ సోకుతున్న పంటలకు మార్గదర్శికాలు వెతకాలి .
✍🏻నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మితే చట్టం చేసి కఠినంగా శిక్షించాలి. గవెర్నమెంట్ అనుబంధ సంస్థల్లో మాత్రమే అమ్మే ఏర్పాటు చేయాలి. దీని వలన ఉద్యోగాల సృష్టి జరిగి ఉపాధి పెరుగుతుంది
✍🏻గిట్టు బాటు ధర మద్దతు ధర పంట వేయక ముందే ప్రకటించి ,ప్రతి మండలానికి ఓక రైతుమార్కెట్స్ పెట్టి షెడ్లు నిర్మించాలి.
✍🏻వరదలు సంభవించే నది పరివాహక ప్రాంతాల్లో ఆయకట్లు బలం గా తయారు  చేయాలి. నివారణ కొరకు మాoగ్రు పంటలు ఏర్పాటు చేయాలి.
✍🏻రైతు ఆత్మహత్యలు నివారించి నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
✍🏻ఆదునిక ప్రపంపంచం లో ఇప్పటికైనా రైతుని అడుకోకపోతే పంటలు కొరత వచ్చి పండించే నాధుడే లేకుండా పోతాడు.
✍🏻విపత్తులు వచ్చినప్పుడు కంటి తుడుపు చర్యలు చేసి చేతులు దులుపుకుని మీడియా ముందు సొల్లు చెప్పి *అబద్ధపు హామీలు ఇచ్చి*రైతు నడ్డివిరిచే నాయకులకు తగిన శాస్తి తప్పదు

No comments:

Post a Comment