Tuesday, July 22, 2025

తిరుమల ధర్మకర్తల మండలి నిర్ణయాలు

తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తీసుకున్న నిర్ణ‌యాలు.......    

• తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా వైకుంఠం క్యూ  కాంప్లెక్స్ -3 నిర్మించేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయం.

• తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో అన్ని వసతులతో విశ్రాంతి కేంద్రాలు (లాంజ్ లు) ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని నిర్ణయం.

• అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా మౌలిక వసతులు, లైటింగ్, భద్రత, ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతవరణం పెంపొందించేందుకు నిర్ణయం.

• తిరుమలలోని శిలాతోరణం, చక్రతీర్థం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ మరియు డీపీఆర్ రూపొందించాలని నిర్ణయం.

• ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల   మేరకు శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు, వివిధ దేశాల్లో       శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నిపుణుల కమిటీ నివేదిక                       సమర్పించింది. దీనిపై టీటీడీ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి సదరు కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని        నిర్ణయం.

• శ్రీవారిసేవను మరింత విస్తృత పరిచి భక్తులకు స్వచ్ఛంద సేవను   మరింత పటిష్టంగా అమలు చేసేందుకు 4 కోఆర్డినేటర్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపాదికన భర్తీ చేసేందుకు ఆమోదం.

• శ్రీవారి భక్తులు సైబర్ మోసాలకు గురికాకుండా నియంత్రించేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదం.

• తిరుమలలోని కళ్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పించేందుకు మరింత మెరుగైన సౌకర్యాలతో పాటు పారిశుద్ధ్యం, భద్రతను పెంపొందించేందుకు నిపుణులను సంప్రదించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయం.

• తిరుమలలో పరిపాలన సౌలభ్యం కోసం అన్ని విభాగాలు ఒకచోట కేంద్రీకృతమయ్యేలా నూతన పరిపాలన భవనం నిర్మాణానికి ఆమోదం. అదేవిధంగా తిరుమలలో పాత బడిన హెచ్వీడీసీలోని ఆరు బ్లాకులు, బాలాజీ విశ్రాంతి గృహం, ఆంప్రో గెస్ట్ హౌస్,  అన్నపూర్ణ క్యాంటీన్, కళ్యాణి సత్రాలను ఐఐటీ నిపుణుల సూచన మేరకు తొలగించాలని నిర్ణయం.

• పదకవితా పితామహుడు అన్నమయ్య జన్మించిన తాళ్లపాకలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం నిపుణులతో కార్యాచరణ ప్రణాళిక రూపొందిచాలని నిర్ణయం.

• సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా నిర్మించిన 320 ఆలయాలకు రూ.79.82 లక్షలతో మైక్ సెట్లను ఉచితంగా అందించాలని నిర్ణయం. ఒక్కొక్క మైక్ సెట్ ఖర్చు   రూ.25 వేలు.

• వేద ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా నిరుద్యోగులైన వేద పారాయణదారులకు  దేవదాయశాఖ ద్వారా  నిరుద్యోగ భృతిని  చెల్లించేందుకు రూ.2.16 కోట్ల టీటీడీ నిధులు మంజూరుకు ఆమోదం.

• రాష్ట్ర దేవాదాయశాఖ సూచనల మేరకు శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించే శ్రీవారి ఆలయాలు,  భజన మందిరాలకు నిధులు చెల్లించేందుకు మూడు కేటగిరీలుగా విభజన. మూడు కేటగిరీల్లో రూ.10 లక్షలు, రూ.15 లక్షలు,  రూ.20 లక్షలుగా   నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటి వరకు ఒకే కేటగిరీ కింద రూ.10 లక్షలు చెల్లించే విధానంలో మార్పు.

• ఏపీ హైకోర్టు తీర్పు మేరకు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పని చేస్తున్న 142 మందిని క్రమబద్ధీకరించేందుకు ఆమోదిస్తూ ప్రభుత్వ ఆమోదానికి పంపాలని నిర్ణయం.

        ఈ స‌మావేశంలో అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌య్య చౌద‌రి, పలువురు బోర్డు స‌భ్యులు, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం పాల్గొన్నారు.

#TTD #TTDBoardMeeting #tirupatibalaji #TirumalaTirupatiDevasthanam #tirumala

Monday, July 14, 2025

ఆ ఊళ్ళో ఏ ఇంటికీ రెండో అంతస్తు ఉండదు

ఆ ఊళ్ళో ఏ ఇంటికీ రెండో అంతస్తు ఉండదు 

ప్రకాశం జిల్లా లోని పాత సింగరాయకొండ.. ఈ ఊళ్ళో పురాతన నరసింహ స్వామి గుడి ఉంది. ఆ గుడి కంటే తమ ఇళ్ళు ఎత్తుగా ఉండకూడదు అనేది ఆ గ్రామస్తుల సంప్రదాయం. అందుకే ఆ ఊళ్ళో ఏ ఇంటికీ రెండో అంతస్తు ఉండదు. ఇదో వింత సంప్రదాయం. ఎవరికీ ఇబ్బంది లేని ఆచారం కాబట్టి.. నాకూ నో ప్రాబ్లమ్ 🙂. సింగరాయకొండ రైల్వే స్టేషన్ కు మూడు కిలోమీటర్ల దూరం లో ఉంటుంది ఈ గ్రామం.

మైండ్ బ్లాంక్ కేసు

మైండ్ బ్లాంక్ కేసు.. 17 ఏళ్ల కొడుకుతో లేచిపోయిన సవతి తల్లి.. తర్వాత పెళ్లి!

ఈ సమాజం ఎటు పోతోంది? మనుషులు ఎందుకు ఇలా తయారవుతున్నారు? వావీ వరసలు ఎందుకు గాలికొదిలేస్తున్నారు? మన భారతీయ సంప్రదాయాలు ఏమైపోతున్నాయి? విలువలు.. వలువలు ఎందుకైపోతున్నాయి? ఇలాంటి ప్రశ్నలన్నీ ఈ స్టోరీ చదివాక మీకు అనిపిస్తే, ఆశ్చర్యం అక్కర్లేదు.

ఈ కేసు.. హర్యానాకి చెందినది. అక్కడ నుహ్ జిల్లాలో.. రామ్ కిషన్ అనే పెద్దాయన.. హడావుడిగా పోలీస్ స్టేషన్‌కి వచ్చి.. విషయం చెప్పాడు. పోలీసులు షాక్ అయ్యారు. అన్ని పనులూ ఆపేసి.. అతనివైపు ఆశ్చర్యంగా చూశారు. "నిజమా" అని అడిగితే.. నిజం సార్.. అంటూ.. లబోదిబోమన్నాడు ఆయన. ఇదేదో క్యూరియస్ కేసులా ఉంది అనుకున్న పోలీసులు.. కాస్త వివరంగా చెప్పండి అన్నారు.. అప్పుడు అతను ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాడు.
రామ్ కిషన్ మొదటి భార్య చనిపోయింది. ఆ తర్వాత గురుగ్రామ్ లోని సోహ్నా ఏరియాకి చెందిన మోనిక అనే మహిళను పెళ్లిచేసుకున్నాడు. ఐతే.. మొదటి భార్యకు ఒక కొడుకు ఉన్నాడు. అతనికి 17 ఏళ్లు. అతను కూడా అదే ఇంట్లో తండ్రితో ఉంటున్నాడు. అతనికి మోనిక సవతి తల్లిలా ఇంట్లోకి ఎంటరైంది. ఆ కుర్రాడు ఆమెతో చాలా గౌరవంగా, పద్ధతిగా ఉండసాగాడు. అది చూసి రామ్ కిషన్ ఆనందించాడు. రెండో భార్య.. తన కొడుక్కి సవతి తల్లిలా కాకుండా.. దాదాపు తల్లిలాగే ఉంటోంది అని సంతోషించాడు.

ఆ కుర్రాడు ఆమెను.. అమ్మా అని పిలిచేవాడు. ఎప్పుడైనా ఆమెకు ఒంట్లో నలతగా ఉంటే.. ఇంటి పనులు కూడా చేసి పెట్టేవాడు. అది చూసి.. తన కొడుకు చాలా మంచివాడనీ, సవతి తల్లికి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్నాడని ఆనందపడ్డాడు. ఇలా నెలలు గడుస్తుండగా.. ఓ రోజు వాళ్లిద్దరూ ఇంట్లో కనిపించలేదు. ఆమెకీ, కొడుక్కీ కాల్ చేస్తే.. స్పందన లేదు. రామ్ కిషన్‌కి మతిపోయింది. ఆ తర్వాత ఊళ్లో ఎవరో.. నీ భార్యా, కొడుకూ.. బస్సెక్కుతుండగా చూశానని ఎవరో చెప్పారు. దాంతో.. ఏమైందో అర్థం కాక.. రామ్ కిషన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్లు.. మొబైల్ IMEI నంబర్ ఆధారంగా.. ఆ ఇద్దరూ ఎక్కడున్నారో కనిపెట్టారు.

పోలీసులు వాళ్లను కనిపెట్టి.. వివరాలు అడిగితే.. తాము కోర్టు మ్యారేజ్ చేసుకున్నామని వాళ్లు తెలిపారు. ఇద్దరి వయసు ఎంత అని అడిగితే.. మోనిక తనకు 40 ఏళ్లనీ, ఆ అబ్బాయికి 21 ఏళ్లనీ చెప్పింది. తామిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని చెప్పింది. దాంతో పోలీసులు వాళ్లను వదిలేశారు. తర్వాత రామ్ కిషన్‌కి కాల్ చేసి.. వాళ్లు కోర్టు మ్యారేజ్ చేసుకున్నారనీ, తాము చేసేదేమీ లేదని చెప్పేశారు. దాంతో.. రామ్ కిషన్‌కి మతి పోయింది. అప్పుడు అతను.. కొన్ని నెలలుగా ఏం జరుగుతోందో ఆలోచించాడు.
మోనిక ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి భర్తతో కంటే.. కొడుకుతో ఎక్కువ చనువుగా ఉంటోంది. తరచూ ఆ కొడుకుతో తన కాళ్లు నొక్కించుకునేది. అతనితో చాలా సరదాగా ఉండేది. అవన్నీ చూసి.. తల్లి, కొడుకుల బంధం అనుకున్నాడు. కానీ.. అది వివాహేతర సంబంధం అని అతనికి ఇప్పుడు అర్థమైంది. మతిపోయింది. ఏం చెయ్యాలో తెలియక, పోలీసులు కూడా సహకరించట్లేదని లబోదిబోమంటున్నాడు.

తిరుమల శ్రీవారి ఆలయం చేరుకోవడానికి 8 మార్గాలు

*తిరుమలకు ఉన్న ఎనిమిది వాడుకదారులు ఏవి?శ్రీవారి ఆలయానికి చేరుకోవాటానికి మొత్తం 8దారులు ఉన్నాయి.

*1. ఆదిపడి లేదా అలిపిరి. క్రీ.శ.1387లో మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లు నిర్మించారు. క్రీ.శ.1550లో విజయనగర సామంతులు అలిపిరి, గాలిగోపరం మార్గం నిర్మించారు. మొదటి నుండి అలిపిరి దారే ప్రధాన దారిగా గుర్తింపు పొందింది. ఆదిపడి కాలక్రమంలో అలిపిరి అయింది. ఆదిపడి అంటే మొదటి మెట్టు అని అర్థం. ఈమార్గంలో తిరుమల చేరుకోవాలంటే పన్నెండు కిలోమీటర్ల (12) నడవాలి. అలిపిరి మార్గంలో మొత్తం 3550 మెట్టు ఉన్నాయి. సుమారు మూడు నుండి నాలుగు గంటలలో కొండను చేరుకోంటారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున జనం వినియోగిస్తున్న దారి ఇదే _____.

*2. శ్రీవారిమెట్టు. తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో శ్రీనివాసమంగాపురం ఉంది. అక్కడి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. ఈ దారి నుండి మూడు కిలోమీటర్లు నడిస్తే తిరుమల వస్తుంది. ఈ మెట్టు దారిన నడిస్తే ఒక గంటలో తిరుమల చేరుకోవచ్చు _____.

*3. మామండూరు అడవి. ఒకప్పుడు బాగా రద్దీగా ఉండే నడకదారి మామండూరుదారి. పూర్వం కడప, రాజంపేట కోడూరుల మీదుగా వచ్చే భక్తులకు మామండూరు దారి ఎంతో అనుకూలంగా ఉండేది. మామండూరు నుండి బయలుదేరితే ఉత్తరాన కరివేపాకు కోన వస్తుంది. ఆతర్వాత పాలసత్రం వస్తుంది. ఇంకొంచెం దూరం పోతే ఈతకాయల మండపం తర్వాత పడమర వైపు కొంత దూరం వెళ్తే తిరిరుమలలోని గోగర్భడ్యాం వస్తుంది. తిరుమల నుండి మామండూరు వెళ్ళే నడక మార్గంలో పాలసత్రం నుండి దక్షిణ వైపు వెళ్లే కాకుల కొండ వస్తుంది. ఈకాకుల కొండ మీదగా వెళ్తే మామండూరు చేరు కోవచ్చు. ఇప్పటికి అప్పుడప్పుడు రాజంపేట ప్రాంతవాసులు ఈ దారిలో తిరుమల చేరుకుంటారు ______________.*

*4. కుక్కలదొడ్డి నుంచి తుంబుర తీర్థం, పాపవినాశనం మీదుగా కడప జిల్లా సరిహద్దులోని చిత్తూరు జిల్లాకు చెందిన కుక్కలదొడ్డి నుండి తుంబురుతీర్థం నుండి పాపవినాశానానికి అక్కడ నుండి తిరుమలకు దారి వుంది. దీన్ని తుంబుర తీర్థం అంటారు. పాపవినాశనం నుండి తుంబురతీర్థానికి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. పాపవినాశనం నుండి తిరుమలకు సులభంగా రోడ్డు మార్గాన చేరుకోవచ్చు _________.*

*5. కళ్యాణిడ్యామ్. కళ్యాణిడ్యామ్ కి అనుకున్ని ఉన్న శ్యామలకోన దారిలో పదిహేను కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే తిరుమల నారాయణగిరి వస్తుంది. అదే దారిలో ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణిస్తే ఒకగంటలో భక్తులు తిరుమల చేరుకోవచ్చు ______.*

*6. రేణిగుంట నుంచి అవ్వచారికోన దారి. ఈ అవ్వాచారి కొండ మొదటి ఘాట్ రోడ్డులో అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం ఉంది. రేణిగుంట సమీపంలో తిరుపతి కడప రహదారిలో ఆంజనేయపురం ఉంది. ఇక్కడ నుండి అవ్వాచారి కోన అడుగు భాగంలో నడిచి పడమర వైపుకి వెళ్తే మోకాళ్ళ పర్వతం వస్తుంది. ఇక్కడే రామానుజాచార్యుల వారి ఆలయం ఉంది. మోకాళ్ళమిట్ట చేరుకున్నాక పక్కనే సారే పెట్టెలను చూడోచ్చు. అక్కడ నుంచి ముందుకు వెళితే లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వస్తుంది. మెట్టు దిగుతూనే అవ్వాచారి ఆలయం వస్తుంది. అటునుండి నడుచుకుంటూ అనేక మండపాల గుండా వెళ్తే తిరుమల శ్రీవారి ఆలయం వస్తుంది ____________.*

*7. ఏనుగుల దారి. ఇవేకాక ఏనుగుల దారి కూడా ఒకటి ఉంది. చంద్రగిరి ప్రక్కన ఉండే శ్రీవారిమెట్టు మార్గం నుండి అవ్వాచారికోన వరకూ ఒకదారి ఉండేది ఒకప్పుడు. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు రాతి స్తంభాలను ఈ దారి నుండే ఏనుగుల ద్వారా చేరవేసేవారు. కాబట్టి దీనికి ఏనుగుల దారి అనే పేరు వచ్చిందంటారు. ఇప్పుడు ఈ దారిని ఎర్రచందనం స్మగ్లర్లు వాడుతున్నారు ___________.*

*8. తలకోన నుంచి. తలకోననుంచి కూడా తిరుమలకు మరో దారుంది. ఈ దారి తలకోన జలపాతం దగ్గర నుండి జండాపేటు దారిలో వస్తే తిరుమల వస్తుంది. ఈ దారి పొడవు దాదాపు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది. అప్పటో శ్రీకాళహస్తి నుండి కరకంబాడి, చెన్నాయిగుంట, మంగళం, అక్కారంపల్లి, కపిలతీర్థం వరకు ఒక మార్గం ఉండేది. అదే విధంగా శ్రీకాళహస్తి నుండి తొండమానుడు, గుడిమల్లం, నీలిసాని పేట, గాజులమండ్యం, కొల్లూరు, అత్తూరు, పుత్తూరుల గుండా నారాయణవరం, నాగాలపురానికి మరోకదారి వుండేది. ఆరోజుల్లో తిరుపతి తొండమండలంలో ఒక భాగం. నారాయణవరం ఆకాశరాజు కాలంలో రాజధాని. ఇక్కడే కళ్యాణ వేంకటేశ్వరుని గుడి ఉంది. _________

ఏడు కొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద _______________ 🙏🏻🙏🏻🙏🏻

Saturday, July 12, 2025

ఏమైనా కావచ్చు

చిక్కుతున్నా! చెలరేగుతున్నా!!

ఊహైనా కావచ్చు
ఉద్రేకమైనా కావచ్చు
ఉల్లాన్ని ఊపుతుంది
ఉత్సాహాన్ని కలిగిస్తుంది

శబ్దమైనా కావచ్చు
దృశ్యమైనా కావచ్చు
నన్ను ముట్టుతుంది
మేల్కొలుపు పాడుతుంది

అక్షరమైనా కావచ్చు
పదమైనా కావచ్చు
నన్ను తట్టుతుంది
నిద్ర లేపుతుంది

అందమైనా కావచ్చు
ఆనందమైనా కావచ్చు
నన్ను ఆకర్షిస్తుంది
అంతరంగాన్ని అలరిస్తుంది

పువ్వైనా కావచ్చు
నవ్వైనా కావచ్చు
నన్ను రెచ్చకొడుతుంది
కవనరంగంలోకి దింపుతుంది

వెన్నెలైనా కావచ్చు
సౌరభమైనా కావచ్చు
నన్ను కట్టేస్తుంది
మదిని దోచేస్తుంది

కలమైనా కావచ్చు
కాగితమైనా కావచ్చు
కవితలు రాయమంటుంది
కవనజగాన్ని రంజింపజేయమంటుంది

భావమైనా కావచ్చు
విషయమైనా కావచ్చు
నాలో పుడుతుంది
నన్ను ఉసిగొల్పుతుంది

ప్రేమైనా కావచ్చు
ప్రేరణైనా కావచ్చు
నన్ను ఆవహిస్తుంది
మనసుకు పనిపెడుతుంది

రక్తైనా కావచ్చు
భక్తైనా కావచ్చు
నన్ను వశపరచుకుంటుంది
కవనాలలోకి కాలుపెట్టిస్తుంది

బాగుండేలా భ్రమలుకొలుపుతున్నా
స్పందించేలా మదులుతాకుతున్నా 
పత్రికలు ప్రచురిస్తున్నాయి
ప్రాచుర్యం కలిపిస్తున్నాయి

నచ్చేమాటలజాడలో పయనిస్తున్నా
మెచ్చేరీతిలో పలువురినిపట్టేస్తున్నా 
పాఠకులు పరవశిస్తున్నారు
ప్రతిస్పందనలు గుప్పిస్తున్నారు

ప్రోత్సహించేవారి గుండెలు 
ఉప్పొంగిస్తున్నా
ముచ్చటించేవారి మదులు
ఉజ్వలింపజేస్తున్నా

వెన్నుతట్టేవారికి
విందునిస్తున్నా
అండగానిలిచేవారికి
పసందులందిస్తున్నా

గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Friday, July 11, 2025

కుంకుమ - కుంకుమ పువ్వు ఒకటి కాదు

🙏🌺కుంకుమ. ... కుంకుమపువ్వు ఒకటికావు . కుంకుమపువ్వు ఒక సుగందద్రవ్యము . కుంకుమ... బొట్తుపెట్టుకోవడానికి వాడే రంగు పదార్ధము . 🌺🙏

🌺స్వచ్ఛమైన కుంకుమను తయారుచేయడానికి పసుపు, పటిక మరియు 

నిమ్మరసం వాడతారు. 

ఆ కుంకుమ తయారి గురించి. 🌺

🌺కావలిసిన పదార్థాలు :

10 కిలోలు , పసుపుకొమ్ములు ,

1 కిలో పటిక ,

1 కిలో ఎలిగారం ,

400 నిమ్మకాయలు ,

1/2 కిలో నువ్వుల నూనె . 🌺

🌺ముందుగా నిమ్మకాయలను రసము తీసుకొని , ప్లాస్టిక్ బకెట్ లో పోసుకోవాలి . 

పటిక , ఎలిగారం ను కచ్చాపచ్చాగా దంచి , ఆ రసములో ,కరిగి పోయేటట్లుగా కలపాలి . తరువాత పసుపు కొమ్ములు వేసి బాగాకలిపి ఒక రోజు వుంచాలి . 

మరునాడు వాటిని , ఇంకో ప్లాస్టిక్ బకెట్లోకి పూర్తిగా వంచేయాలి . ఆ విధముగా , నిమ్మరసము , పసుపు కొమ్ములకు పూర్తిగా పట్టేవరకు ,ప్రతిరోజూ ఒక బకెట్ లో నుండి , ఇంకో బకెట్ లో కి గుమ్మరించాలి ........ఇలా మార్చటము వలన పసుపు కొమ్ములకు నిమ్మరసము చక్కగా అంటుతుందన్నమాట. 🌺

🌺పసుపుకొమ్ములకు నిమ్మరసము పూర్తిగా పట్టిన తరువాత , అంటే ,ఈ సారి బకెట్ వంచుతే ,ఒక్క చుక్క కూడ నిమ్మరసము , పడకూడదన్నమాట , ఎవరూ తిరగని చోట , దుమ్మూ ధూళీ పడని చోట , నీడలో నేల శుభ్రముగా తుడిచి , చాప వేసి , దానిమీద , శుబ్రమైన బట్టను పరిచి , ఈ పసుపు కొమ్ములను ఎండపెట్టాలి . నీడలోనే సుమా ! 

అవి పూర్తిగా ఎండిన తరువాత , రోటిలో వేసి దంచాలి . ఆ పొడిని , తెల్లటి , పలచటి బట్టలో వేసి , జల్లించాలి . తరువాత ఆ పొడిలో కొద్ది కొద్దిగా నూనె వేస్తూ కలపాలి. 

నూనె తో కలపటము వలన , కుంకుమ నుదుటి మీద నిలుస్తుంది . లేకపోతే పెట్టుకోగానే రాలిపోతుంది . సరిపడా నూనె కలిపాక , సువాసన కొరకు ,కొద్దిగా రోజ్ వాటర్ కాని , ఉడుకులోన్ కాని కలపాలి . ఈ కుంకుమ మంచి ఎరుపురంగు లో వుంటుంది . ( సింధూరం రంగు కాదు , ఎరుపు ) .

ఎవరైనా ప్రయత్నము చేయాలంటే 100 గ్రాముల పసుపు కొమ్ములతో , మిగితావి ఆ కొలతకు సరిపడా తీసుకొని చేసుకోవచ్చు. పటిక , ఎలిగారము , కిరాణాదుకాణాలలో దొరుకుతాయి . చక్కని సువాసన తో ఈ కుంకుమ చాలా బాగుంటుంది . 

పసుపు కొమ్ములలో , కుంకుమ రాళ్ళు వేసి , దంచి , తెల్లనిబట్టతో జల్లించి , నూనె కలుపుకొని , తోపురంగు కుంకుమ ( మెరూన్ కలర్ ) తయారు చేసుకోవచ్చు . 🌺

🌺కుంకుమరాళ్ళు , పటికలాగా వుంటాయి . తొందరగానే నలుగుతాయి .కుంకుమ రాళ్ళు కూడా కిరాణా దుకాణాలలో దొరుకుతాయి . బజారులో దొరికే కుంకుమ ఇదే . 🌺
#శ్రీమహాలక్ష్మి 
#ఓంనమోనారాయణా 
#ఓంనమఃశివాయ

Wednesday, July 9, 2025

RAIL ONE APP వివరాలు

RAILONE APP వివరాలు !!:
 
రైల్వే ప్రయాణీకులు తమ టిక్కెట్లు రిజర్వేషన్ కోసం IRCTC మొబైల్ ఆప్, సాధారణ టికెట్స్ కొనడానికి UTS  మొబైల్ అప్ అలాగే ఫిర్యాదులు చేయడానికి RAILMADAD ఆప్ అలాగే ట్రైన్ ట్రాకింగ్ లేదా రన్నింగ్ స్టేటస్ తెలుసుకోడానికి వేరే ఆప్స్ ఉపయోగిస్తున్నారు.

అయితే పలు రైల్వే సేవల కోసం వివిధ మొబైల్ అప్స్ ఉపయోగించడం లో ఉన్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ అందించే అన్ని రైల్వే సేవలకు కలిపి ఒక మొబైల్ ఆప్ విడుదల చేసారు.

 *దాని పేరు 'RAIL ONE'*. 

దీనిని ఈ రోజు నుండి గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చును. గతంలో ఉన్న IRCTC యూజర్ ID పాస్ వర్డ్ తో లాగ్ ఇన్ కావచ్చు.

ఈ 'రైల్ వన్' ఆప్ విశేషాలు చూద్దాం.

1.ఈ యాప్ ద్వారా  రిజర్వ్‌డ్ లేదా అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లను బుక్ చేయండి.

2.*మై బుకింగ్స్*: ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు బుక్ చేసిన మరియు రద్దు చేయబడిన టిక్కెట్ల (అన్‌రిజర్వ్‌డ్ మరియు రిజర్వ్‌డ్) వివరాలు తెలుసుకోవచ్చు.

3.*ప్రొఫైల్*: ప్రొఫైల్ వివరాలను చూడటానికి అవసరమైతే సవరించడం చేసుకోవచ్చు. 

4.*రియల్-టైమ్ రైలు ట్రాకింగ్*: ఆలస్యం, రాక సమయం మరియు ఇతర కీలక సమాచారంతో రియల్-టైమ్‌లో మన రైలును ట్రాక్ చేయవచ్చు.

5.*కోచ్ పొజిషన్ ఫైండర్*: మీ కోచ్‌ ప్లాట్‌ఫారమ్‌పై ఎక్కడ అగుతుందో సులభంగా గుర్తించవచ్చు

6.ప్రయాణంలో స్విగ్గీ జామాటో వంటి ద్వారా ఆహారం ఆర్డర్ చేయవచ్చు.

7.*రైల్ మదద్*: ఈ ఫీచర్‌ను ఉపయోగించి భారతీయ రైల్వేతో నేరుగా ఫిర్యాదులు చేయడం, వాటిని ట్రాక్ చేయవచ్చు.

8.*రీఫండ్ రిక్వెస్ట్‌లు*: రద్దు చేయబడిన లేదా మిస్ అయిన ప్రయాణాల కోసం రీఫండ్‌లను యాప్ ద్వారా సులభంగా రిక్వెస్ట్ చేయండి.  

9.*ఆర్-వాలెట్*: రైల్వే డిజిటల్ వాలెట్ ఫీచర్ ఆర్-వాలెట్‌ను ఉపయోగించి, వివిధ సేవల కోసం సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన చెల్లింపులు చేయవచ్చు.

ఈ ఆప్ దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో ఉపయోగించగలిగే విధంగా రూపొందించారు.

అలాగే, ఈ రోజు నుండి తత్కాల్ రిజర్వేషన్ రూల్స్ ఈ క్రింద విధంగా మార్చారు.

*ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి*
 తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ కోసం IRCTC వెబ్‌సైట్/యాప్‌లో ఆధార్ ఆధారిత ధ్రువీకరణ అవసరం.

*OTP ధ్రువీకరణ* జూలై 15 నుండి, ఆన్‌లైన్ మరియు కౌంటర్ బుకింగ్‌లకు ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు OTP ధ్రువీకరణ తప్పనిసరి.

*ఏజెంట్లు టిక్కెట్లు* కొనుగోలుపై నిషేధం: తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన మొదటి 30 నిమిషాలు (AC: 10:00-10:30 AM, నాన్-AC: 11:00-11:30 AM వరకు) ఏజెంట్లు టిక్కెట్లు బుక్ చేయడం నిషేధం.

*రిజర్వేషన్ చార్ట్* రిజర్వేషన్ చార్ట్‌లు రైలు బయలుదేరే 8 గంటల ముందు తయారవుతాయి.(గతంలో ఇది 4 గం.ల ముందు వుండేది)

Tuesday, July 8, 2025

40వేల కోట్ల సంక్షోభాన్ని పరిష్కరించిన మహిళ

ఆమె అనుకోకుండా భారతదేశం ఎదుర్కొంటున్న ₹40,000 కోట్ల సంక్షోభాన్ని పరిష్కరించి, భారతదేశాన్ని గర్వపడేలా చేసింది!

భారతదేశం ప్రతి సంవత్సరం 26 మిలియన్ టన్నుల ఉల్లిపాయలను పండిస్తుంది. కానీ 40% ప్రజలకు చేరేలోపు కుళ్ళిపోతుంది,  వృధా అవుతుంది.

రైతులు చెడిపోవడాన్ని గుర్తించడానికి వాసనపై ఆధారపడతారు. వారికి తెలిసే సమయానికి, అది చాలా ఆలస్యం అవుతుంది.

ప్రతి సంవత్సరం, కళ్యాణి షిండే తండ్రి తన ఉల్లిపాయ పంటలో 50% చెడిపోయి కోల్పోయాడు.

కానీ ఆమె తరువాత నిర్మించినది లక్షలాది మంది రైతుల కోసం ప్రతిదీ మార్చివేసింది.

కాబట్టి కళ్యాణి ఎవరూ ఊహించనిది చేసింది.
తన తండ్రి బాధపడటం చూడలేని కుమార్తె.
ఆమె ఇప్పటికీ కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థిని.

ఆమె ఆసియాలోనే అతిపెద్ద ఉల్లిపాయ మార్కెట్ అయిన లాసల్గావ్‌కు వెళ్లి ఒక పరిష్కారాన్ని నిర్మించింది.

కేవలం ₹3 లక్షల నిధులతో, ఆమె గొడామ్ సెన్స్‌ను సృష్టించింది - ఇది ఉల్లిపాయ చెడిపోవడాన్ని ప్రారంభించే ముందు గుర్తించే భారతదేశపు మొట్టమొదటి IoT పరికరం.

ఈ IoT పరికరం వీటిని ట్రాక్ చేస్తుంది:

📌 ఉష్ణోగ్రత , తేమ మార్పులు నిజ సమయంలో
📌 ప్రారంభ దశలో చెడిపోవడం వల్ల వచ్చే వాయు ఉద్గారాలు
📌 కేవలం 1% మాత్రమే కుళ్ళిపోవడం ప్రారంభించినప్పుడు హెచ్చరికలను పంపుతుంది

నేడు, ఆమె పరికరాన్ని ఉపయోగించే రైతులు తమ ఉల్లిపాయలలో 20–30% ఆదా చేస్తున్నారు

కళ్యాణి కీర్తిని కోరుకోలేదు. ఆమె తన తండ్రి పంటను కాపాడుకోవాలనుకుంది, అలా చేయడం ద్వారా, ఆమె భారతదేశంలో అతిపెద్ద నిల్వ సంక్షోభాన్ని పరిష్కరించింది. 

మన ప్రపంచాన్ని నిశ్శబ్దంగా మారుస్తున్న కీర్తిలేని హీరోల కథలు ఇవన్నీ.

♥️♥️♥️
🇮🇳🇮🇳🇮🇳

నరసాపురం నుంచి అరుణాచలం ట్రైన్

👉 విజయవాడ నుంచి అరుణాచలం ప్రతి బుధవారం సాయంత్రం 4:30 గంటలకు స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంది

🚆 అరుణాచల యాత్రకు ప్రత్యేక రైళ్లు.. ఏపీలో ఈ స్టేషన్లకు హాల్ట్!

🛕 నర్సాపూర్ ↔ తిరువణ్ణామలై - భక్తుల కోసం స్పెషల్ రైళ్లు ప్రారంభం!

🔔 శ్రావణ పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని పవిత్ర అరుణాచల క్షేత్రానికి భక్తుల రాకపోకల కోసం
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనుంది.

📅 రైలు నంబర్లు & తేదీలు:

🔹 07219 (నర్సాపూర్ → తిరువణ్ణామలై):
▪️ ప్రయాణం ప్రారంభం: మధ్యాహ్నం 1:00
▪️ గమ్యం చేరిక: మరుసటి రోజు ఉదయం 4:55
▪️ రోజులు: జులై 9, 16, 23 | ఆగస్టు 6, 13, 20 | సెప్టెంబర్ 3, 24

🔹 07220 (తిరువణ్ణామలై → నర్సాపూర్):
▪️ ప్రయాణం ప్రారంభం: ఉదయం 11:00
▪️ గమ్యం చేరిక: మరుసటి రోజు తెల్లవారుజామున 2:00
▪️ రోజులు: జులై 10, 17, 24 | ఆగస్టు 7, 14, 21 | సెప్టెంబర్ 5, 25

🛤️ ఈ రైలు ఆగే ప్రధాన స్టేషన్లు (APలో):

✔️ పాలకొల్లు
✔️ భీమవరం
✔️ ఆకివీడు
✔️ కైకలూరు
✔️ గుడివాడ
✔️ విజయవాడ
✔️ తెనాలి
✔️ బాపట్ల
✔️ చీరాల
✔️ ఒంగోలు
✔️ నెల్లూరు
✔️ రేణిగుంట
✔️ తిరుపతి
✔️ పాకాల
✔️ చిత్తూరు
✔️ కాట్పాడి
✔️ వేలూరు

🎫 రిజర్వేషన్ బుకింగ్ ప్రారంభమైంది!
భక్తులు ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకోండి.

Sunday, July 6, 2025

శుభ్‌మన్ గిల్: భారత దేశ క్రికెట్ లో ఒక యువ సంచలనం ..


Shubman Gill  జీవిత కథ! 🌟
ఒక సాధారణ దిగివు మధ్య తరగతి రైతు కుటుంబం నుండి ఒక భారత దేశ క్రికెట్ టీం కెప్టెన్ గా ఎదిగిన తీరు అమోఘం ...👏🏻👏🏻👏🏻💐💐

1999 సెప్టెంబర్ 8న పంజాబ్‌లోని ఫాజిల్కాలో జన్మించిన శుభ్‌మన్ గిల్, భారత క్రికెట్‌లో 'ప్రిన్స్'గా పేరు పొందాడు. 🌾 రైతు కుటుంబంలో పుట్టిన శుభ్‌మన్ తండ్రి లఖ్వీందర్ సింగ్ క్రికెటర్ కావాలనే కలను సాకారం చేయలేకపోయినా, తన కొడుకు కలలను నెరవేర్చేందుకు అంకితమయ్యాడు. 🏏 మూడేళ్ల వయసులోనే బ్యాట్ పట్టిన శుభ్‌మన్, తన తండ్రి శిక్షణలో రోజుకు 500-700 బంతులు ఆడేవాడు. 2007లో కుటుంబం మొహాలీకి మారింది, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం సమీపంలో శుభ్‌మన్ శిక్షణ కొనసాగింది.

గిల్ జీవితం లో తన తండ్రి పాత్ర ఎంతో ఉంది 
శుభ్‌మన్ గిల్ తండ్రి "లఖ్వీందర్ సింగ్ గిల్"

లఖ్వీందర్ సింగ్ గిల్ పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలోని చక్ జైమల్ సింగ్ వాలా (చక్ ఖేరే వాలా అని కూడా పిలుస్తారు) గ్రామంలో రైతుగా జీవనం సాగిస్తారు. అతను జాట్ సిక్కు కుటుంబానికి చెందినవారు. యువకుడిగా లఖ్వీందర్‌కు క్రికెటర్ కావాలనే బలమైన కల ఉండేది, కానీ కుటుంబ బాధ్యతలు మరియు అవకాశాల కొరత వల్ల ఆ కలను సాకారం చేసుకోలేకపోయారు. అయినప్పటికీ, తన కొడుకు శుభ్‌మన్‌లో క్రికెట్ పట్ల ఆసక్తిని గుర్తించి, అతని ప్రతిభను ప్రోత్సహించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు.

👉🏻 శుభ్‌మన్ క్రికెట్ ప్రయాణంలో లఖ్వీందర్ పాత్ర:

1. ప్రారంభ శిక్షణ : శుభ్‌మన్ మూడేళ్ల వయసు నుండే క్రికెట్ బ్యాట్‌తో ఆడటం ప్రారంభించాడు. లఖ్వీందర్ తన కొడుకు ప్రతిభను గుర్తించి, అతనికి తొలి కోచ్‌గా వ్యవహరించారు. రోజూ 500-700 బంతులు విసిరేవారు, శుభ్‌మన్‌ను ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొనేలా శిక్షణ ఇచ్చారు. అతను చార్పాయ్ (మంజీ) మీద నుండి బంతులు విసరడం ద్వారా బంతి వేగాన్ని పెంచేవారు, ఇది శుభ్‌మన్‌కు బ్యాట్‌తో ఖచ్చితత్వం పెంచడంలో సహాయపడింది.

2. పొలంలో క్రికెట్ మైదానం : లఖ్వీందర్ తన వ్యవసాయ భూమిలో శుభ్‌మన్ కోసం ఒక చిన్న క్రికెట్ మైదానాన్ని నిర్మించారు మరియు టర్ఫ్ పిచ్‌ను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ఇతర బాలురను శుభ్‌మన్ వికెట్ తీస్తే 100 రూపాయల బహుమతి ఇస్తానని సవాలు చేసేవారు, ఇది శుభ్‌మన్ ఆటను మరింత ఆసక్తికరంగా మార్చింది.

3.  మొహాలీకి స్థానమార్పిడి : శుభ్‌మన్ క్రికెట్ శిక్షణకు మెరుగైన అవకాశాలు కల్పించడానికి, లఖ్వీందర్ 2007లో తన కుటుంబాన్ని ఫాజిల్కా నుండి మొహాలీకి తరలించారు. అక్కడ వారు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) స్టేడియం సమీపంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ నిర్ణయం శుభ్‌మన్ కెరీర్‌కు కీలకమైంది, ఎందుకంటే అతను PCA అకాడమీలో చేరి మెరుగైన శిక్షణ పొందగలిగాడు.

4. కఠినమైన కోచింగ్ : లఖ్వీందర్ శుభ్‌మన్‌కు కఠినమైన కోచ్‌గా ఉండేవారు. శుభ్‌మన్ మ్యాచ్‌లో మంచి స్కోర్ చేసినా, పెద్ద స్కోర్‌లను సాధించలేకపోతే, లఖ్వీందర్ అతన్ని మెరుగుపరచడానికి సలహాలు ఇచ్చేవారు. ఉదాహరణకు, 2022లో జింబాబ్వే సిరీస్‌లో శుభ్‌మన్ 33 పరుగులకే ఔట్ అయినప్పుడు, అతను తన తండ్రి నుండి సలహాలు అందుకున్నాడు.

5. మానసిక మద్దతు : శుభ్‌మన్ తన విజయాలకు తండ్రిని ఎల్లప్పుడూ కృతజ్ఞతతో స్మరించుకుంటాడు. 2019 ఫాదర్స్ డే సందర్భంగా, శుభ్‌మన్ ఒక X పోస్ట్‌లో తన తండ్రికి కృతజ్ఞతలు తెలిపాడు: "నా తండ్రి నా చేయి పట్టలేనప్పుడు, నా వెనుక ఉన్నాడు. మీరు చేసినవాటికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను."

 లఖ్వీందర్ యొక్క కృషి మరియు త్యాగాలు:
- "త్యాగాలు": శుభ్‌మన్ క్రికెట్ కెరీర్ కోసం, లఖ్వీందర్ తన వ్యవసాయ పనిని వదిలి, గ్రామంలోని అనేక కుటుంబ కార్యక్రమాలను, వివాహ వేడుకలను కూడా త్యాగం చేశారు. అతను 15 సంవత్సరాలు శుభ్‌మన్ క్రికెట్ శిక్షణకు అంకితం చేశారు.

-  స్ఫూర్తి : లఖ్వీందర్ తన కలను శుభ్‌మన్ ద్వారా సాకారం చేసుకున్నాడు. శుభ్‌మన్ 2019లో భారత జాతీయ జట్టులో చోటు సంపాదించినప్పుడు, లఖ్వీందర్ తన కల నెరవేరినట్లు భావించాడు.

👉🏻 శుభ్‌మన్ ఆటలో లఖ్వీందర్ ప్రభావం:
లఖ్వీందర్ శుభ్‌మన్ ఆటలో దూకుడు స్వభావాన్ని ప్రోత్సహించారు. 2024లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో శుభ్‌మన్ ఫామ్‌ను తిరిగి పొందడంలో, అతను తన అండర్-16 రోజుల్లో ఉపయోగించిన "స్టెప్ అవుట్" టెక్నిక్‌ను తిరిగి ఉపయోగించడం వల్లనే సాధ్యమైందని లఖ్వీందర్ చెప్పారు. అతను శుభ్‌మన్‌ను ఎల్లప్పుడూ తన సహజ ఆటను ఆడమని ప్రోత్సహించేవారు.

- లఖ్వీందర్ శుభ్‌మన్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడరు, అతను ఇప్పుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలడని భావిస్తారు.
- అతను శుభ్‌మన్ విజయాలను చూస్తూ గర్వంగా ఉంటాడు, ముఖ్యంగా 2024లో ధర్మశాలలో ఇంగ్లండ్‌పై శుభ్‌మన్ నాల్గవ టెస్టు సెంచరీ సాధించినప్పుడు, లఖ్వీందర్ స్టేడియంలో ఉన్నాడు మరియు భావోద్వేగంతో కనిపించాడు.

లఖ్వీందర్ సింగ్ గిల్ శుభ్‌మన్ క్రికెట్ కెరీర్‌లో కీలక పాత్ర పోషించాడు, అతని త్యాగాలు, శిక్షణ, మరియు మద్దతు శుభ్‌మన్‌ను భారత క్రికెట్‌లో "ప్రిన్స్"గా నిలబెట్టాయి.

12 ఏళ్ల వయసులో అండర్-14 టీంలో చోటు సంపాదించిన గిల్, అండర్-16లో 351 పరుగులతో రికార్డు సృష్టించాడు. 2018 అండర్-19 వరల్డ్ కప్‌లో 372 పరుగులతో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు, పాకిస్థాన్‌పై అజేయమైన 102 పరుగులతో రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు. 🏆

2019లో న్యూజిలాండ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గిల్, ODIలో 38 ఇన్నింగ్స్‌లో 2000 పరుగులు, 50 ఇన్నింగ్స్‌లో 2500 పరుగులు సాధించి వేగవంతమైన రికార్డు సృష్టించాడు. 23 ఏళ్ల వయసులో ODIలో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా నిలిచాడు. 🇮🇳 2025 ICC చాంపియన్స్ ట్రోఫీలో వైస్-కెప్టెన్‌గా భారత్‌ను విజయపథంలో నడిపించాడు.

పంజాబ్ తరపున దేశవాళీ క్రికెట్‌లో, గుజరాత్ టైటాన్స్‌కు IPLలో కెప్టెన్‌గా గిల్ మెరిసాడు. 2023 IPLలో 890 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచాడు.

 🧢 ఇంగ్లండ్‌లో రెండు టెస్టు సెంచరీలు సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆసియా కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. 

శుభ్‌మన్ గిల్ కథ, కష్టం, అంకితభావం, పట్టుదలతో నిండిన ఒక యువ క్రికెటర్ ప్రయాణం! 💪 #ShubmanGill #CricketStar #inspiration #indiancaptain #ప్రిన్స్ #prince